లాక్డౌన్ ఎఫెక్ట్: మహారాష్ట్ర నుంచి తమిళనాడు - 1,200 కిలోమీటర్లు కాలినడకన ఇళ్లకు చేరిన యువకులు

- రచయిత, ప్రభూరావు ఆనంధన్
- హోదా, బీబీసీ కోసం
తమిళనాడులోని నాగపట్నం జిల్లా తిరువరూర్కు చెందిన ఏడుగురు యువకులు ముంబయిలో పనిచేస్తారు. అయితే, దేశవ్యాప్త లాక్డౌన్లో భాగంగా అంతటా అన్ని రకాల ప్రయాణాలనూ ప్రభుత్వాలు నిషేధించాయి. దాంతో, ఆ యువకులు 1,200 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి తమిళనాడులోని తమ సొంతూళ్లకు చేరుకున్నారు.
మార్చి 29న మహారాష్ట్రలోని ఉమర్ఖేడ్ నుంచి బయలుదేరారు. ఏప్రిల్ 4 మధ్యాహ్నం తమిళనాడులోని తిరుచ్చీ చేరుకున్నారు.
మధ్యమధ్యలో వీరు లిఫ్ట్ అడిగి లారీలు, ఆటోలు, బైక్లపైన కూడా ప్రయాణం చేశారు.
“నేను బీఎస్సీ కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ను. మహారాష్ట్రలోని ఉమెర్ఖేడ్ జిల్లాలో ఒక ప్రైవేటు సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. రెండు వారాల క్రితం మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో పెరిగింది. మేము ఉండే ప్రాంతంలో కంపెనీలన్నీ మూసివేశారు. ఉద్యోగులు ఎవరూ పనికి రావద్దని చెప్పారు” అని రాహుల్ ద్రవిడ్ బీబీసీతో చెప్పారు.

కరోనావైరస్ భయం
“నాతో పాటు ఉండే మరో 22 మంది అక్కడే ఉండిపోయారు. మా పక్క ఇంట్లో ఇంకో 46 మంది కలిసి ఉంటున్నారు. వారిలో 60 మందికి పైగా తమిళనాడు వారే. వలస కార్మికుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం సహాయ శిబిరాలు ఏర్పాటు చేసింది. మమ్మల్ని అక్కడే ఉండాలని అధికారులు చెప్పారు.
అయితే, మాకు అక్కడి భాష (మరాఠీ) అర్థం కాదు. పోలీసులతో, రెవెన్యూ అధికారులతో సరిగా మాట్లాడలేకపోయాం. మరోవైపు, మీ స్వస్థలాలకు వెళ్లిపోండంటూ స్థానికులు మమ్మల్ని బెదిరించారు. దాంతో, ఆ క్యాంపులో ఉండలేకపోయాం. ఈ సమస్యలే కాకుండా, దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నది మహారాష్ట్రలోనే. అక్కడ ఉంటే మాకు కూడా అది సోకుతుందేమోనని భయపడ్డాం. ఎలాగైనా మా సొంతూళ్లకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం” అని రాహుల్ ద్రవిడ్ వివరించారు.
ఇంటికి చేరడమే లక్ష్యం
“లాక్డౌన్ కారణంగా ఎలాంటి రవాణా సదుపాయం లేదు. కాలినడకనే వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మొదట 50 మంది కలిసి వెళ్దామని అనుకున్నాం. కానీ, మధ్యలో పోలీసులు అరెస్టు చేస్తారేమో అన్న భయంతో 43 మంది వెనక్కి తగ్గారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులోనే వాళ్లు ఉన్నారు.“
“ఇంటికి చేరుకోవడం మా లక్ష్యం. క్యాంపు నుంచి బయలుదేరి నాందేడ్ చేరుకున్నాం. ఉమెర్ఖేడ్లోని క్యాంపు నుంచి నాందేడ్కు 240 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ తర్వాత షోలాపూర్... అలా వందల కిలోమీటర్లు నడుస్తూ వచ్చాం. సేలం జిల్లా మీదుగా తమిళనాడు చేరుకున్నాం. తిరుచ్చి జిల్లాకు చేరుకోవడానికి దాదాపు 1000 కిలోమీటర్ల దూరం నడిచాం” అని రాహుల్ చెప్పారు.
“మధ్యలో చాలా చోట్ల పోలీసులు, రెవెన్యూ అధికారులు మమ్మల్ని ఆపారు. సమీపంలోని సహాయ శిబిరాలలో ఉండాలని సూచించారు. కానీ, మేము ఆగలేదు. ఎలాగైనా సరే ఇంటికి చేరుకోవాలని అనుకున్నాం. తమిళనాడులోకి ప్రవేశించేందుకు స్థానికులు సాయం చేశారు. మా ప్రయాణ మార్గంలో చాలావరకు దుకాణాలు, మార్కెట్లు మూసివేసి ఉన్నాయి. మధ్యలో స్వచ్ఛంద సేవకులు ఇచ్చిన ఆహారంతో పాటు, ప్రభుత్వ క్యాంపుల దగ్గర తిన్నాం.“

