విశాఖ: అనాథ శవాన్ని మూడు కిలోమీటర్లు మోసుకెళ్లిన రాంబిల్లి ఎస్ఐ

ఫొటో సోర్స్, Rambilli PS, Visakhapatnam
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
అనాథ శవాన్ని మూడు కిలోమీటర్లు మోసి మానవత్వం చాటుకున్నారు ఏపీ పోలీసులు.
విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలోని సీతపాలెం సముద్ర తీరానికి గురువారం నాడు గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది.
దీన్ని గుర్తించిన రాంబిల్లి రెవిన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో రాంబిల్లి ఎస్ఐ అరుణ్ కిరణ్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు.
డెడ్ బాడీ గురించి చుట్టు పక్కల గ్రామాల్లో ఆరా తీశారు.
శవాన్ని గుర్తించాలని చుట్టుపక్కల గ్రామాలకు సమాచారం ఇచ్చారు.

ఫొటో సోర్స్, Rambilli PS, Visakhapatnam
కానీ, మృతదేహాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు.
దీంతో పోలీసులు దీన్ని అనాథ శవంగా భావించారు.
పోస్ట్మార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించాలని అనుకున్నారు.

ఫొటో సోర్స్, Rambilli PS, Visakhapatnam
స్థానికులను, మత్స్యకారులను సాయం అడిగారు.
కానీ సాయం చేయడానికి స్థానికులెవరూ ముందుకు రాలేదని, దాంతో మృతదేహాన్ని ఒక చాపలో చుట్టి తామే మోసుకుంటూ తీసుకెళ్లామని ఎస్ఐ అరుణ్ కిరణ్ బీబీసీతో చెప్పారు.
"చనిపోయి సుమారు మూడు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయి దాని నుంచి దుర్వాసన వస్తోంది. దాంతో బాడీని తీసుకెళ్లడానికి స్థానికులు సహకరించలేదు. అందుకే తామే అనాథ శవాన్ని మోసుకుంటూ తీసుకెళ్లాం" అని ఎస్సై అరుణ్ కిరణ్ బీబీసీకి చెప్పారు.
ఎస్ఐ అరుణ్ కిరణ్తో పాటు ఏఎస్ఐ దొర, హెడ్ కానిస్టేబుల్ మసేను, కానిస్టేబుల్ నర్సింగరావు, హోంగార్డ్ కొండబాబులు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం శవాన్ని మోసుకుంటూ తీసుకెళ్లి ఎలమంచిలిలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
అనాథ మృతదేహానికి సాయం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎస్ఐ అరుణ్ కిరణ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సూయజ్ కాలువలో చిక్కుకున్న నౌకను వెంటనే తీయకపోతే మీ జేబుకు చిల్లుపడొచ్చు..ఎందుకో మీరే చదవండి
- బంగ్లాదేశ్ యుద్ధంలో భారత పైలట్లు చివరి మూడు నిమిషాల్లో ఏం చేశారు
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- రైతుల ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్ట్ మన్దీప్ పునియా అరెస్ట్
- మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- ఎడారి ఇసుక నేలలో పచ్చని పొలం... ఈ అద్భుతం ఎలా సాధ్యం?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- రైతుల నిరసనలు: ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గొద్దు.. రైతులకు సూచించిన రాహుల్ గాంధీ
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- సింధు నదీజలాల ఒప్పందం వల్ల భారత్ నష్టపోతోందా.. అసలు ఎందుకీ ఒప్పందం చేసుకున్నారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- పంటలకు ఈ రైతు హోమియో మందులు వేస్తున్నారు... ఎందుకో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








