ట్విన్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్: ఒకేచోట చేరిన 14 వేల కవలలు.. ఎక్కువ మంది రావటంతో రసాభాసగా మారిన కార్యక్రమం

ఫొటో సోర్స్, Reuters
అత్యధికమంది కవలలు ఒకేచోట నిలబడి ప్రపంచ రికార్డు సష్టించాలనుకున్నారు. అయితే, అనుకున్న రికార్డు సంఖ్య కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ మంది రికార్డు స్థాయిలో రావటంతో ఆ కార్యక్రమం రసాభాసగా మారింది.
'శ్రీలంక ట్విన్స్' అనే కార్యక్రమం నిర్వాహకులు గిన్నిస్ ప్రపంచ రికార్డు సష్టించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కొలంబోలోని మైదానాన్ని ఎంచుకున్నారు. సోమవారం దేశంలోని కవలలంతా స్టేడియం వద్దకు రావాలని పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, AFP
ప్రస్తుతం ఎక్కువ మంది కవలలు ఒకేచోట కలిసిన రికార్డు తైవాన్లో 1999లో నమోదైంది.
అప్పుడు.. 3961 కవల జంటలు, ఒకేసారి పుట్టిన ముగ్గురు పిల్లల జంటలు 37, ఒకేసారి పుట్టిన నలుగురు పిల్లల జంటలు నాలుగు ఒకేచోటుకు వచ్చి, కలిశాయి.

ఫొటో సోర్స్, AFP
ఆ రికార్డును అధిగమించేందుకు, సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పేందుకు ఈసారి 5000 జంటల కవలలు వస్తారని నిర్వాహకులు అనుకున్నారు.


అయితే, స్టేడియం వద్దకు దాదాపు 14 వేల జంటల కవలలు వచ్చారని ఏఎఫ్పీ వార్తా సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
వీరంతా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు భారీ క్యూ లైన్లలో నిలబడ్డారు.
ప్రతి ఒక్కరూ తమతమ పుట్టిన తేదీ సర్టిఫికెట్లను చూపించాలి. వాటిని నిర్వాహకులు తనిఖీ చేయాలి.

ఫొటో సోర్స్, AFP
తర్వాత కవలల్ని ఫొటో తీస్తారు. ఆ తర్వాత కనీసం ఐదు నిమిషాలు నిలబడాలి.
ఇలా ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావటంతో నిర్వాహకులు చేతులెత్తేశారు.
రికార్డు నెలకొల్పేందుకు చేపట్టిన కార్యక్రమానికి రికార్డు స్థాయిలో కవలలు రావటంతో వారందరినీ ధృవీకరించే వ్యవహారం ఆలస్యమైంది.

ఫొటో సోర్స్, AFP
ఇలా స్టేడియంకు వచ్చిన వారిలో ఇద్దరు శ్రీలంక ఆర్మీ జనరల్స్.. జయంత సెనెవిరత్నే, పూరక సెనెవిరత్నేలు... సైన్యంలో కవలల దళానికి నాయకత్వం వహించారు.

ఫొటో సోర్స్, EPA
ఎక్కువ మంది రావటంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ పెట్టిన నియమ నిబంధనల్ని పాటించలేకపోయామని నిర్వాహకులు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
అయితే, ఈ ప్రయత్నం రికార్డుకు అర్హత సాధించిందో లేదో తెలియాలంటే మరో రెండు వారాలు పడుతుంది.

ఫొటో సోర్స్, Reuters
ఒకవేళ రికార్డు సాధ్యపడకపోతే మళ్లీ మరో కార్యక్రమం ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
సోమవారం స్టేడియానికి వచ్చిన వారిలో చాలామంది కూడా మళ్లీ ఈ కార్యక్రమం పెడితే ఆనందంగా వస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
ఇవి కూడా చదవండి:
- రికార్డు సృష్టించిన తైవాన్ ఇంద్రధనుస్సు!
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- #100WOMEN: కృత్రిమ గర్భసంచితో నెలలు నిండని శిశువులకు ప్రాణదానం
- ఎడమ చేతి అలవాటుకు కారణమేంటి?
- యూరప్లో వందల సంఖ్యలో ఆడవాళ్లను చంపేస్తున్నారు.. ఎందుకు?
- పెళ్లి కాలేదు..ఇద్దరు పిల్లల తల్లయింది!
- చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకెళ్లి చైనాలో అమ్ముకుంటున్నారు
- ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు: విశాఖపట్నంలో సచివాలయం, రాజ్భవన్.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు
- ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేస్తారా? ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
- జైల్లో సొరంగం తవ్వారు.. 75 మంది ఖైదీలు పరారయ్యారు
- థీమ్ పార్క్ ప్రారంభోత్సవానికి పందితో బంగీ జంప్ చేయించారు
- భవిష్యత్తులో యంత్రాలు మనుషుల్లా మాట్లాడగలవా?
- వినోదం కోసం ఇంట్లో చిరుతల్ని పెంచుకుంటున్నారు
- ఆనందం ఏ వయసులో తగ్గిపోతుంది... సైన్స్ ఏం చెబుతోంది?
- వాతావరణ మార్పు అంటే ఏమిటి? భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్కు కలిగే లాభమేంటి... జరిగే నష్టమేంటి
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









