చైనా: జ్వరం రోగికి చికిత్స చేసినందుకు డాక్టర్ అరెస్ట్

ఫొటో సోర్స్, VCG/VCG VIA GETTY IMAGES
చైనాలోని ఝోకో నగరంలో జ్వరంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి చికిత్స చేసినందుకు ఒక వైద్యుడిని అరెస్ట్ చేశారు. దీనికి కారణం.. ఆ చికిత్స చేసిన ఆస్పత్రిలో ఫీవర్ క్లినిక్ లేకపోవటమే.
చైనాలో కోవిడ్ లక్షణాలు ఉన్న రోగులు.. ప్రత్యేకంగా నిర్దేశించిన ఆస్పత్రుల్లో మాత్రమే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.
గో అనే ఇంటిపేరున్న ఆ డాక్టర్ మీద.. ‘‘అంటు వ్యాధుల నిరోధం, నియంత్రణకు అవరోధం కల్పించార’’నే అనుమానంపై అభియోగాలు నమోదు చేశారు.
చైనా జీరో-కోవిడ్ విధానాన్ని అమలు చేస్తోంది. కరోనాను నిర్మూలించటానికి కఠిన వ్యూహాన్ని అనుసరిస్తోంది.
హెనాన్ ప్రావిన్స్లో అధికారులు ఇచ్చిన నోటీస్ ప్రకారం.. గో గత ఏడాది అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2వ తేదీ వరకూ ఝోకో నగరంలోని ఒక ఆస్పత్రిలో జ్వరానికి చికిత్స చేశారు.
గో వైస్-డైరెక్టర్గా ఉన్న ఆ ఆస్పత్రిలో ఫీవర్ క్లినిక్లు లేవు.
చైనాలో కోవిడ్ తరహా లక్షణాలున్న రోగులకు.. ఫీవర్ క్లినిక్లు లేని ఆస్పత్రుల్లో చికిత్స చేయటానికి వైద్యులకు అనుమతి లేదు.
అలాంటి రోగులను ఫీవర్ క్లినిక్లకు పంపించాల్సి ఉంటుంది. 2002లో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) వ్యాపించినపుడు.. దాని వ్యాప్తిని నిరోధించటానికి తొలుత ఈ క్లినిక్లను ఏర్పాటు చేశారు.
ఈ నిబంధనలు ఉండగా.. జ్వరం రోగికి తన ఆస్పత్రిలోనే చికిత్స చేయించాలని గో ఎందుకు నిర్ణయించుకున్నారో, ఈ విషయం ఎలా బయటపడిందో వివరాలు తెలీదు.
ఈ కేసులో దోషిగా తేలితే గోకు ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడవచ్చునని ప్రభుత్వ షిన్హువా వార్తా సంస్థ చెప్పింది.
చైనాలో కోవిడ్ విజృంభణ, వ్యాప్తి తరచుగా కొనసాగుతూనే ఉంది. షియాన్, యుఝో వంటి నగరాల్లో ఒమిక్రాన్ కేసులు వ్యాపిస్తున్నాయి. ఈ రెండు నగరాల్లో ఇటీవలే పూర్తి లాక్డౌన్ విధించారు.
జనవరి చివర్లో చైనా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుండటంతో దేశవ్యాప్తంగా ప్రయాణాలు పతాక స్థాయికి చేరుకునే సమయమిది. ఫిబ్రవరి వరకూ కోట్లాది మంది ప్రయాణాలు చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎటూ కదలవద్దని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు.
మరోవైపు.. వచ్చే నెలలో వింటర్ ఒలింపిక్స్ నిర్వహణకు బీజింగ్ సన్నద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో జీరో-కోవిడ్ వైఖరిని చైనా కొనసాగించగలుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- చైనాలో ఏం జరుగుతోంది? షియాన్ నగరంలో ప్రజలను అర్థరాత్రి క్వారంటైన్కు ఎందుకు తరలిస్తున్నారు?
- కోవిడ్-19: 2021 చివరికల్లా 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని భారత్ ఎందుకు సాధించలేకపోయింది?
- కజకిస్తాన్ సంక్షోభం: భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన డజన్ల కొద్దీ నిరసనకారులు
- ప్రధాన మంత్రి భద్రత ఎలా ఉంటుంది? పంజాబ్ పర్యటనలో పొరపాటు ఎలా జరిగింది?
- హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా
- అమరావతి: క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ వ్యవహారం మళ్లీ ఎందుకు ముందుకొచ్చింది?
- కాలిఫోర్నియాలో వేర్వేరు సంవత్సరాల్లో జన్మించిన కవలలు
- సింధుతాయి సప్కాల్: అనాథల అమ్మ ఇక లేరు... చేతిని ముంగిస కొరికేస్తున్నా ఆమె ఓ కాగితం కోసం ఎందుకంత పోరాటం చేశారు?
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామిని భూమిపైకి తెచ్చేందుకు డబ్బుల్లేక ప్రభుత్వం అక్కడే ఉంచేసింది
- స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)










