రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన... 101 రకాల రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు

ఫొటో సోర్స్, NurPhoto
భారత రక్షణశాఖ 101 రకాల రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించింది.
‘ఆత్మనిర్భర భారత్’ నినాదంలో భాగంగా రక్షణ రంగంలో స్వావలంబన సాధించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
రక్షణ ఉత్పత్తుల స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తూ, సైన్యం స్వావలంబన సాధించేలా చేస్తామని అన్నారు.
రక్షణ మంత్రిత్వశాఖకు సంబంధించిన అన్ని విభాగాలతో చాలా సార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ ఆంక్షలు విధించే ఉత్పత్తుల జాబితాను రూపొందించినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం, భవిష్యతులో దేశీయంగా యుద్ధ సామగ్రి తయారీ సామర్థ్యాలను అంచనా వేసుకునేందుకు సాయుధ బలగాలు, ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలతోనూ చర్చించినట్లు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్న జాబితాలో దేశ రక్షణ అవసరాలు తీర్చే ఆర్టిలరీ గన్, అసాల్ట్ రైఫిల్స్, రవాణా విమానాలు, ఎల్సీహెచ్ఎస్ రాడార్ల లాంటి కొన్ని ఆధునిక సాంకేతికత కలిగిన సామగ్రి, వస్తువులు కూడా ఉన్నాయని అన్నారు.
వచ్చే 6-7 ఏళ్లలో దేశీయ రక్షణ పరిశ్రమలకు రూ.4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చే అంశం గురించి కూడా రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, YAWAR NAZIR
ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ దేశీయ రక్షణ పరిశ్రమలకు రూ.52 వేల కోట్ల ప్రత్యేక కేటాయింపులను ఆయన ప్రకటించారు.
అయితే, దిగుమతులపై ఆంక్షలు వెంటనే కాకుండా... 2020 నుంచి 2024 మధ్యలో దశలవారీగా అమల్లోకి వస్తాయని రాజ్నాథ్ వివరించారు.
ఈ ఉత్పత్తుల్లో సైన్యం, వాయుసేన కోసం రూ.1.3 లక్షల కోట్ల మేర విలువైన సామగ్రి, నావికాదళం కోసం రూ.1.4 లక్షల కోట్ల విలువైన సామగ్రి తయారవుతుందని ఆయన అన్నారు.
ఆంక్షలు విధించిన పరికరాల ఉత్పత్తి అనుకున్న సమయంలో జరిగేలా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని రాజ్నాథ్ అన్నారు. ఇందుకోసం రక్షణ విభాగాలు, పరిశ్రమల మధ్య సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
భవిష్యతులోనూ సంబంధిత విభాగాలతో సంప్రదింపులు జరుపుతూ, మరిన్ని ఉత్పత్తులను ఆంక్షల జాబితాలోకి తీసుకువస్తామని కూడా రాజ్నాథ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ కొత్త మ్యాప్ గురించి చైనా ఎందుకు నోరు మెదపలేదు
- భారత్-చైనా సరిహద్దుల్లో భారీ రవాణా సదుపాయాలు ఎందుకు నిర్మిస్తున్నారు?
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కేరళలో ఎయిరిండియా విమాన ప్రమాదం: కోళికోడ్లో ల్యాండవుతూ జారడంతో దుర్ఘటన... 17 మంది మృతి
- ఏడుగురు ఫ్రెండ్స్ చనిపోయారు.. నేను చనిపోయినా బాగుండేది’
- అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరం
- 'నా భర్త నన్ను కొడుతుంటే అందరూ ఇది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








