చంద్రప్రభ సైకియాని: అసోంలో పర్దా పద్ధతికి తెరదించడంలో కీలకపాత్ర పోషించిన వనిత

- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1925లో అసోంలోని నౌగావ్లో ఓ సాహిత్య సభ జరుగుతోంది. మహిళల విద్యను ప్రోత్సహించాలనే అంశంపై అందులో చర్చ జరుగుతోంది.
సభకు హాజరైనవారిలో పురుషులతోపాటు మహిళలు కూడా ఉన్నారు. కానీ, పురుషుల నుంచి విడిగా, వెదురు కట్టెలతో చేసిన తడకల వెనుక మహిళలను కూర్చోపెట్టారు.
చంద్రప్రభ వేదికపైకి ఎక్కి, మైక్లో గట్టిగా... ‘ఆ తడకల వెనుక ఎందుకు ఆగిపోయారు. ముందుకు రండి’ అంటూ అరిచారు.
ఆమె మాట వినగానే, మహిళలు ఆ తడకలను విరగ్గొట్టి, వచ్చి పురుషులతోపాటు కూర్చున్నారు.
చంద్రప్రభ ఇచ్చిన ఈ పిలుపు... అసోంలో అప్పుడు కొనసాగుతున్న పర్దా పద్ధతి తొలగించేందుకు జరిగిన పోరాటంలో కీలకంగా మారింది.

అసోంలోని కామ్రూప్ జిల్లాలోని దోయిసింగారీ గ్రామంలో 1901 మార్చి 16న చంద్రప్రభ జన్మించారు.
ఆమె తండ్రి రతిరామ్ మజుందార్ అప్పట్లో ఆ గ్రామానికి పెద్దగా ఉండేవారు. కూతురును చదివించడంపై ఆయన దృష్టిపెట్టారు.

చంద్రప్రభ తాను చదువుకోవడంతోపాటు తమ గ్రామంలోని అమ్మాయిల సాధికారతపైనా దృష్టి పెట్టారు.
‘’13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె గ్రామంలోని అమ్మాయిల కోసం ప్రాథమిక పాఠశాల మొదలుపెట్టారు. ఆమె లాంటి యువ టీచర్ను చూసి స్కూల్ ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయారు. చంద్రప్రభ సైకియానీకి నౌగావ్ మిషన్ స్కూల్ స్కాలర్షిప్ ఇప్పించారు. బాలికల విద్య విషయంలో ఉన్న వివక్షపై చంద్రప్రభ మిషన్ స్కూల్లో పోరాడారు’’ అని చంద్రప్రభ మనవడు అంతను సైకియా అన్నారు.
1920-21వ సంవత్సరంలో కిరోన్మయీ ఆగ్రవాల్ సాయంతో చంద్రప్రభ తేజ్పూర్లో మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశారు.

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.
ఈ సిరీస్లోని ఇతర కథనాలు:
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- రుకేయా షకావత్ హుస్సేన్: అమ్మాయిల జీవితాలను మార్చిన మహిళ
- రఖ్మాబాయి రౌత్: బలవంతపు పెళ్లిళ్లపై జైలుకు వెళ్లేందుకు సిద్ధపడిన ధీరవనిత
- ఇందర్జీత్ కౌర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు తొలి మహిళా అధ్యక్షురాలు
- సుగ్రా హుమాయూన్ మీర్జా: బురఖా లేకుండా బయటకు వచ్చిన తొలి మహిళ.. దక్కన్ మహిళల గొంతుక
- అన్నా చాందీ: భారత్లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది
- అనసూయ సారాభాయ్: కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన మహిళ


చంద్రప్రభ, ఇతర స్వాతంత్ర్య పోరాటకారులతో కలిసి విదేశీ దుస్తుల బహిష్కరణ కార్యక్రమం చేపట్టారని, ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారని నిరుపమా బార్గోహాయి చెప్పారు. ఆ సమయంలో మహాత్మ గాంధీ తేజ్పూర్ వచ్చారని వివరించారు.
చంద్రప్రభ జీవితం ఆధారంగా ‘అభియాత్రి’ పేరుతో నిరుపమా ఓ నవల రాశారు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది.
వెనుకబడిన వర్గానికి చెందిన చంద్రప్రభకు తక్కువ వయసులోనే తనకన్నా చాలా పెద్ద వ్యక్తితో వివాహం జరిగిందని, ఆమె ఆ వివాహాన్ని తిరస్కరించారని నిరుపమా చెప్పారు.

‘‘ఆమె చాలా ధైర్యవంతురాలు. ఉపాధ్యాయురాలిగా ఉన్న సమయంలోనే, అయిష్టంగా ఆమె తల్లి కావాల్సి వచ్చింది. భర్తతో ఆమె విడిపోయారు. కుమారుడిని పెంచి, పోషించే బాధ్యతలను తనే తీసుకున్నారు’’ అని నిరుపమా అన్నారు.
చంద్రప్రభ సైకియానీ బాలికలకు చదువు చెప్పడమే కాదు, హక్కుల విషయమై వారికి అవగాహన కూడా కల్పించేవారు. స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు కూడగట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆమె సైకిల్ యాత్ర చేశారు. రాష్ట్రంలో ఇలా సైకిల్ యాత్ర చేసిన తొలి మహిళగా చంద్రప్రభను భావిస్తారు.

‘‘గ్రామంలో అంటరానివారిగా చూస్తూ కొందరిని చెరువు నీళ్లు ముట్టనిచ్చేవారు కాదు. ఈ పద్ధతికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేశారు. సఫలీకృతమయ్యారు. వారికి చెరువు నీళ్లు సాధించిపెట్టారు. గుళ్లలోకి కూడా వారికి ప్రవేశం కల్పించాలని ఆమె పోరాడారు. కానీ, అందులో విజయవంతమవ్వలేకపోయారు’’ అని చంద్రప్రభ మనవడు అంతను చెప్పారు.
1930లో చంద్రప్రభ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని, జైలుకు కూడా వెళ్లారు. 1947 వరకూ కాంగ్రెస్లో ఆమె కార్యకర్తగా పనిచేశారు.
చంద్రప్రభ చేసిన కృషికి గుర్తింపుగా 1972లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.
చిత్రాలు: గోపాల్ శూన్య
ఇవి కూడా చదవండి:
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- 'మోదీజీ, మా ఆయన ఇంటి పనిలో సాయం చేయడం లేదు, మీరైనా చెప్పండి...'
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్... ఇది శత్రు విమానాల్ని అటాక్ చేస్తుందా?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- #HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్ని
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











