వేటగాళ్ల ఉచ్చుతో తొండం తెగడంతో ఏనుగు పిల్ల మృతి

ఫొటో సోర్స్, EPA
ఇండోనేసియాలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని సగం తొండాన్ని కోల్పోయిన సుమత్రన్ ఏనుగు పిల్ల చివరకు మృతి చెందింది.
ఏడాది వయస్సున్న ఈ గున్న ఏనుగు తొండం ఉచ్చులో చిక్కుకొని తెగిపోవడంతో తీవ్రంగా గాయపడింది. అది ఉచ్చులో చిక్కుకోగానే భయపడిన మిగతా ఏనుగులు దాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయాయి.
అచేజయ పట్టణంలో ఈ ఏనుగు పిల్లను గుర్తించిన స్థానికులు, చికిత్స కోసం ఏనుగుల పరిరక్షణ ఏజెన్సీకి తీసుకెళ్లారు.
గాయపడిన భాగంలో తొండాన్ని తొలగించి దాని ప్రాణాన్ని కాపాడేందుకు ప్రయత్నించామని ఏజెన్సీ అధికారులు చెప్పారు. కానీ గాయం అయిన రెండు రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ సోకిందని వెల్లడించారు.
''మేం దాని ప్రాణాలు కాపాడలేకపోయాం. ఎందుకంటే దాని గాయం చాలా తీవ్రమైనది. దానితో పూర్తిగా ఇన్ఫెక్షన్ సోకింది'' అని ఆచే న్యాచురల్ రీసోర్సెస్ కన్సర్వేషన్ ఏజెన్సీ హెడ్ అగస్ అరియాంటో తెలిపారు.
''ఏనుగుకు సహాయం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాం.''

ఫొటో సోర్స్, EPA
ఈ జాతి ఏనుగుల సహజ ఆవాసాలైన బోర్నియో, సుమత్రా దీవుల్లో అటవీ నిర్మూలన వేగంగా జరుగుతోంది. అందువల్ల వేగంగా అంతరించిపోతోన్న జాతిగా వీటిని పరిగణిస్తున్నారు.
ముఖ్యంగా ఈ జాతికి చెందిన మగ ఏనుగులకు వేటగాళ్ల నుంచి అధిక ముప్పు పొంచి ఉంటుంది. వీటి దంతాలు అధిక విలువ పలుకుతుండటంతో, వీటిని అక్రమ దంతాల మార్కెట్లో విక్రయిస్తున్నారు.
వేటగాళ్ల వలన ఏనుగు మరణించడం ఇటీవల కాలంలో ఇదే మొదటిది. దీనికన్నా ముందు ఈ ఏడాది జూలైలో ఒక ఏనుగు దంతాలను వేటగాళ్లు చీల్చుకొని తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖ ఏజెన్సీ: రూఢకోటలో పుట్టిన బిడ్డలు నెలల్లోనే చనిపోతున్నారు... ఏమిటీ మిస్టరీ?
- రాయలసీమకు ఆ పేరు ఎప్పుడు, ఎలా వచ్చింది?
- తుపాకులను పప్పుబెల్లాల్లా పంచుకున్నారు - ప్రెస్ రివ్యూ
- భారతదేశం బొగ్గు వినియోగాన్ని ఆపేస్తే ఏం జరుగుతుంది?
- బిడ్డ నల్లగా పుట్టింది.. డీఎన్ఏ పరీక్ష చేసి ఈ జంట తెలుసుకున్న ‘భయానక’ నిజం ఏంటంటే..
- శిథిలమైన ఇంటిలో నిద్రిస్తోన్న చిన్నారి ఫొటోకు మొదటి బహుమతి
- టీ20 వరల్డ్ కప్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
- జిమ్మీ నీషామ్: ఒకప్పుడు క్రికెట్కు గుడ్బై చెప్పాలనుకున్నాడు కానీ, ఇప్పుడు న్యూజీలాండ్కు విజయాన్ని తెచ్చిపెట్టాడు
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- కంగనా రనౌత్: ‘1947లో లభించింది స్వాతంత్ర్యం కాదు, భిక్ష.. మనకు స్వాతంత్ర్యం 2014లో వచ్చింది’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











