ఇండోనేసియా: మునిగిపోయిన జలాంతర్గామి.. అందులో ఆక్సిజన్ మూడు రోజులకు మాత్రమే సరిపోతుంది

ఫొటో సోర్స్, EPA
ఇండోనేసియాలోని బాలి తీరంలో బుధవారం నుంచి కనిపించకుండా పోయిన సబ్మెరైన్ ‘కేఆర్ఐ నంగల’ సముద్రగర్భంలో మునిగిపోయినట్లు ఇండోనేసియా నావికా దళం శనివారం తెలిపింది. మునిగిపోయిన ఈ సబ్మెరైన్లో 53 మంది ఉన్నారు.
సబ్మెరైన్ మునిగిపోయిన ప్రాంతంలో దానికి సంబంధించిన కొన్ని భాగాలతో పాటు, అందులో ఉన్న తివాచీలు కూడా పైకి తేలాయని నావికాదళ ప్రధానాధికారి చెప్పారు.
సముద్రంలో 2800 అడుగుల లోతున మునిగిపోయినట్లు తెలిపారు.
సముద్రంలోకి వెళ్లినప్పటికి అందులో 3 రోజులకు సరిపోయేంత ఆక్సిజన్ మాత్రమే ఉంది.

సముద్ర గర్భంలో క్షిపణి ప్రయోగం డ్రిల్ కోసం వెళ్లేందుకు అనుమతి తీసుకుని బయలుదేరిన ఈ జలాంతర్గామి 40 సంవత్సరాల పాతది. దీనిని జర్మనీ తయారుచేసింది.
ఈ సబ్మెరైన్ కండిషన్లోనే ఉందని ఇండోనేసియా నేవీ తెలిపింది. కానీ, ఇది మునిగిన తీరు చూస్తే ఇందులో ఉన్న ఇంధన ట్యాంకు దెబ్బ తిన్నదేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సబ్మెరైన్ కి సంబంధించిన అనేక భాగాలు లభించినట్లు చెప్పారు. అయితే, ఈ క్షిపణిని ప్రయోగించే లాంచర్ లో బీటలు వాటిల్లడం వల్ల గాని, లేదా వెలుపల నుంచి ఒత్తిడి వస్తే తప్ప ఈ భాగాలు సబ్ మెరైన్ ని వీడి బయటకు రావని నేవీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ యుడో మార్గోనో చెబుతున్నారు.

ఈ జలాంతర్గామి మునిగిపోయిన ప్రదేశానికి 16 కిలోమీటర్ల రేడియస్లో కొన్ని వస్తువులు దొరికాయి. అందులో పెరిస్కోప్ ను లూబ్రికేట్ చేయడానికి వాడే ఒక గ్రీజు సీసా కూడా ఉంది. సబ్మెరైన్ మునిగిన ప్రాంతం మీదుగా ఇతర నౌకలు ఏవీ వెళ్లలేదు.
ఈ నేవీ నౌకను బయటకు వెలికి తీయడానికి అంతర్జాతీయంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్షాలయ్యారు
- బంగారం మాస్క్: చైనాలో 3 వేల ఏళ్ల కిందటి మాస్క్ దొరికింది
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








