పాకిస్తాన్లో భూకంపం - 20 మంది మృతి

ఫొటో సోర్స్, Yazdani Tareen
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో గురువారం భూకంపం సంభవించింది. ఇందులో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు బీబీసీకి తెలిపారు.
భవనాలు కూలి చాలా మంది మరణించి ఉంటారని, దీంతో, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మరణించిన వారిలో చాలా మంది మహిళలు పిల్లలు ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 5.9, భూగర్భానికి 9 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు అమెరికా జియలాజికల్ సర్వే తెలిపింది. ఈ రకమైన భూకంపాలు కలుగచేసే హాని ఎక్కువగా ఉంటుంది.
భూకంప ప్రభావిత ప్రాంతం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భూకంపంలో మరో 150 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు బీబీసీ ఉర్దూకి తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.
వైద్యులు తమ మొబైల్ ఫోన్లను టార్చి లైట్లలా వాడి గాయపడిన వారు స్ట్రెచర్ల పై ఉండగానే చికిత్స మొదలుట్టినట్లు రాయిటర్స్ ప్రచురించింది.
ఈ భూకంపంలో100కి పైగా మట్టి ఇళ్లు కూలిపోగా, అధిక సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో, అనేక మంది నిరాశ్రయులైనట్లు ఒక అధికారి రాయిటర్స్కు తెలిపారు.

ఫొటో సోర్స్, FC BALOCHISTAN
భూకంపం తర్వాత కెట్టా ప్రజలు వీధుల్లో కొచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హర్నయి జిల్లాలో అత్యధిక నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు.
కెట్టాకు తూర్పు భాగంలో ఉన్న కెట్టా అత్యధిక బొగ్గు గనులున్న ప్రాంతం. భూకంపాల సమయంలో ఈ గనులు కూలిపోయే ప్రమాదం ఉంది.
అత్యవసర సహాయక బృందాలను ఆ ప్రాంతానికి పంపించినట్లు బలూచిస్తాన్ ఇంటీరియర్ మంత్రి మీర్ జియాఉల్లా లాంగు బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, FC BALOCHISTAN

ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా? ఎవరేమంటున్నారు?
- మెదడుపై ధ్యానం ఎలా పనిచేస్తుంది? మెమరీ బూస్టర్స్ కంటే ధ్యానం మేలా?
- హిమాలయాల్లో నీళ్లు దొరకట్లేదు ఎందుకు?
- భారత్ బంద్: వైసీపీ, టీడీపీల ద్వంద్వ వైఖరి.. పార్లమెంటులో అలా.. ఇప్పుడేమో ఇలా..
- ‘జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం అడిగిందల్లా చేశా.. సంబంధం లేదు అంటే బాధేసింది’ - వైఎస్ షర్మిల
- IMD: ఉత్తరాంధ్ర, తెలంగాణల్లో భారీ వర్షాల హెచ్చరిక.. తీరం దాటిన గులాబ్ తుపాను
- గాయని చిత్ర: ‘నాకు తెలుగు నేర్పించింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆయన పాటల్లో నాకు బాగా నచ్చిన పాట..’
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ పాలనలో బిడ్డకు జన్మనివ్వడం అంటే ఎలా ఉంటుంది..
- ఇవి 23,000 ఏళ్ల కిందటి మానవుడి పాద ముద్రలు
- స్మార్ట్ గ్లాసెస్: స్మార్ట్ ఫోన్ పనులన్నీ కళ్ల జోళ్లే చేస్తే ఏమవుతుంది?
- విశాఖపట్నం: 'కచ్చలూరు బోటు ప్రమాదంలో చనిపోయిన నా పిల్లలే మళ్లీ నాకు కవలలుగా పుట్టారు'
- వర్జినిటీ: కన్యత్వం అనే భావనకు కాలం చెల్లిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)








