‘బతికున్నవారి కంటే శవాలే నయం’.. మృతదేహాలకు పోస్ట్మార్టం చేసే మహిళ
‘‘శవాలేం చేస్తాయ్.. బతికున్నవాళ్లను చూసే భయపడాలి కానీ..’’.. పోస్టుమార్టం గదిలో శవాలను కోసే వరాలు అనే యువతి చెబుతున్న మాటలు ఇవి. శవాన్ని చూడాలంటేనే చాలా మంది భయపడతారు. కానీ ఎం.కామ్ చదివిన వరాలు ఏడాదిన్నరగా ఈ పని చేస్తున్నారు.
శవపరీక్ష కోసం మృతదేహాలను కోసే పనిలో ఎక్కువగా మగవాళ్లే ఉంటారు. ఆడవాళ్లు ఉండటమనేది చాలా అరుదు. మరి ఇలాంటి వృత్తిలోకి వరాలు ఎలా వచ్చారు? ఆమె కథ ఏంటి? ప్రస్తుతం గర్భిణిగా ఉన్న వరాలు, మెటర్నిటీ లీవులో ఉన్నారు. ఇంటి దగ్గర బీబీసీ పలకరించినప్పుడు ఆమె కథను చెప్పారు.

ఫొటో సోర్స్, bbc
ఇవి కూడా చదవండి:
- మాజీ డీఎస్పీ నళిని: తెలంగాణ కోసం 12 ఏళ్ల కిందట రాజీనామా చేసిన ఈమె గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆమె ఏమని బదులిచ్చారు?
- మహారాష్ట్ర: 'నా బాయ్ ఫ్రెండ్ నన్ను కారుతో తొక్కించి చంపాలని చూశాడు'.. ఐఏఎస్ అధికారి కుమారుడిపై ఆరోపణ..
- నిమిష ప్రియ: బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే హత్య కేసులో మరణశిక్ష పడినా తప్పించుకోవచ్చా? యెమెన్లో ఈ భారతీయురాలి కేస్ ఏమిటి?
- ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం: రెండు దేశాల పరిష్కారం అంటే ఏంటి... అది ఎందుకు అమలు కాలేదు?
- అన్నా మణి: ఈ భారతీయ ‘వెదర్ వుమన్’ గురించి మీకు తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











