రజినీకాంత్ను డిశ్చార్జ్ చేసిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు - BBC Newsreel

ఫొటో సోర్స్, Getty Images
అస్వస్థతకు గురై హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరిన సినీ నటుడు రజినీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన మరో వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
రజినీకాంత్కు నిర్వహించిన పరీక్షల నివేదికలు వచ్చాయని, వాటిల్లో ఏ ఒక్కటీ ఆందోళనకరంగా లేదని అపోలో ఆస్పత్రి ఆదివారం ఉదయం తెలిపింది. మధ్యాహ్నం వైద్యుల బృందం రజినీకాంత్ను పరీక్షించి, ఆయన్ను ఎప్పుడు డిశ్చార్జి చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటుందని ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది. ఇప్పుడు ఆయన్ను డిశ్చార్జ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

ఫొటో సోర్స్, facebook/SunPictures
'అన్నాత్తే' సినిమా షూటింగ్ నిమిత్తం రజినీకాంత్ ఇటీవల హైదరాబాద్ వచ్చారు. షూటింగ్ బృందంలో నలుగురికి కోవిడ్-19 సోకిందని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో రజినీకాంత్కు కూడా కోవిడ్ పరీక్ష చేయగా నెగెటివ్ అని వచ్చిందని. అయితే, ఆయన రక్తపోటులో హెచ్చుతగ్గులు కనిపించడంతో ఈనెల 25వ తేదీన ఆస్పత్రిలో చేరారని అపోలో యాజమాన్యం తెలిపింది.
ఈ పరిస్థితుల వల్ల అన్నాత్తే షూటింగ్ను వాయిదా వేసినట్లు ఈనెల 23వ తేదీన సన్ పిక్చర్స్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
IND vs AUS: రహానే కెప్టెన్ ఇన్నింగ్స్.. రెండో టెస్టులో పైచేయి సాధించిన భారత్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పైచేయి సాధించింది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 91.3 ఓవర్లలో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 277 పరుగులు సాధించింది.
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్న అజింక్య రహానే 104 పరుగులు చేసి, నాటౌట్గా నిలిచాడు. 200 బంతులు ఆడిన రహానే 12 ఫోర్లు కొట్టాడు.
రహానేకు తోడుగా జడేజా 40 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 195 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
దీంతో భారత జట్టుకు తొలి ఇన్నింగ్స్లో 82 పరుగుల ఆధిక్యం లభించింది.
ఇవి కూడా చదవండి:
- రజినీకాంత్ జీవితంలో అరుదైన కోణాలు
- 2.0: 30 ఏళ్లుగా తగ్గని రజినీకాంత్ మేజిక్
- రాజకీయాలకు రజినీ వయసు దాటిపోయిందా?
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బాయ్ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు
- "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








