కరోనావైరస్ గ్రామాలకు పాకితే భారత్ పరిస్థితి ఏంటి?

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లోని చాలా ప్రాంతాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. మార్చి 28 ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 748 కరోనాకేసులు నమోదైనట్లు భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది.

2020 మార్చి 3 వరకూ భారత్ వ్యాప్తంగా ఐదు కరోనాకేసులు మాత్రమే నమోదయ్యాయి. మరుసటి రోజే ఆ సంఖ్య 27కు చేరింది. ఆ తర్వాత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఒకవేళ కరోనావైరస్ కేసులు దేశంలోని గ్రామీణ ప్రాంతాలకూ పాకితే, పరిస్థితిని అదుపు చేయడం చాలా కష్టం.

ఆరోగ్య వసతుల లేమి

కేసుల సంఖ్య పెరుగుతూ పోతే, గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో పడకలు చాలవని నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2019 నివేదిక సూచిస్తోంది.

దేశవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని, వీటిలో 21 వేలు గ్రామీణ ప్రాంతాల్లో, ఐదు వేలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది.

దీని ప్రకారం రోగులు, ఆసుపత్రి పడకల నిష్పత్తి ఆందోళనకర స్థాయిలో ఉంది.

ఆస్పత్రి బెడ్‌లు

ఫొటో సోర్స్, Getty Images

పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1700 మంది రోగులకు కేవలం ఒక్క పడక మాత్రమే అందుబాటులో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 3,100 మందికి ఒక పడక చొప్పున అందుబాటులో ఉన్నాయి.

ఒక్కో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఆసుపత్రి పడకలు, జనాభా నిష్పత్తిని చూస్తే, బిహార్ అట్టడుగు స్థానంలో ఉంది.

2011 జనాభా లెక్కల ప్రకారం బిహార్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు పది కోట్ల మంది నివసిస్తున్నారు. అక్కడ ప్రతి 16 వేల మందికి ఒకటి చొప్పున ఆసుపత్రి పడకలు ఉన్నాయి.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

తమిళనాడు ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉంది. రాష్ట్రంలో 40,179 ఆసుపత్రి పడకలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 690 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ లెక్కన అక్కడ 800 మంది ఒకటి చొప్పున ఆసుపత్రి పడకలు ఉన్నాయి.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

వైద్యుల కొరత

గ్రామీణ ఆరోగ్య గణాంకాల ప్రకారం భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 26 వేల మందికి ఒకరు చొప్పున అల్లోపతి వైద్యులు ఉన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి వెయ్యి మందికి ఒకరు చొప్పున అల్లోపతి వైద్యులు ఉండాలని సూచిస్తోంది.

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వివిధ రాష్ట్రాల్లోని మెడికల్ కౌన్సిళ్ల రికార్డుల ప్రకారం దేశంలో 1.1 కోట్ల మంది అల్లోపతి వైద్యులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తగినంత వైద్యులు, వైద్య వసతులు లేవని ఈ సమాచారం తేటతెల్లం చేస్తుంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

పరీక్ష కేంద్రాలు చాలా తక్కువ

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆమోదం పొందిన ప్రభుత్వ ప్రయోగశాలలు దేశంలో 116 ఉన్నాయి. వీటిలో 89 ప్రయోగశాలలను కోవిడ్19 పరీక్ష కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు. మరో 27 ప్రయోగశాలలను కూడా వినియోగంలో తెచ్చే ప్రక్రియ సాగుతోంది.

కరోనావైరస్ కేసులు ఎక్కువగా నమోదైన మహారాష్ట్రలో ఎనిమిది ఆమోదిత పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వీటిలో నాలుగు ముంబయిలో, మూడు పుణెలో, ఒకటి నాగ్‌పుర్‌లో ఉన్నాయి.

ఐసీఎంఆర్ మరో నాలుగు ప్రేవేటు పరీక్ష కేంద్రాలకు కూడా ఆమోదం మంజూరు చేసింది. ఆ నాలుగూ ముంబయిలోనే ఉన్నాయి.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)