కరోనావైరస్ లాక్డౌన్: తెలంగాణ నుంచి ఝార్ఖండ్కు బయలుదేరిన వలస కార్మికుల తొలి రైలు

ఫొటో సోర్స్, ANI
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలోని లింగంపల్లి స్టేషన్ నుంచి ఝార్ఖండ్లోని హతియా స్టేషన్కి 1,230 మంది వలస కార్మికులతో 24 బోగీల ప్రత్యేక రైలు బయల్దేరింది. ఆ రైలులో బయలుదేరిన వారంతా ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో నిర్మాణ పనులు చేసే ఝార్ఖండ్ వాసులు.
ఝార్ఖండ్ ప్రభుత్వం సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఈ రైలును ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్నారు. దేశంలో వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చిన తర్వాత రెండు రోజుల్లో ఈ ఏర్పాటు చేశారు.
“వారంతా హైదరాబాద్ ఐఐటీ క్యాంపలో నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు. అక్కడ దాదాపు 2,400 మంది ఉన్నారు. వారిలో 1,230 మంది ఝార్ఖండ్ వారు. నిన్న రాత్రి చాలా తక్కువ సమయంలో రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలులో వెళ్లేవారందరికీ క్యాంపులోనే స్క్రీనింగ్ చేశాం. తరువాత వారిని బస్సుల్లో స్టేషన్కు తరలించాం’’ అని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర రెడ్డి బీబీసీతో చెప్పారు.
ఈ మొత్తం ప్రక్రియను ఆయనే పర్యవేక్షించారు. ఈ కార్మికుల ప్రయాణ ఖర్చంతా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోందని అధికారులు ధ్రువీకరించారు.

ఫొటో సోర్స్, ANI
అయితే, హైదరాబాద్లోని వలస కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తోన్న స్వచ్ఛంద సంస్థ ఝార్ఖండ్ సమాజ్ సంఘ్ మాత్రం తమకు ఈ రైలు గురించి ఏమాత్రం సమాచారం లేదని అంటోంది.
“మేం ఇళ్లకు వెళ్లడానికి రైళ్ల కోసం ఓపికగా ఎదురు చూస్తున్నాం. మాలో చాలామందిమి ఇతరుల సాయంపై ఆధారపడి బతుకుతున్నాం. ఆ రైలు గురించి మాకెవరికీ సమాచారం లేదు. కానీ, ఈ ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారన్న వార్త వినగానే, మా వాట్సాప్ గ్రూపులో చాలా మందికి నిస్సహాయత, కోపం వచ్చాయి’’ అని అజయ్ కుమార్ అన్నారు.
తమకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయకపోవడం అన్యాయమని బిహార్, ఉత్తర్ప్రదేశ్, ఒడిశాలకు చెందిన వలస కార్మికులు అంటున్నారు.
హైదరాబాద్ ఐఐటీలో పనిచేస్తోన్న ఈ కార్మికులు తాము స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల భారీ ఆందోళన చేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఒక పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. వారంతా నిర్మాణ సంస్థ ఎల్ఎండ్టీ కింద పనిచేస్తున్నారు. అయితే, గత రెండు నెలల నుంచీ వారికి జీతం రాలేదని చెబుతున్నారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు జోక్యం చేసుకున్నారు. ఈ కార్మికులపై వారి కుటంబాలు ఆధారపడి ఉంటాయని, వెంటనే వారికి జీతాలు చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశించినట్టు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంత రావు తెలిపారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

“ఐఐటీ హైదరాబాద్లో భవనాల నిర్మాణం కొనసాగించేందుకు అనుమతి రాగానే వారిని పనిలోకి రావాలని పిలిచారు. అప్పుడే ఈ నిరసన జరిగింది. కానీ, గత రెండు నెలల డబ్బూ అందకపోవడంతో గొడవ మొదలైంది. చాలామంది తమను వెనక్కి పంపేయాలని డిమాండ్ చేశారు” అని జిల్లా కలెక్టర్ ఏప్రిల్ 27న వివరించారు.
ప్రస్తుతానికి వారికి మార్చి నెల జీతాలు చెల్లించినట్లు తెలిసింది.

ఫొటో సోర్స్, ANI
రైలులో వారంతా సామాజిక దూరం పాటించేలా అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలూ తీసుకున్నామని రైల్వే పోలీస్ ఫోర్స్ డీజీ అరుణ్ కుమార్ తెలిపారు.
“వాళ్లను లింగంపల్లి రైల్వే స్టేషన్కు తీసుకొచ్చే ముందే స్థానిక అధికారులు వారిని స్క్రీన్ చేశారు. ఇది నాన్ స్టాప్ రైలు. లింగంపల్లి నుంచి హతియా వరకూ మధ్యలో ఎక్కడా ఆగదు. ప్రతీ బోగీలో మామూలుగా 72 మంది ప్రయాణించే వీలుంటుంది. ఇప్పుడు 54 మంది మాత్రమే వెళ్తున్నారు. వారితో పాటూ రైలులో ఆర్పీఎఫ్ స్క్వాడ్ కూడా ప్రయాణిస్తోంది. భోజనం, మాస్కులు అన్నీ చూసుకున్నాం” అని ఆయన వివరించారు.

కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- మే డే: ఏమిటి? ఎందుకు?
- "పేదల చేతుల్లో డబ్బులు ఉండేలా చూడాలి.. అందుకోసం భారత్ డబ్బులు ముద్రించొచ్చు" - నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ
- కరోనావైరస్ లాక్డౌన్: ముంబయి బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద వేల సంఖ్యలో గుమిగూడిన వలస కార్మికులు
- కరోనా లాక్డౌన్: ఈ కార్మికుడు భార్యను ఎక్కించుకుని సైకిల్పై 750 కిలోమీటర్లు ప్రయాణించాడు
- కరోనావైరస్ సంక్షోభం: సమానత్వం, న్యాయమే పునాదిగా సరికొత్త సమాజాన్ని నిర్మించేందుకు ఇది సదవకాశమా?
- ఇండియా లాక్డౌన్: వలస కార్మికుల కష్టాలు.. తప్పెవరిది? మోదీ ఎందుకు క్షమాపణ చెప్పారు?
- రెమ్డెసివీర్: కరోనావైరస్పై పోరాడే శక్తి ఈ ఔషధానికి కచ్చితంగా ఉందంటున్న అమెరికా
- మాజీ క్రికెటర్ కంపెనీ రూపొందించిన వెంటిలేటర్కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్
- ‘ఆర్థికవ్యవస్థ గాడిన పడాలంటే లాక్డౌన్ త్వరగా ముగించాలి’
- లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేయాలో ఎలా నిర్ణయిస్తారు
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- కరోనావైరస్ లాక్ డౌన్తో సర్కస్లు ఇక అంతరించిపోయినట్లేనా?
- కరోనావైరస్: శ్రీకాళహస్తిలో కోవిడ్ కేసులు హఠాత్తుగా ఎలా పెరిగాయి? ఈ రెడ్ జోన్ గురించి ఎవరేమంటున్నారు
- సామాజిక దూరం పాటించమంటే దేశంలో వ్యతిరేకత ఎందుకు వస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








