కృష్ణా జిల్లా: మున్నేరు వాగులో ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారుల మృతి, రోదిస్తున్న తల్లిదండ్రులు

ఫొటో సోర్స్, UGC
కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం ఏటూరులో విషాదం చోటుచేసుకుంది. మున్నేరు వాగులో ఈత కోసం వెళ్లి గల్లంతైన ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
చనిపోయిన విద్యార్థులను బాల యేసు, చరణ్, అజయ్, సన్నీ, రాకేశ్గా గుర్తించారు. వీరంతా 12 సంవత్సరాల లోపు వారే.
సోమవారం సాయంత్రం చిన్నారులు గల్లంతు కావడంతో జాతీయ విపత్తు ప్రతిస్పంద దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఐదుగురి మృతదేహాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఈ మృతదేహాలు బాల యేసు, చరణ్, అజయ్ సన్నీవి, రాకేశ్లవిగా గుర్తించారు.

ఘటన నేపథ్యంలో మున్నేరు వాగు వద్దకు భారీగా స్థానికులు చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాలను చూసి వారి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటివద్దే ఉంటున్న ఈ చిన్నారులు సోమవారు మున్నేరులో స్నానానికి వెళ్లారు.
పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి వీరెవరూ కనిపించలేదు. వీరంతా మున్నేరు వైపు వెళ్లాలని ఓ పశువుల కాపరి చెప్పడంతో అక్కడికి వెళ్లి చూశారు.

ఫొటో సోర్స్, UGC
అక్కడ బట్టలు, సైకిళ్లు మాత్రమే కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సోమవారం సాయంత్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం గల్లంతైన విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు.
ఇవి కూడా చదవండి:
- ఆన్లైన్ ప్రేమతో ఎడారి పాలైన పాకిస్తాన్ యువకుడు.. ప్రేయసిని కలిసేందుకు సరిహద్దు దాటి భారత్లోకి చొరబాటు
- హైదరాబాద్లోనూ ‘బుల్లీ బాయి’ బాధితులు.. 67 ఏళ్ల ముస్లిం మహిళ ఫిర్యాదు
- చైనా మహిళలు గుండ్రని, పెద్ద కళ్ల కోసం సర్జరీలు చేయించుకుంటున్నారా
- ఒమిక్రాన్: 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏమిటి? కోవాక్జిన్ టీకా మాత్రమే ఎందుకు?
- కోవిడ్ మహమ్మారి: 2021లో నేర్చుకున్న గుణపాఠాలేంటి, మున్ముందు ఏం చేయాలి ?
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ధర ఎంత? రూ.12 కోట్లు కాదంటున్న అధికారులు
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామిని భూమిపైకి తెచ్చేందుకు డబ్బుల్లేక ప్రభుత్వం అక్కడే ఉంచేసింది
- WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్’లో బీబీసీకి 4 పురస్కారాలు
- స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








