కరోనావైరస్: ఈ మహమ్మారికి ముంబయి కేంద్రంగా ఎలా మారింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మయాంక్ భగవత్
- హోదా, బీబీసీ కోసం
దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారుతోంది.
మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 600 దాటింది. అందులో 377 కేసులు ముంబయి నగరంలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం 400 మందికి పైగా కరోనా బాధితులు ముంబయిలో చికిత్స పొందుతున్నారు.
కరోనా రోగులతో సన్నిహితంగా మెలిగిన 5,443 మందిని ముంబయి నగర పాలక సంస్థ (బీఎంసీ) గుర్తించింది. వారందరినీ స్వీయ నిర్బంధంలో ఉంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
వాణిజ్య కేంద్రంగా ఉన్న ముంబయి నగరానికి అధికారిక పనుల మీద నిత్యం అనేక మంది విదేశీయులు వస్తూ వెళ్తుంటారు. లక్షల మంది భారతీయులు ఈ నగరం నుంచి విదేశీ ప్రయాణాలు చేస్తుంటారు. ముంబయిలో ఎక్కువగా కేసులు నమోదు కావడానికి అది ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.
ముంబయిలో మార్చి ఆరంభంలో తొలి కేసు నిర్ధరణ అయ్యింది. ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ ఈ మహమ్మారి వ్యాప్తి చెందింది.
విదేశాల నుంచి తిరిగి వచ్చిన వ్యక్తుల ద్వారా కరోనావైరస్ భారత్కు వచ్చింది. ఇప్పుడు దేశంలోని సామాన్య ప్రజలు కూడా దీని బారిన పడుతున్నారు.

ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మొదట మార్చి 17న ముంబయిలో పాక్షిక లాక్డౌన్ ప్రకటించింది. అయితే, ప్రయాణాలను విరమించుకోవాలని ప్రభుత్వం ఎంతగా విజ్ఞప్తి చేసినా ప్రజలు పెడచెవిన పెట్టారు. దాంతో, లోకల్ రైళ్లను, బస్సులను పూర్తిగా ఆపేసి, పూర్తిస్థాయి లాక్డౌన్ విధించింది ప్రభుత్వం.
థర్మల్ స్క్రీనింగ్, కరోనా పరీక్షల సంఖ్య పెరగడంతో, ముంబయిలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయింది.
ఇప్పుడు లక్షల మంది పేదలు నివసించే నగరంలోని మురికివాడల్లోనూ కోవిడ్ -19 కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు నగరంలో అధికారులు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.
ముంబయిలో కంటైన్మెంట్ జోన్లు ఇవే
తూర్పు శివారు ప్రాంతాలు-
చీతా క్యాంప్, మన్ఖర్డ్, చెంబూర్, గోవాండి శివాజినగర్, ఘాట్కోపర్ (పశ్చిమ), పవాయి, హీరానందని చండివాలి, ములుంద్ (తూర్పు), నహూర్, భండూప్లోని కొన్ని భాగాలు.
పశ్చిమ శివారు ప్రాంతాలు- ఓషివరా, జోగేశ్వరి(తూర్పు, పశ్చిమ), అంధేరి, అంధేరి ఎంఐడీసీ, వెర్సోవా, విలే పార్లే, కలీనా, శాంటాక్రూజ్ (పశ్చిమ), ఖార్ (పశ్చిమ), బాంద్రా (పశ్చిమ), కుర్లా.
సెంట్రల్ ముంబయి- వర్లి, ప్రభాదేవి, అంటోప్ హిల్, లోయర్ పరేల్, శివాడి, కాటన్గ్రీన్లోని కొన్ని భాగాలు.
దక్షిణ ముంబయి- మలబార్ హిల్, కంబాలా హిల్, గ్రాంట్ రోడ్, నాగ్పాడా, మసీదు బందర్, గిర్గాం.
ధారావి మురికివాడకు కరోనా ఎలా చేరుకుంది?
ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా చెప్పే, ధారావిలో కరోనా సోకి తాజాగా ఒక వ్యక్తి చనిపోయారు.
విదేశాల నుంచి వచ్చిన కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మురికివాడలకు కూడా కరోనావైరస్ వ్యాప్తి చెందుతోందని రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు.
జై భోలేనగర్కు చెందిన ఓ టాక్సీ డ్రైవర్ కరోనా సోకి మరణించారు. ఆ డ్రైవర్ విమానాశ్రయం నుంచి విదేశీ ప్రయాణికులను తీసుకెళ్లారు.
