కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ

ఫొటో సోర్స్, Isinnova
- రచయిత, జోయ్ క్లెయిన్మన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఇటలీలో వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాంతో, కొన్ని ఆస్పత్రుల్లో వైద్య పరికరాలకు కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ కొందరి ప్రాణాలను కాపాడుతోంది.
బ్రేషా పట్టణంలోని ఆస్పత్రి ఐసీయూలో 250 మంది కరోనావైరస్ రోగులు చికిత్స పొందుతున్నారు. అయితే, అందులో రోగులకు కృత్రిమ శ్వాస అందించేందుకు వాడే వాల్వుల (కవాటాలు) కొరత ఏర్పడింది.
దాంతో, ఓ త్రీడీ ప్రింటర్ కంపెనీ హుటాహుటిన 24 గంటల వ్యవధిలోనే 100 వాల్వులను తయారు చేసి ఇచ్చింది.
ఐసీయూలో ఉన్న రోగులకు మెషీన్లతో కృత్రిమ శ్వాస అందించేందుకు ఈ వాల్వులను వాడతారు. ఒక్కో వాల్వును గరిష్ఠంగా ఎనిమిది గంటలపాటు వాడొచ్చు.
మొదట వాల్వు నమూనాను డిజైన్ చేసేందుకు మూడు గంటలు పట్టింది. ఇలా తయారు చేసేందుకు ఒక్కో వాల్వుకు 80 రూపాయల కంటే తక్కువే ఖర్చవుతోంది.
"ఎప్పుడూ వాల్వులను సరఫరా చేసే సంస్థ డిమాండ్ అధికంగా ఉండటంతో తొందరగా అందివ్వలేక చేతులెత్తేసిందని ఓ జర్నలిస్టు ద్వారా తెలిసింది. దాంతో హుటాహుటిన త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో వాటిని రూపొందించాలని నిర్ణయించాం. మూడు గంటల్లోనే వాల్వు నమూనాను తయారు చేశాం" అని ఈజ్ఇన్నోవా సంస్థ సీఈవో క్రిస్టియన్ ఫ్రకాసి చెప్పారు.

- కరోనావైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు- ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

"మేం తయారు చేసిన తొలి వాల్వును ఆస్పత్రికి తీసుకెళ్లాక ఒక రోగికి అమర్చి పరీక్షించారు. అది బాగా పనిచేస్తోందని వైద్యులు చెప్పారు. వెంటనే పరుగుపరుగున మా కంపెనీకి వెళ్లి మరిన్ని వాల్వులను తయారు చేయడం ప్రారంభించాం" అని మెకానికల్ ఇంజినీర్ రోమయోలి బీబీసీతో చెప్పారు.
ఈజ్ఇన్నోవా కంపెనీకి ఆరు త్రీడీ ప్రింటర్లు ఉన్నాయి. ఒక్కో వాల్వు తయారీకి దాదాపు గంట సమయం పడుతుంది. అయినా, ఈ ఒక్క సంస్థ తయారు చేసే వాల్వులతో కొరత తీరదు.
అందుకే, ఇప్పుడు లొనాటి అనే మరో త్రీడీ ప్రింటింగ్ కంపెనీ కూడా వాల్వుల తయారు చేసేందుకు సిద్ధమవుతోంది.

ఫొటో సోర్స్, Isinnova
"ఈ వాల్వులకు 0.8 మి.మీ. కంటే సన్నని రంధ్రాలు, గొట్టాలు ఉంటాయి. కాబట్టి, వాటిని ప్రింట్ చేయడం అంత సులువు కాదు. పైగా అవి ఏమాత్రం కలుషితం కాకుండా జాగ్రత్తపడాలి. చాలా సున్నితమైన పరికరం అది" అని ఫ్రకాసి అంటున్నారు.
"తాజాగా మరో ఆస్పత్రి కూడా వాల్వులు కావాలని మమ్మల్ని సంప్రదించింది. మేం రెండు రోజుల నుంచి నిద్రలేకుండా పనిచేస్తున్నాం. రోగుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం" అని ఆయన చెప్పారు.


ఇవి కూడా చదవండి
- కరోనావైరస్ ప్రభావంతో విమానయాన సంస్థలు దివాలా తీయనున్నాయా...
- కరోనావైరస్ టెన్షన్: టాయిలెట్ పేపర్లను జనం వేలం వెర్రిగా ఎందుకు కొంటున్నారు?
- కరోనావైరస్: కోట్లాది మంది ప్రాణాలు తీసిన స్పానిష్ ఫ్లూ నుంచి మనం నేర్చుకోగల పాఠాలేమిటి?
- డబ్ల్యూహెచ్ఓ: కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారి.. ఏప్రిల్ 15 వరకు వీసాలు సస్పెండ్ చేసిన భారత్.. ఆ దేశాల నుంచి వచ్చేవారంతా 14 రోజులు నిర్బంధంలోనే
- హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్కు కరోనా వైరస్
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
- ఒక వ్యక్తి ఎందుకు ఉన్మాదిగా మారతాడు? మంచి ఉన్మాదులు కూడా ఉంటారా?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్లను అడ్డుకుంటుందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








