అభినందన్‌ను విడిచిపెట్టకపోతే భారత్ దాడి చేస్తుందని పాక్ సైన్యాధిపతి వణికిపోయారు: పార్లమెంటులో పాక్ ఎంపీ

అభినందన్

ఫొటో సోర్స్, ANI

భారత వాయుసేన పైలట్ అభినందన్‌ను విడిచిపెట్టకపోతే తమ దేశంపై భారత్ దాడి చేస్తుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ చెప్పినప్పుడు.. పాక్ సైన్యాధిపతి ఖమర్ జావెద్ బజ్వా కాళ్లు వణికిపోయాయని ఓ పాక్ ఎంపీ తెలిపారు.

ఫిబ్రవరి 2019లో భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను విడిచిపెట్టినప్పటి పరిస్థితులపై పాకిస్తాన్ పార్లమెంటు నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ (పీఎంఎల్-ఎన్) నాయకుడు అయాజ్ సాదిఖ్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

''ఆ రోజు రాత్రి పీపీపీ, పీఎంఎల్-ఎన్ సహా పార్లమెంటరీ పార్టీ నాయకులతో మహమ్మద్ ఖురేషీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అభినందన్‌ను విడిచిపెట్టకపోతే ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు పాక్‌పై భారత్ దాడి చేస్తుందని చెప్పారు'' అని వివరించారు.

''ఆ సమావేశానికి ఇమ్రాన్ ఖాన్ రాలేదు. అయితే, గదిలోకి వచ్చేటప్పుడు సైన్యాధిపతి జనరల్ బజ్వా పరిస్థితి నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన కాళ్లు వణికాయి. ఒళ్లంతా చెమటలు పట్టి కనిపించాయి. ఆ తర్వాత అభినందన్‌ను వదిలిపెట్టేద్దామని ఖురేషీ అన్నారు. లేకపోతే తొమ్మిది గంటలకు భారత్ దాడి చేస్తుందని చెప్పారు''అని సాదిఖ్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆ విషయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని అన్ని విపక్షాలు నిర్ణయించినట్లు సాదిఖ్ చెప్పారని దునియా న్యూస్ వివరించింది.

2019 ఫిబ్రవరి 27న భారత్-పాక్ మధ్య ఘర్షణల నడుమ భారత్ గగన తలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానం ఎఫ్-19ను అభినందన్ కూల్చివేశారు. అయితే, ఈ క్రమంలో అభినందన్ ప్రయాణించిన విమానం పాక్ భూభాగంలోకి వెళ్లి పేలిపోయింది. ఆయన పాక్ అధికారుల చేతులకు చిక్కారు.

2019 మార్చి 1న అటారి-వాఘా సరిహద్దుల్లో ఆయన్ను భారత్‌కు పాక్ అప్పగించింది. అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్‌ను వీర్ చక్ర పతకంతో భారత్ సత్కరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)