కరోనా వైరస్తో కొత్త ఉద్యోగాలు.. ఆన్లైన్ అమ్మకాలు పెరగడంతో లక్ష మందిని నియమించుకుంటున్న అమెజాన్

ఫొటో సోర్స్, Reuters
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం వల్ల అనేక రంగాలు కుదేలై ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది. కానీ, ఇదే సమయంలో ఈకామర్స్ సంస్థ అమెజాన్ మాత్రం కొత్త నియామకాలు చేపడుతోంది.
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆన్లైన్ కొనుగోళ్లపై ఆధారపడుతున్నారు. దీంతో పెరుగుతున్న డిమాండ్కు తగినట్లుగా అమెజాన్ సంస్థ అమెరికాలో లక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించింది.
ఆన్లైన్ అమ్మకాలకు పెరిగిన డిమాండ్ తట్టుకునేందుకు వీలుగా గోదాములలో పని చేయడానికి, సరుకులు డెలివరీ చేయడానికి ఉద్యోగులను నియమిస్తామని సంస్థ ప్రకటించింది.
యూకే, యూరప్, అమెరికాలలో పని చేసే ఉద్యోగులకు జీతాలు కూడా పెంచుతామని సంస్థ ప్రకటించింది.
కరోనా వైరస్ భయంతో ఆన్లైన్ కొనుగోళ్ళకు డిమాండ్ పెరిగిందని సంస్థ తెలిపింది.
ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 7000 మంది మరణించారు. ఇప్పటికే చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే సౌకర్యం కల్పించాయి.
ఆన్లైన్ అమ్మకాలకు డిమాండ్ పెరగడంతో అమెజాన్ తరహాలోనే ఆల్బర్ట్ సన్స్, క్రొగెర్ అండ్ రేలీస్ లాంటి కొన్ని అమెరికన్ సూపర్ మార్కెట్ చైన్లు కూడా అదనపు ఉద్యోగులను పనుల్లోకి తీసుకుంటున్నారు.

- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు
కరోనా వైరస్ వలన పనులు కోల్పోయి రెస్టారెంట్, పర్యటక, వినోద పరిశ్రమల్లో పని చేసి ఖాళీగా ఉన్న వారిని ఉద్యోగాలలో నియమించేందుకు ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
పరిస్థితులు చక్కబడేవరకు వారికి పని కల్పిస్తామని అమెజాన్ వరల్డ్ వైడ్ ఆపరేషన్స్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ డేవ్ క్లార్క్ ఒక బ్లాగ్ పోస్ట్ లో పేర్కొన్నారు.
యు.కె , అమెరికా, యూరోప్ దేశాలలో తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకి గంటకి సుమారు150 రూపాయిలు అదనపు వేతనం ఇస్తామని అమెజాన్ ప్రకటించింది. దీనితో కంపెనీకి సుమారు 2587 కోట్ల రూపాయిల అదనపు ఖర్చు అవుతుందని పేర్కొంది.
అయితే, యూకేలో కొత్త ఉద్యొగులను తీసుకుంటారా లేదా అనే విషయం పై కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు.
తమ సంస్థలో పని చేసే ఉద్యోగులెవరికైనా కరోనా వైరస్ సోకితే రెండు వారాల వేతనం ఇస్తామని గత వారంలో ప్రకటించింది. అంతే కాకుండా సంస్థ కోసం స్వతంత్రంగా పని చేసే వారికి, భాగస్వాముల కోసం 184 కోట్ల రూపాయిల సహాయ నిధిని కూడా కేటాయిస్తున్నట్లు తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా 182000 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, 7000 మరణాలు చోటు చేసుకున్నాయని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది.


ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు- ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- తెలంగాణ శాసనసభ: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి ఆమోదం
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- వాస్ప్-76బి: ఇనుము వర్షంలా కురిసే ఈ గ్రహం ఓ నిప్పుకణిక.. పగటి ఉష్ణోగ్రత 2,400 సెంటీగ్రేడ్లు
- ఆంధ్రప్రదేశ్: మాన్సాస్ ట్రస్ట్ వివాదం ఏంటి? సంచయిత నియామకంపై అశోక్ గజపతిరాజు న్యాయపోరాటానికి నేపథ్యం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








