Cyclone Nivar: తీరం దాటనున్న నివర్ తుపాను.. ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది?

నివర్ తుపాను మంగళవారం నుంచి గురువారం మధ్య ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి తీరాలను తాకనుంది.
బంగాళాఖాతంలో మొదలైన వాయుగుండం ప్రభావంతో చాలా ప్రాంతల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
బంగాళాఖాతం నైరుతి దిశగా ఏర్పడిన ఈ వాయుగుండం గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా కదులుతోందని, తుఫానుగా మారిందని అధికారులు తెలిపారు.
నివర్ తుపాను నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరికి రెడ్ అలర్ట్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ తుపాను నవంబర్ 25న సాయంత్రం తమిళనాడు, పుదుచ్చేరి తీరాలను తాకే అవకాశం ఉందని, ఇది కరైకల్-మామల్లపురం మధ్య తీరం దాటవచ్చని అధికారులు చెబుతున్నారు..
తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవచ్చని భావిస్తున్నారు.
మంగళవారం చెన్నైలో భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి.
బుధవారం నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా మారుతుందని, దీని వేగం గంటకు 110 కిలోమీటర్ల వరకూ చేరవచ్చని చెబుతున్నారు.
తమిళనాడులో సహాయ కార్యక్రమాలకు 30 ఎన్డీఆర్ఎప్ బృందాలను సిద్ధం చేశారు.
నివర్ ఈ ఏడాది బంగాళాఖాతంలో వచ్చిన రెండో తుపాను. ఇంతకు ముందు మేలో అంఫన్ తుపాను వచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆంధ్రప్రదేశ్ ముందు జాగ్రత్త...
నివర్ తుపాను నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కునేలా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను సీఎం సమీక్షించారు.
తుపాను నేరుగా ఏపీ తీరాన్ని తాకకపోయినా, తమిళనాడుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో దాని ప్రభావం ఉంటుందని సూచనలు అందాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అదికారులను ఆదేశించారు.
నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లా తీర ప్రాంతాల్లో, కర్నూలు, అనంతపురం జిల్లాలలో 11 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 65 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సీఎం చెప్పారు.
పంటలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని, ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోస్తా జిల్లాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

ఫొటో సోర్స్, @rrrajeshsmart
తమిళనాడు, పుదుచ్చేరిలో ఏర్పాట్లు
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి మంగళవారం ఉదయం తుపాను ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ముందు జాగ్రత్త కోసం పుదుచ్చేరిలో సెక్షన్ 144 అమలు చేశారు. అన్ని షాపులు, కార్యాలయాలను నవంబర్ 24 రాత్రి 9 నుంచి నవంబర్ 26 ఉదయం 6 గంటల వరకూ మూసివేయాలని ఆదేశించారు.
అటు తమిళనాడులో 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని భావిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
తుపాను బుధవారం సాయంత్రం తీరం దాటుతుందని, ఈ ప్రభావంతో రాబోవు మూడు రోజులపాటు తమిళనాడులో వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ డైరెక్టర్ బాలచంద్రన్ చెప్పారు.
చెన్నై, మిగతా ప్రాంతాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
తమిళనాడులో ఏడు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. ప్రయాణాలు మానుకోవాలని తమిళనాడు ప్రభుత్వం ప్రజలను కోరింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు, పుదుచ్చేరి ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- అత్యంత ప్రమాదకరమైన అయిదు ఆహార పదార్థాలు ఇవే...
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- యూరినరీ ఇన్కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- నియాండర్తల్: ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. హోమో సేపియన్స్ చేతిలో ఎంత దారుణంగా చనిపోయారంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








