‘‘మోదీ జీ.. అది నా పావురం.. వెనక్కు ఇప్పించండి’’ - పాకిస్తాన్ గ్రామస్తుడి వినతి

పాక్ పావురం

ఫొటో సోర్స్, Ani

పాకిస్తాన్ సరిహద్దులో భారత అధికారులు పట్టుకున్న పావురం తనదేనని.. దానిని తనకు వెనక్కు ఇవ్వాలని పాకిస్తాన్‌కి చెందిన ఓ గ్రామస్తుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

జమ్మూకశ్మీర్‌లో పాక్ సరిహద్దు కంచె వద్ద స్థానికులు సోమవారం నాడు ఈ పావురాన్ని బంధించి పోలీసులకు అప్పగించారు.

ఆ పావురాన్ని పాకిస్తాన్ నుంచి గూఢచర్యం కోసం ప్రయోగించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పావురం కాలికి చుట్టిన ఉంగరంలో ఒక రహస్య సందేశం ఉందని దానిని చేధించే ప్రయత్నాన్ని చేస్తున్నామని అధికారులు చెప్పారు.

అయితే.. సరిహద్దుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలోని పాకిస్తాన్‌ గ్రామంలో నివసించే హబీబుల్లా అనే వ్యక్తి.. ఆ పావురం తనదేనని.. రంజాన్ పండగ సందర్భంగా పావురాలని ఎగురవేశానని చెబుతున్నారు.

ఆ పావురం కాలికి చుట్టిన ఉంగరంలో ఉన్నది అది రహస్య సందేశం కాదని, తన మొబైల్ నెంబర్ అని హబీబుల్లా పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆయన దగ్గర 12 పావురాలు ఉన్నట్లు పాకిస్తాన్ వార్తా పత్రిక డాన్ ఒక కథనంలో చెప్పింది.

పావురం శాంతికి సంకేతమని, భారతదేశం అమాయక పక్షులని హింసించడం మానాలని హబీబుల్లా ‘డాన్’ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వ్యాఖ్యానించారు.

భారత్ పాకిస్తాన్ మధ్య కశ్మీర్ వివాదం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. సాధారణంగా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంటాయి

పాకిస్తాన్ నుంచి వచ్చిన పావురం భారతీయ అధికారులని ఇబ్బందులకు గురి చేసిన సంఘటన ఇదే మొదటిది కాదు.

2015 మే నెలలో ఒక తెల్లని పావురాన్ని పోలీసులు పట్టుకున్నారు.

2016 అక్టోబరులో భారత ప్రధానమంత్రిని బెదిరిస్తూ రాసిన లేఖతో మరో పావురాన్ని పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)