కరోనావైరస్: ‘ఎవరిని బతికించాలి, ఎవరిని వదిలేయాలి’... తలలు పట్టుకుంటున్న ఇటలీ వైద్యులు

వైద్యులు, వైద్య సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ మహమ్మారి ఇటలీలో విజృంభిస్తోంది. రోగులందరికీ చికిత్స చేసేందుకు వసతులు చాలక... వారిలో ఎవరికి ప్రాణం పోయాలో, ఎవరిని వద్దనాలో తేల్చుకోలేక సతమతమవుతున్నామని అక్కడి వైద్య సిబ్బంది అంటున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో 80 నుంచి 95 ఏళ్ల వ్యక్తి తీవ్ర శ్వాసకోశ సమస్యలతో వస్తే, తాము చికిత్స అందించకపోవచ్చని క్రిస్టియన్ సలారోలి అనే డాక్టర్ కొరీరె డెల్లా సెరా వార్తాపత్రికతో అన్నారు. బెర్గామోలోని ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు ఆయన హెడ్‌గా ఉన్నారు.

‘‘నా మాటలు ఘోరంగా అనిపించవచ్చు. కానీ, అవి నిజాలు. ‘అద్భుతాలు’ చేసే స్థితిలో మేం ఇప్పుడు లేం’’ అని ఆయన అన్నారు.

కరోనావైరస్ ఇటలీలో చాలా వేగంగా వ్యాపిస్తోంది. శనివారం నాటికి సుమారు 17,660 మందికి అది సోకింది. వారిలో 1,268 మంది చనిపోయారు. మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. చైనాలో 81,021 మంది సోకితే, 3,192 మంది మరణించారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఐరాస లెక్కల ప్రకారం ప్రపంచంలో జపాన్ తర్వాత అత్యధికంగా వృద్ధులు ఉన్న దేశం ఇటలీనే. వృద్ధులపై కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

ఈ నెల మొదట్లో ఇటాలియన్ సొసైటీ ఆఫ్ అనస్తీషియా, అనల్జీసియా, రీసస్కటేషన్ అండ్ ఇంటెన్స్ థెరపీ (ఎస్ఐఏఏఆర్‌టీఐ) వైద్యులకు కొన్ని నైతిక సూచనలు చేసింది. అందరికీ చికిత్స అందించలేని విషమ పరిస్థితుల్లో ఇంటెన్సివ్ కేర్‌లో బెడ్ ఎవరికి ఇవ్వాలనే విషయం గురంచి వీటిని సూచించింది.

ముందుగా ఎవరు వస్తే, వాళ్లను చేర్చుకోవడం కాకుండా, ఇంటెన్సివ్ కేర్ చికిత్స ద్వారా కోలుకునేందుకు అత్యధిక అవకాశాలున్న రోగులపై దృష్టి పెట్టేందుకు కొన్ని ‘కఠిన నిర్ణయాలు’ తీసుకోవాలని వైద్యులు, నర్సులకు ఎస్ఐఏఏఆర్‌టీఐ సూచించింది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

‘‘కొందరికి చికిత్సను తగ్గించి, ఇంకొందరికి చికిత్స చేయమని మేం చెప్పడం లేదు. సరైన చికిత్స వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో వారిపై దృష్టి పెట్టకుండా ప్రస్తుతం ఏర్పడిన అత్యవసర పరిస్థితులు అడ్డుపడుతున్నాయి’’ అని ఎస్ఐఏఏఆర్‌టీఏ పేర్కొంది.

ఇటలీలో 5,200 ఇంటెన్సివ్ కేర్ పడకలు ఉన్నాయి. శీతాకాలంలో ఇవి చాలా వరకూ శ్వాసకోశ సమస్యలతో వచ్చినవారితో నిండిపోతుంటాయి.

ఉత్తర ప్రాంతాలైన లోంబార్డీ, వెనెటో‌ల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కలిపి 1,800 పడకలే ఉన్నాయి.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

తమ ఆసుపత్రిలో పడకలన్నీ నిండుకుంటున్నాయని లాంబార్డీలోని ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ స్టెఫానో మాంగ్నోన్ బీబీసీతో చెప్పారు.

‘‘రోజురోజుకీ పరిస్థితి దిగజారుగుతోంది. ఐసీయూలోనే, సాధారణ వార్డుల్లోనూ పడకలు కరోనావైరస్ రోగులతో నిండుతున్నాయి. మా ప్రావిన్సులో మానవ, సాంకేతిక వనరులు చాలడం లేదు. కొత్త వెంటిలేటర్లు, ఇతర పరికరాల కోసం వేచి చూస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

Sorry, your browser cannot display this map