పిల్లల కోసం బైక్‌నే లైబ్రరీగా మార్చేశారు

వీడియో క్యాప్షన్, పిల్లల కోసం బైక్‌నే లైబ్రరీగా మార్చేశాడు

రోజులో ఎక్కువ సమయం మెబైల్ ఫోన్లకే అతుక్కుపోతున్న నేటి తరానికి తిరిగి పుస్తకాన్ని పరిచయం చేయడానికంటూ విజయనగరం జిల్లాలో మొబైల్ లైబ్రరీ నిర్వహిస్తున్నారు రెడ్డి రమణ.

తన బైక్‌నే లైబ్రరీగా మార్చేసి, ఊరురా తిరుగుతూ పిల్లలకు, పెద్దలకు వివిధ అంశాలకు చెందిన పుస్తకాలను ఇస్తారు. వాటిని వారితో చదివించి, అందులోని అంశాలను వివరిస్తుంటారు.

ఆశయ యూత్ అసోసియేషన్ పేరుతో ఇలా వారానికి రెండు రోజులు బైక్ లైబ్రరీతో వివిధ గ్రామాల్లో పర్యటనలు చేస్తుంటారు రెడ్డి రమణ.

ఒక ప్రైవేటు కాలేజ్‌లో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రెడ్డి రమణ 2005లో చీపురుపల్లిలో

ఒక చిన్న గ్రంధాలయాన్ని ప్రారంభించారు.

కొద్ది కాలానికి మొబైల్ వినియోగం పెరగడంతో, గ్రంథాలయాలకు ఆదరణ తగ్గుతూ వచ్చింది.

దీంతో ఈ మొబైల్ బైక్ లైబ్రరీని ప్రారంభించారు.

ప్రస్తుతం చాలా గ్రామాల్లో లైబ్రరీలు లేవు.

బైకు లైబ్రరీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)