దిల్లీలో అమెరికన్ యువతి కిడ్నాప్ డ్రామా.. వీడియోకాల్కు వాడిన వైఫైను ట్రాక్ చేసి పట్టుకున్న పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images
కిడ్నాప్ పేరుతో పోలీసులను తప్పు దారి పట్టించిన అమెరికా అమ్మాయిని అరెస్టు చేశారు.
భారత్లో ఉన్న ఓ 27 ఏళ్ల అమెరికా అమ్మాయి, డబ్బుల కోసం తల్లిదండ్రులను కిడ్నాప్ నాటకంతో బ్లాక్మెయిల్ చేసిందని దిల్లీ పోలీసులు తెలిపారు.
స్థానిక మీడియా, పోలీసుల కథనాల ప్రకారం...
అమెరికాకు చెందిన ఆ అమ్మాయి మే నెల 3వ తేదీన భారత్కు వచ్చింది. ఆ తరువాత జులై 7న తల్లికి ఫోన్ చేసిన, తనను ఎవరో కిడ్నాప్ చేసి కొడుతున్నారని చెప్పింది.
అంతేకాకుండా తాను అసురక్షితమైన ప్రాంతంలో ఉన్నానని, శారీరకంగా మానసికంగా వేధింపులు ఎదుర్కొంటున్నానని తల్లిదండ్రులకు ఇ-మెయిల్ కూడా పంపించింది.
దాంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు దిల్లీలోని అమెరికా ఎంబసీని సంప్రదించి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును దిల్లీ పోలీసులకు పంపించింది ఎంబసీ.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. ఇ-మెయిల్ పంపిన ఐపీ అడ్రెస్ను వారు ట్రాక్ చేశారు. అలాగే జులై 10న తల్లికి ఆ అమ్మాయి వీడియో కాల్ చేసినట్లు గుర్తించారు.
ఇ-మెయిల్ పంపిన ఐపీ అడ్రెస్కు సంబంధించిన చిరునామా నకిలీదని పోలీసుల విచారణలో తేలింది. ఆ తరువాత వీడియో కాల్ చేయడానికి ఆ అమ్మాయి వినియోగించిన వైఫై, మొబైల్ నెంబర్ మీద వారు నిఘా పెట్టారు.
ఇలా 31 ఏళ్ల నైజీరియా పౌరున్ని గురుగ్రామ్లో అరెస్టు చేశారు. నోయిడాలోని ఒక అపార్ట్మెంటులో ఆ అమ్మాయి ఉంటున్నట్లు పోలీసుల విచారణలో నైజీరియా వ్యక్తి చెప్పాడు.
అక్కడకు వెళ్లి ఆ అమ్మాయిని పోలీసులు రెస్క్యూ చేశారు. ఆ తరువాత జరిపిన విచారణలో ఆ అమ్మాయి డబ్బుల కోసం కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తేలిందని దిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అమృత గుగ్లోత్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు తెలిపారు.
అమెరికాకు చెందిన ఆ అమ్మాయికి, నైజీరియాకు చెందిన ఆ అబ్బాయికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఉంది. ఇండియాకు వచ్చిన నాటి నుంచి ఆ అమ్మాయి, నైజీరియా అబ్బాయితో ఉంటోంది.
తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో ఇలా కిడ్నాప్ డ్రామా ఆడారు.
వారి ఇద్దరి పాస్పోర్టుల కాలపరిమితి ముగిసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి:
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- కేటీఆర్ తరచూ వాడే 'జుమ్లా’ అనే మాటను ‘అన్పార్లమెంటరీ’ పదంగా ప్రకటించిన కేంద్రం
- ‘‘ఇప్పుడు మేం, మా పిల్లలు మాత్రం బతికున్నాం. ఇంకేమీ మిగల్లేదు''
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
- అంబేడ్కర్ బొమ్మతో పేపర్ ప్లేట్లు, ఇదేమిటని అడిగిన 18 మందిని జైల్లో పెట్టారు... అసలేం జరిగింది?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













