పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 98 మంది మృతి, రంగుల్లో వాడే రసాయనాలు కలపడం వల్లే ప్రాణాలు పోయాయా..

మృతుడు భూపిందర్ నివాసం

ఫొటో సోర్స్, Gurpreet (Batala)

ఫొటో క్యాప్షన్, మృతుడు భూపిందర్ నివాసం

పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి చనిపోయినవారి సంఖ్య 98కి పెరిగింది. తరన్ తరన్, అమృత్‌సర్, బటాలాలలో ఈ మరణాలు చోటుచేసుకోగా అత్యధికంగా తరన్ తరన్‌లోనే 63 మంది మరణించారు.

ఈ వ్యవహారంలో శనివారం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 25 మందిని అరెస్ట్ చేసినట్లయింది.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ జలంధర్‌ డివిజన్‌ కమీషనర్‌ నేతృత్వంలో మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు.

ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.

రాష్ట్రంలోని అమృత్‌సర్‌, బటాలా, తరన్‌ తరన్‌ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించడంతో ఈ మరణాలు సంభవించాయి.

వరుస మరణాలు చోటుచేసుకోవడంతో పోలీసులు నకిలీ మద్యం తయారీ స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేశారు. 100కి పైగా స్థావరాలపై దాడులు చేశారు.

మృతుడు బల్విందర్ నివాసం

ఫొటో సోర్స్, Gurpreet (Batala)

ఫొటో క్యాప్షన్, మృతుడు బల్విందర్ నివాసం

నకిలీ మద్యం విక్రయాలు ఇలా..

నకిలీ మద్యాన్ని రహస్యంగా ఎలా విక్రయిస్తున్నారన్నది డీజీపీ వెల్లడించారు. నకిలీ మద్యం తీసుకొస్తున్న ట్రక్కులు ఆరేడు ధాబాల దగ్గర ఆగుతాయని.. ఆ ధాబాల యజమానులు దాన్ని తీసుకుని అమృత్‌సర్, మిగతా ప్రాంతాల్లో ఏజెంట్లకు సరఫరా చేస్తారని చెప్పారు.

ఇంతకీ ఇందులో ఏముంది?

నిన్న జరిపిన దాడుల్లో పట్టుకున్న నకిలీ మద్యాన్ని టెస్టుకు పంపించారు. ఆ రిపోర్టు ఇంకా రానప్పటికీ ఎక్సయిజ్ అధికారులు చెబుతున్న ప్రకారం రంగుల్లో వాడే ఒక రకమైన స్పిరిట్‌తో దీన్ని తయారుచేస్తున్నారు.

సాధారణంగా బెల్లంతో నాటుసారా చేస్తారు కానీ ఈ నకిలీ మద్యాన్ని స్పిరిట్, ఇతర రసాయనాలతో చేస్తున్నారన్నారు.

దీన్ని లీటరు రూ.50కి విక్రయిస్తున్నారని ఎక్సయిజ్ అధికారులు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ కేసు దర్యాప్తు బృందంలో జలంధర్‌ డివిజన్‌ కమిషనర్‌తోపాటు జాయింట్ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్‌ కమిషనర్, సంబంధిత జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ కూడా ఉన్నారు. ఇప్పటికే బల్విందర్‌ కౌర్ అనే మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 304, ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 61/1/14 కింద కేసు నమోదైంది.

కల్తీ మద్యం మరణాలు సంభవించిన జిల్లాల్లో దాడులు నిర్వహించేందుకు పంజాబ్ పోలీసులు అయిదు బృందాలను ఏర్పాటు చేశారు.

"అమృత్‌సర్ గ్రామీణ ప్రాంతం, బటాలా, టరన్ టరన్ జిల్లాల్లో మరో ఏడుగురిని అరెస్ట్ చేశాం. అయిదు పోలీసు బృందాలు కల్తీ మద్యం మరణాలు సంభవించిన ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నాయి" అని పంజాబ్ పౌర సంబంధాల శాఖ తెలిపినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

గురువారం ముచ్చల్ గ్రామంలో నలుగురు వ్యక్తులు కల్తీ మద్యం తాగి మృతి చెందిన ఘటనలకు సంబంధించి ఒక వ్యక్తిని అదే రోజు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన నలుగురు వ్యక్తుల మృతదేహాలను శుక్రవారంనాడు పోస్టు మార్టం కోసం పంపించారు.

అమృత్‌సర్‌ సమీపంలోని తార్‌సిక్కా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు గ్రామాల్లో జూన్‌ 29 రాత్రి ఐదు కేసులు నమోదైనట్లు పంజాబ్‌ డీజీపీ వెల్లడించారు.

పంజాబ్

ఫొటో సోర్స్, RAVINDER SINGH ROBIN

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)