IND vs AUS: ఆస్ట్రేలియా కంచుకోట బద్దలుకొట్టిన టీమిండియా కుర్రాళ్లు.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్ సొంతం

భారత జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2018-19లో కూడా భారత జట్టు ఆస్ట్రేలియాను 2-1తో ఓడించి సిరీస్ గెలిచింది

బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా-భారత్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.

ఐదోరోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు దూకుడుగా ఆడి 328 పరుగుల భారీ టార్గెట్ చేధించింది.

2-1తో నాలుగు టెస్టుల సిరీస్‌ను, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంది.

మొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలవగా, రెండో టెస్ట్‌ను భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. మూడో టెస్ట్ డ్రా అయ్యింది. నాలుగో టెస్ట్‌ను భారత జట్టు మూడు వికెట్ల తేడాతో గెలిచింది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రిషభ్ పంత్ (89 పరుగులు) చివరి వరకూ క్రీజులో నిలిచి, ఫోర్‌తో జట్టుకు విజయం ఖరారు చేశాడు.

అంతకు ముందువాషింగ్టన్ సుందర్ 22 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 2 పరుగులు చేసి ఔటయ్యారు.

చటేశ్వర్ పుజారా 56 పరుగులు చేసి ఔటయ్యాడు.

యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ధాటిగా బ్యాటింగ్ చేసి 91 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.

కెప్టెన్ అజింక్యా రహానే సైతం వేగంగా పరుగులు చేశాడు. 22 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసి ఔటయ్యాడు.

మయాంక్ అగర్వాల్ 9 పరుగులు చేయగా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులు చేసి ఔటయ్యారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ నాలుగు వికెట్లు తీశాడు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసింది.

భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో విజయానికి అవసరమైన 328 పరుగులకంటే ఒక పరుగు ఎక్కువే చేసింది.

ఈ పర్యటనలో మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టుపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి.

ఆ పరాభవం నుంచి వెంటనే కోలుకున్న భారత జట్టు రెండో టెస్ట్ మ్యాచ్‌ను గెలిచింది.

అయితే, వరుసగా సీనియర్ ప్లేయర్లు గాయాలపాలు కావడం ఆందోళన కలిగించింది.

కానీ, జట్టులోకి వచ్చిన యువ ప్లేయర్లు సత్తా చాటడంతో భారత జట్టు ఘన విజయం సాధించింది.

రిషభ్ పంత్

ఫొటో సోర్స్, Getty Images

భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించిన గంగూలీ

ఆస్ట్రేలియా వెళ్లి, ఆ జట్టుపై ఈ తరహాలో విజయం సాధించడం.. భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని బీసీసీఐ ఛైర్మన్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభివర్ణించారు.

భారత జట్టుకు బీసీసీఐ తరపున రూ.5 కోట్ల నజరానా ప్రకటించారు.

ఇది అంకెలకు అందని విలువైన విజయం అని గంగూలీ పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కాగా, ఘన విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

భారత జట్టు గొప్ప సంకల్ప బలాన్ని ప్రదర్శించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

‘అసంతృప్తికి గురయ్యా.. కానీ, టెస్ట్ క్రికెట్ జీవించే ఉంది..’

భారత జట్టు గెలుపుపై ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘నేను అసంతృప్తికి గురయ్యా. కానీ, టెస్ట్ క్రికెట్ జీవించే ఉంది’’ అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

గబ్బా టెస్ట్

ఫొటో సోర్స్, twitter/BCCI

ఆస్ట్రేలియా కోట గబ్బా మైదానం

బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కోట లాంటిది. ఇక్కడ ఆ జట్టు ఆడిన గత 55 టెస్ట్ మ్యాచ్‌ల్లో 33 గెలిచింది. 13 డ్రా కాగా, ఒక మ్యాచ్ టై అయ్యింది. 8 టెస్ట్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి చవిచూసింది.

పైగా, 1988 నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఆ జట్టు ఈ మైదానంలో ఓటమి చవి చూడలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)