కిమ్ జోంగ్ ఉన్: జపాన్పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, Getty Images
జపాన్లోని చాలా ప్రాంతాలను లక్ష్యం చేసుకునేలా అధునాతన 'లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్'ను ఉత్తర కొరియా పరీక్షించినట్లు నార్త్ కొరియా న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) సోమవారం పేర్కొంది.
వారాంతంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో, క్షిపణులు 1500 కిలోమీటర్లు (930 మైళ్లు) దూరం ప్రయాణించినట్లు కేసీఎన్ఏ వెల్లడించింది.
దేశంలో ఆహార కొరత, ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఉత్తర కొరియా ఆయుధాలను అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోందని ఈ పరీక్షల ద్వారా తెలుస్తోంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలకు లోబడే ఈ పరీక్షలు జరిగాయి. గతంలో వీటిని ఉల్లంఘించిన ఉత్తర కొరియా కఠిన ఆంక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
''దేశ భద్రతలో ప్రజలకు మరింత విశ్వసనీయమైన హామీని ఇవ్వడానికి, శుత్రు సైన్యాల విన్యాసాలను బలంగా అడ్డుకోవడానికి మరొక సమర్థమంతమైన ఆయుధాన్ని కలిగి ఉండాలన్న వ్యూహానికి ఈ క్షిపణుల పరీక్షలు'' అద్దం పడుతున్నాయని కేసీఎన్ఏ పేర్కొంది.
ఈ పరీక్షలను పొరుగు దేశాలతో పాటు అంతర్జాతీయ సమాజంపై ఆధిపత్యం కొనసాగించడానికి ఉత్తర కొరియా చేస్తోన్న ప్రయత్నంగా అమెరికా వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, KCNA
ఇది పెద్ద విషయమా?
‘‘ఇది పెద్ద విషయమా? అని ఆలోచిస్తే ఒకసారి అవును అనిపిస్తుంది, మరోసారి కాదు అనిపిస్తుంది’’అని బీబీసీ సియోల్ కరెస్పాండెంట్ లారా బికర్ విశ్లేషించారు.
‘‘ఇలాంటి క్రూయిజ్ క్షిపణుల జోలికి చాలా దేశాలు పోవు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాన్ని అరికట్టడానికి అమలులో ఉన్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలకు ఈ పరీక్షలు లోబడి ఉండవు.’’
‘‘ప్యాంగ్యాంగ్ నుంచి రెచ్చగొట్టే చర్యగా కొందరు దీన్ని పరిగణిస్తున్నారు. కానీ ఈ పరీక్షలను దక్షిణ కొరియా అంత తీవ్రంగా చూడటం లేదు. అలాగే ఉత్తర కొరియాలో కూడా ఇది పతాక శీర్షికలకు ఎక్కలేదు.’’
మరెందుకు ఇంత చర్చ జరుగుతోంది?
ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, అంతర్జాతీయ నిబంధనలకు లోబడి తాము ఆధునాతన, ప్రమాదకరమైన ఆయుధాలను అభివృద్ధి చేయగలమని ఉత్తర కొరియా మరోసారి రుజువు చేసుకుంటోంది.
తక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ క్రూయిజ్ క్షిపణులను రాడార్లు గుర్తించడం కష్టం. 1500 కి.మీ పరిధి అంటే అది జపాన్లో చాలా భాగం వరకు తన ఆధీనంలో ఉంచుకోగలుగుతుంది.
ఈ క్షిపణులను వ్యూహాత్మకమైనవిగా మీడియా వర్ణిస్తోంది. ఇందులో న్యూక్లియర్ వార్ హెడ్లను అమర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ క్రూయిజ్ క్షిపణిలో ఇమిడిపోయేలా, ఉత్తర కొరియా న్యూక్లియర్ వార్హెడ్లను రూపొందించగలదా అనే అంశంపై విశ్లేషకులు స్పష్టతనివ్వలేకపోతున్నారు. అయితే ఆ దేశం సాధించిన పురోగతి ప్రకారం, వార్హెడ్లను ఇలా ఉపయోగించడం అసాధ్యమని కూడా ఎవరూ చెప్పలేరు.
2019లో హనోయ్ వేదికగా డోనల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ సమావేశమైనప్పటి నుంచి ప్యాంగ్యాంగ్ కాస్త నెమ్మదించి ఉండొచ్చు. కానీ దీనర్థం అప్పటినుంచి వారి ఆయుధాలను అభివృద్ధి చేసే డెవలపర్లు కూడా ఖాళీగానే ఉన్నారని మాత్రం కాదు.

ఫొటో సోర్స్, KCNA
నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షలు విధించింది. క్రూయిజ్ కంటే బాలిస్టిక్ క్షిపణులను మరింత ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు.
ఉత్తరకొరియా చివరిసారిగా మార్చిలో బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. దీంతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
75వ వ్యవస్థాపక వార్షికోత్సవం సందర్భంగా ప్యాంగ్యాంగ్లో మిలిటరీ పరేడ్ నిర్వహించిన కొన్ని రోజుల వ్యవధిలోనే తాజా క్రూయిజ్ ప్రయోగం జరిగింది.
పరేడ్లో ఉత్తర కొరియా పెద్ద బాలిస్టిక్ క్షిపణులను ప్రదర్శించలేదు. కానీ హజ్మత్ సూట్లలో పనిచేసే కార్మికులతో ప్రదర్శన నిర్వహించింది. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశామని చాటిచెప్పడానికి సంకేతంగా వీరితో ఈ ప్రదర్శనను నిర్వహించి ఉండొచ్చు.
ఆగస్టు 19 నాటికి ఉత్తర కొరియాలో కరోనా కేసులు నమోదు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కానీ ఇది అసంభవమని విమర్శకులు అంటున్నారు.
వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉత్తర కొరియా 2020 జనవరిలోనే దేశ సరిహద్దులను మూసివేసింది. దీనివల్ల తమ మిత్ర దేశమైన చైనాతో వాణిజ్యం క్షీణించింది.
ఉత్తర కొరియాలో ప్రజలు ఆకలిచావులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని అనేక నివేదికలు వెలువడ్డాయి. వీటిని అప్పటి అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కూడా అంగీకరించారు.
అయినప్పటికీ ఆ దేశం న్యూక్లియర్ ప్రణాళికల్లో మాత్రం వెనక్కి తగ్గలేదు. ఉత్తర కొరియాలో న్యూక్లియర్ రియాక్టర్ పున:ప్రారంభమైందని, దాని ద్వారా ఆయుధాల కోసం ఉపయోగించే ప్లుటోనియం ఉత్పత్తి చేస్తున్నారని గత నెలలో ఐక్యరాజ్య సమితి అటామిక్ ఏజెన్సీ ప్రకటించింది. దీన్ని తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి:
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)