నిద్రలేని రాత్రులు
“కొన్ని చోట్ల మాత్రం దుకాణాలు తెరిచి ఉన్నాయి. అక్కడ బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కుని, మళ్లీ నడక ప్రారంభించాం. ఈ ప్రయాణంలో రెండు రాత్రులు నిద్రపోయాం. మిగతా రోజులు నిద్రలేకుండా రాత్రంతా నడుస్తూనే ఉన్నాం. మొదటి రోజు చాలా అలసిపోయాం. తర్వాత, మాలో ఉత్సాహం పెరిగేలా సరదాగా మాట్లాడుకోవడం ప్రారంభించాం. ఇప్పుడు 1,200 కిలోమీటర్ల దూరం నడిచామంటే మాకే ఆశ్చర్యం వేస్తోంది“ అని అని రాహుల్ అంటున్నారు.
“మేము ఇంత దూరం కాలినడకన వస్తున్నామని మా అమ్మానాన్నలకు చెప్పలేదు. లాక్డౌన్ కారణంగా మేము ఇబ్బంది పడతున్నామేమో అని వాళ్లు ఆందోళన చెందుతారు కాబట్టి, రోజూ ఫోన్లో మాట్లాడుతూ, ఉమెర్ఖేడ్ క్యాంపులో ఉన్నామని చెప్పి నమ్మించేవాళ్లం. ఈ ప్రయాణంలో మాకు ఎదురైన మరో పెద్ద సమస్య ఫోన్లలో ఛార్జింగ్ అయిపోవడం. ఫోన్లో ఛార్జింగ్ కోసం రోడ్డు పక్కన ఆపి ఉన్న వాహనాల దగ్గర ఆగేవాళ్లం. రోజూ మా కుటుంబ సభ్యులతో ఒక్కసారి మాట్లాడి మళ్లీ ఫోన్లను స్విచాఫ్ చేసేవాళ్లం.”
ఈ యువకులు తిరుచ్చి చేరుకున్నాక, స్థానిక సామాజిక కార్యకర్త అరుణ్ జిల్లా కలెక్టర్ను సంప్రదించి వీరి పరిస్థితి గురించి వివరించారు.
“తలపై లగేజీ పెట్టుకుని కాలినడకన వస్తున్న యువకులను చూశాను. మండుటెండలో తిరుచ్చి- చెన్నై రహదారిపై నడుస్తూ బాగా అలసిపోయారు. ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగితే, ఎలాంటి రవాణా సదుపాయం లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి కాలినడకనే వస్తున్నామని చెప్పారు. ఆ మాటలు వినగానే, ఇటీవల ఓ యువకుడు మహారాష్ట్ర నుంచి తమిళనాడుకు కాలినడకన బయలుదేరి చనిపోయిన విషయం నాకు గుర్తుకొచ్చింది. ఈ యువకులు అలాగే నడిస్తే, అలసిపోయి అనారోగ్యానికి గురవుతారని అనిపించింది. కొందరు మీడియా మిత్రుల సహాయంతో వీళ్ల గురించి జిల్లా కలెక్టర్కు సమాచారం అందించాను” అని అరుణ్ చెప్పారు.
“ఈ యువకులను వారివారి సొంతూళ్లలో విడిచిపెట్టేందుకు ఒక వాహనానికి అనుమతి తీసుకున్నాను. మొదట అందరినీ కరోనావైరస్ పరీక్షల కోసం తిరువరూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాను. అందరికీ నెగెటివ్ అని వచ్చింది. ఆ తర్వాత అందరినీ వారివారి ఇళ్లకు చేర్చాను” అని అరుణ్ వివరించారు.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- కరోనావైరస్: యూరప్లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









