కరోనావైరస్: దేశంలో 4కు చేరిన మరణాలు, మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమానాలన్నీ రద్దు

ఫొటో సోర్స్, EPA
దేశంలో కరోనావైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. పంజాబ్కు చెందిన 70 ఏళ్ల వ్యక్తి తాజాగా మరణించారు. ఆ వ్యక్తి ఇటీవల జర్మనీ నుంచి ఇటలీ మీదుగా భారత్కు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇంతకుముందు కర్నాటకలో ఒకరు, దిల్లీలో ఒకరు, మహారాష్ట్రలో ఒకరు చనిపోయారు.
కీలక సూచనలు చేసిన కేంద్రం
ఈ నెల 22 నుంచి వారం రోజుల పాటు అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పలు కీలక సూచనలు కూడా చేసింది.
పదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని సూచించింది.
ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే సదుపాయం కల్పించాలని కోరింది.
దేశవ్యాప్తంగా మెట్రోలు, రైల్వేలు, విమానాలు, బస్సు సర్వీసులను తగ్గించాలని ప్రభుత్వం సూచించింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్ సీ, డీ ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు హాజరవ్వాలని చెప్పింది. ఏ,బీ క్యాటగిరికి చెందిన ఉద్యోగులకు పని గంటల్ని తగ్గించాలని సూచించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు.

- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు


ఫొటో సోర్స్, HEALTH DEPARTMENT
ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర ఆదేశించిందని అన్నారు. అయితే ఆంక్షల నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
కోవిడ్-19 విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలకు యువత సహాయ సహకారాలందించాలని కేంద్రం కోరింది. ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించింది. దేశవ్యాప్తంగా అన్ని విద్యాలయాలు, థియేటర్లు, మ్యూజియంలు, క్లబ్బులు తాత్కాలికంగా మూసివేయాలని సూచించింది.
అలాగే అన్ని రకాల ఫంక్షన్లను కూడా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
రోగులకు, వికలాంగులకు, విద్యార్థులకు తప్ప మిగిలిన అందరికీ రైల్వే శాఖ అందిస్తున్న రాయతీలను కూడా ఈ అర్థరాత్రి నుంచి నిలిపేస్తున్నట్టు కేంద్రం తెలిపింది.
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్ వ్యాక్సీన్ అభివృద్ధిలో ముందడుగు, ఓ మహిళకు ప్రయోగాత్మకంగా ఇంజెక్ట్ చేసిన శాస్త్రవేత్తలు
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్లను అడ్డుకుంటుందా
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








