BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
హార్ముజ్ జలసంధిలో భారత జెండాతో ఉన్న రెండు నౌకలపై కాల్పులు, ఇరాన్ రాయబారికి భారత్ సమన్లు
హార్ముజ్ జలసంధిలో భారత జెండాతో ఉన్న రెండు నౌకలపై కాల్పులు జరిగిన ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనగా, భారత ప్రభుత్వం ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది.
రష్యా చమురుపై అమెరికా యూ-టర్న్.. భారత్కు భారీగా కలిసిరానుందా?
రష్యా చమురుపై ఇచ్చిన మినహాయింపు ముగిసిందని అమెరికా ఆర్థిక మంత్రి రెండు రోజుల కిందటే ప్రకటించారు. కానీ, ఇప్పుడు గడువు మళ్లీ పెంచారు. ఇది కేవలం ట్రంప్ మాత్రమే కాదు, 'మొత్తం టీమ్ యూ-టర్న్' అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల భారత్కు ఒనగూరే ప్రయోజనమేంటి?
'ఆధారాలుంటే తీసుకురండి, మా దగ్గరేమీ మంత్రదండం లేదన్న పోలీసులు', కొడుకు మరణానికి ఆధారాలు సేకరించి తెచ్చిన ఓ అమ్మ కథ..
తన కుమారుడి మరణానికి కారణమైన వారిని వెతకడానికి ఒక తల్లి సాగించిన అలుపెరగని అన్వేషణ ఇది. ఆధారాల సేకరణలో ఆమె చూపిన పట్టుదల, ఉన్నతాధికారుల తాజా ఆదేశాలతో ఈ కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఇంతకీ ఏమిటీ కేసు? అసలేమైంది?
మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవాలని అనుకుంటున్నారా, అయితే ఇవి తెలుసుకోండి..
తెలిసినవారి పేర్లు మర్చిపోవడం, దుకాణానికి వెళ్లినప్పుడు తీసుకురావాల్సిన సరుకులు గుర్తుకురాకపోవడం, ముఖ్యమైన పరీక్షకు లేదా జాబ్ ఇంటర్వ్యూకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక్కక్షణం మీ మెదడులో ఉన్న సమాచారమంతా ఎగిరిపోవడం.. వంటివి మీకూ జరిగే ఉంటాయి. మరి మెమరీని పెంచుకోవడమెలా?
రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం బీజేపీకి ఎదురుదెబ్బా?
పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం ప్రభుత్వానికి సభలో అంత సంఖ్యాబలం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాల మద్దతు లేకుండా ఈ బిల్లును ఆమోదించడం సాధ్యం కాదు. బిల్లు వీగిపోవడం ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
రోల్స్ రాయిస్, బెంజ్ కార్లపై 'ఎలుగుబంటి' దాడి చేసిందంటూ మోసం, ముగ్గురికి జైలు శిక్ష
లేక్ ఆరోహెడ్లో, 2024 జనవరి 28న 2010 రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారులో ఎలుగుబంటి ఉన్నట్లు చూపిస్తున్న ఒక వైరల్ వీడియోను బీమా కంపెనీకి సాక్ష్యంగా అందజేశారు. అదే ప్రాంతం నుంచి, అదే రోజున మరో రెండు ఖరీదైన మెర్సిడెస్ కార్లు కూడా దాడికి గురయ్యాయంటూ బీమా సొమ్ము కోసం దరఖాస్తులు వచ్చాయి.
వీడియో, హైదరాబాద్: పదేళ్లలో ఉక్కపోత ఇంతగా ఎందుకు పెరిగింది?, వ్యవధి 10,37
తెలంగాణాలో వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రం అవుతున్నాయా? హైదరాబాద్లో పదేళ్లలో ఉక్కపోత ఇంతగా ఎందుకు పెరిగింది? హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఏం చెబుతున్నారు?
తామరకాడతో ఊపిరి తీసుకుంటూ 5 గంటలపాటు చెరువులో దాక్కున్న దొంగ.. చివరకు ఎలా చిక్కాడంటే..
హర్విందర్ ఎప్పుడూ ఏసీ కోచ్ల్లోనే దొంగతనం చేసేవాడు. మొదట్లో అతను సాధారణ ప్రయాణికుడిలాగే రైలు టికెట్ తీసుకుని ప్రయాణించేవాడు. అయితే రైలులో కెమెరాలు అమర్చడం, ఆన్లైన్లో టికెట్ అమ్మకాలు మొదలైన తర్వాతి నుంచి అతను టికెట్ తీసుకోవడం మానేశాడు. రైలు ఎక్కగానే అతని దృష్టి మొదట టీసీపై ఉండేది.
తెలంగాణ కులగణన: కాపులకు 12, ఎస్సీ డక్కల్కు 116.. ఏమిటీ 'సీబీఐ' పాయింట్లు?
విద్య, వృత్తి, ఆదాయం, స్థిరాస్తులు, జీవన స్థితిగతులు, లింగ భేదం, సామాజిక వివక్ష, విద్యాసంస్థల్లో చేరికలు.. ఇలా వివిధ అంశాల ఆధారంగా ప్రభుత్వం కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ (సీబీఐ)ను నిర్ణయించింది. దీని ఆధారంగా 0 నుంచి 126 మధ్య స్కోర్ (మార్కులు) కేటాయించింది. ఎంత ఎక్కువ స్కోర్ వస్తే, అంత వెనుకబడిన కులంగా భావిస్తారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
షార్ట్ వీడియోలు
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.


































































