జర్మనీ: ఇద్దరిని హత్య చేసిన హంతకుడు.. ఆన్లైన్లో ఎక్కడా తన పేరు లేకుండా చూసుకున్నాడు

ఫొటో సోర్స్, Getty Images
మూడున్నర దశాబ్దాల కిందట 1982లో ఒక హత్య కేసులో దోషిగా తేలిన జర్మనీ దేశస్థుడొకరు ఆన్లైన్ సెర్చ్లో ఎక్కడా తన పేరు రాకుండా ఉండే హక్కును సాధించుకున్నారు. ఆన్లైన్ సెర్చ్లో ఆయన పేరు ఎక్కడా రాకూడదని జర్మనీలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
యాచ్లో 1982లో ఇద్దరిని హత్య చేసిన కేసులో అప్పట్లో ఆ వ్యక్తికి జీవిత ఖైదు పడింది. 2002లో జైలు నుంచి విడుదలైన ఆయన, ఆ నేరానికీ, తన కుటుంబం పేరుకూ సంబంధం ఉండకూడదని నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించగా కార్ల్స్రుహీలోని రాజ్యాంగ న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది.
దీంతో, ఆన్లైన్ ఆర్కైవ్స్ ఆధారంగా చేసుకుని ఆయన పేరు ఎక్కడా ప్రచురించకుండా కోర్టు ఆదేశాలు నిరోధిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటా కేసు?
కరీబియన్ దీవుల్లో అపోలోనియా నౌకలో ఆ వ్యక్తి ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడిన ఓ వివాదంలో ఆయన తుపాకీ తీసి కాల్పులు జరిపారు. ఇద్దరు వ్యక్తులు చనిపోగా మరికొందరు గాయపడ్డారు.
ఈ కేసు ఆధారంగా చేసుకుని ఒక పుస్తకం, ఒక టీవీ డాక్యుమెంటరీ విడుదలయ్యాయి.
1999లో డెర్ స్పీజెల్ మ్యాగజీన్ తన వెబ్సైట్లో ఆయన పూర్తిపేరుతో మూడు రిపోర్టులు అప్లోడ్ చేసింది. గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ ఆర్టికల్ దొరుకుతుంది.
కోర్టులేం చెప్పాయి?
తనకు సంబంధించిన ఆర్టికల్స్ వెబ్సైట్లో ఉన్న విషయం ఆ వ్యక్తికి 2009లో తెలిసింది. దాన్ని తొలగించమని కోరారు. తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడాన్ని అవి నిరోధిస్తాయని ఆయన అన్నారని కోర్టు ఒక ప్రకటనలో చెప్పింది.
అయితే, వ్యక్తిగత గోప్యత హక్కు కారణంగా పత్రికా స్వేచ్ఛను, ప్రజాప్రయోజనాన్ని కాదనలేమంటూ 2012లో ఫెడరల్ కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
రాజ్యాంగ న్యాయస్థానం ఆ తీర్పును పక్కనపెట్టి ఇప్పుడు ఆదేశాలిచ్చింది.
ప్రచురణ సంస్థలు తమ ఆర్టికల్స్ను ఆన్లైన్లో పొందుపరుచుకునే వీలుంది కానీ కోరినప్పుడు వాటిని తొలగించాల్సి ఉంటుంది.
కాగా ఈ 'రైట్ టు బీ ఫర్గాటెన్' యూరోపియన్ యూనియన్, గూగుల్ మధ్య వివాదాలకు కారణమవుతోంది.
ఇవి కూడా చదవండి:
- షాద్ నగర్ వెటర్నరీ డాక్టర్ సోదరి ఇంటర్వ్యూ: ‘‘ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’’
- వెటర్నరీ డాక్టర్ సోదరి: ‘నేను కానీ, అక్క కానీ 100కి కాల్ చేయలేకపోవటానికి కారణం ఏంటంటే..’
- హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?
- షాద్ నగర్ అత్యాచారం-హత్య: ‘ప్లీజ్ పాపా, కొంచెం సేపు మాట్లాడు, దెయ్యంలా వెంటపడిండు... నాకు భయం అయితాంది’
- ఆంధ్రప్రదేశ్: ఉపాధి హామీ కార్మికులు 8.58 లక్షల మందికి రూ. 53.47 కోట్లు మూడేళ్లుగా పెండింగ్.. కారణం ఏమిటి?
- అబ్బాయిలకు శిక్షణనిస్తే అమ్మాయిలపై వేధింపులు తగ్గుతాయా
- అమెజాన్ అలెక్సా మరింత స్మార్ట్ అవుతోంది... మీకు తోడుగా ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధమవుతోంది
- ఐఐటీ మద్రాస్: "ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో మా క్యాంపస్ కంపు కొడుతోంది"
- హిట్లర్ ఇంట్లో పోలీస్ స్టేషన్
- 'ఇడియట్స్' గ్రామం పేరు మార్పు... సంబరాలు జరుపుకొంటున్న గ్రామస్థులు
- మహారాష్ట్ర: ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రే ఎన్నిక...
- 'రాజుల కోట' నుంచి అమూల్యమైన వజ్రాలను ఎత్తుకెళ్లిన దొంగలు
- పోర్న్ తారల అకౌంట్లను ఇన్స్టాగ్రామ్ ఎందుకు తొలగిస్తోంది?
- వీగర్ ముస్లింలను కట్టుదిట్టమైన జైళ్ళలో బంధించి 'బ్రెయిన్వాష్' చేస్తున్న చైనా
- ఇన్స్టాగ్రామ్లో ఫొటో పెట్టాలని ఈమె 7 లక్షలు అప్పుచేసి డిస్నీలాండ్ వెళ్లారు
- మోదీ ప్రభుత్వం గణాంకాలను దాచిపెట్టి, ఎవరికి మంచి చేయాలనుకుంటోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