విషునగర్లో విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా వారి ఇంట్లో పనిచేసే 65 ఏళ్ల మహిళకు కరోనా సోకింది.
“విదేశాల నుంచి వచ్చినవారు ఈ వైరస్ను తీసుకొచ్చారు. వారిని ప్రభుత్వం నిర్బంధించలేదు. వారు తమ ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం చెప్పింది. కానీ, వారు ఆ సూచనలను పట్టించుకోకుండా, బయట తిరిగారు. వారి ఇళ్లలో పనిచేసే వారు కూడా వైరస్ బారిన పడ్డారు. ఆ పనిమనుషుల ద్వారా ఇతర ఇళ్లకు కూడా వైరస్ విస్తరించింది. అలా మురికి వాడలకు కూడా ఆ వైరస్ పాకి ఉంటుంది” అని పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ అమోల్ అన్నాడేట్ చెప్పారు.
“మురికివాడల్లో ఉంటున్నవారు విద్యావంతులు కాదు. ఒకే గదిలో 10 నుంచి 15 మంది ఉంటారు. అందులో ఒకరికి వైరస్ సోకితే, మిగతా వారికి కూడా వేగంగా వ్యాపిస్తుంది. కొందరికి తమకు ఎలాంటి రోగం రాదనే మూఢనమ్మకాలు ఉన్నాయి. లాక్డౌన్ సమయంలోనూ వారు ఎప్పటిలాగే తిరుగుతుంటారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోరు” అని సియోన్-ధారవి ప్రాంతంలో 35 ఏళ్లుగా పని చేస్తున్న డాక్టర్ అనిల్ పచ్చనేకర్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అపోహలు కారణమయ్యాయా?
కోవిడ్-19 గురించి ప్రజలకు చాలా అపోహలు ఉండటం, సరైన అవగాహన లేకపోవడమే ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
"చాలామంది స్వీయ- నిర్బంధం, సామాజిక దూరం పాటించడంలేదు. ఈ వ్యాధిని చాలా తేలికగా తీసుకుంటున్నారు. ఇది తమను ఏం చేయలేదని అనుకుంటున్నారు. కరోనా వ్యాప్తికి ఇది కూడా ఒక కారణం కావచ్చు” అని బీఎంసీ డిప్యూటీ కమిషనర్ కిరణ్ దిఘావాకర్ చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సమాచారం ప్రకారం, కరోనావైరస్ వెడి, తేమతో కూడిన వాతావరణంలో కూడా వ్యాపిస్తుంది. కానీ, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందదనే అపోహతో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిఘా నీడలో అనుమానితులు
మహారాష్ట్రలో దాదాపు 43 వేల మంది గృహ నిర్బంధంలో, 2,913 మంది ప్రభుత్వం ఆధ్వర్యంలోని క్వారంటైన్ కేంద్రాలలో ఉన్నారు.
ముంబయిలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి చెబుతున్నారు.
"ముంబయిలో నిర్బంధంలో ఉన్నవారిని నాలుగు వేల మంది బీఎంసీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారందరినీ పరిశీలిస్తున్నాం. వారిపై నిఘా పెట్టేందుకు అవసరమైతే డ్రోన్లు, జీపీఎస్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటాం” అని మంత్రి తెలిపారు.
మురికివాడల్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. మురికివాడల్లోని కరోనా రోగులతో కలిసి తిరిగిన వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించే అవకాశం ఉంది.
మురికివాడల్లో నివసించే ప్రజలకు ఆహార పదార్థఆలు, తాగు నీరు అందిండచం మరో సవాలుగా మారింది.
"జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్న చాలామంది వైద్యులను సంప్రదిస్తున్నారు. వైరల్ జ్వరం కూడా, కరోనా లక్షణంలాగే ఉంటుంది. కాబట్టి వైద్యులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సాధారణ జ్వరం అయితే కొన్ని రోజులకే తగ్గిపోతుంది. తగ్గకపోతే, ఆ రోగి ఛాతి భాగాన్ని ఎక్స్-రే తీసి, ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలి” అని భారత వైద్య మండలి ఉపాధ్యక్షుడు డాక్టర్ పచ్చనేకర్ సూచిస్తున్నారు.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- కరోనావైరస్: యూరప్లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- లాక్డౌన్ ఎఫెక్ట్: మహారాష్ట్ర నుంచి తమిళనాడు - 1,200 కిలోమీటర్లు కాలినడకన ఇళ్లకు చేరిన యువకులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









