కరోనావైరస్ అన్లాక్ 1: ఆలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు ఓపెన్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ వ్యాప్తి ఆందోళనల నడుమ భారత్లో లాక్డౌన్ను దశల వారీగా సడలిస్తున్నారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నాయి.
జూన్ 1 నుంచి సడలించే ఆంక్షల జాబితాను అన్లాక్-1 పేరుతో ఇప్పటికే కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. మూడు దశల్లో లాక్డౌన్ను సడలించబోతున్నట్లు దీనిలో పేర్కొంది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 1
మొదటి దశలో భాగంగా జూన్ 8 అంటే సోమవారం నుంచి ఆతిథ్యం, పర్యటకంతోపాటు మరికొన్ని కార్యకలాపాల నిర్వహణకు అనుమతిచ్చింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉండే ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వీటిలో ఉన్నాయి.
ఈ ఆదేశాలకు అనుగుణంగానే సోమవారం నుంచి సడలించబోయే ఆంక్షల జాబితాను ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ విడుదల చేశాయి. సడలింపుల నడుమ ప్రజలు పాటించాల్సిన నియమ నిబంధనలనూ వెల్లడించాయి.

ఫొటో సోర్స్, FACEBOOK
గుడిలో చేయకూడనివి ఏంటి?
జూన్ 1న కేంద్రం సూచించినట్లే తెలుగు రాష్ట్రాల్లోనూ కంటైన్మెంట్ జోన్లో లాక్డౌన్ ఈ నెల 30 వరకు కొనసాగుతుంది. ఇక్కడ ఆంక్షలన్నీ యథావిధిగా అమలులో ఉంటాయి.
కంటైన్మెంట్ జోన్ల వెలుపల తెరిచే ఆలయాలు, షాపింగ్ మాల్స్ విషయంలో అనుసరించాల్సిన నిబంధనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గ దర్శకాలు విడుదల చేసింది. వాటి ప్రకారం.. రాష్ట్రాంలో దేవాలయాలతోపాటు, ఇతర ధార్మిక ప్రాంతాలు జూన్ 8 నుంచి తెరచుకోవచ్చు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 2
అయితే దేవతా విగ్రహాలతోపాటు పవిత్ర గ్రంథాలను తాకకుండా భక్తులు దర్శనాలు చేసుకోవాలి. తీర్థ ప్రసాదాలు ఇవ్వకూడదు. భక్తులపై పవిత్ర జలాలు చల్ల కూడదు. అన్నదానం నిర్వహణ సమయంలో సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. భక్తులు అన్నిచోట్లా తప్పకుండా భౌతిక దూరంపాటిస్తూ క్యూలో నిలబడాలి.
ఈ నిబంధనలకు అనుగుణంగా తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సోమవారం (జూన్ 8) నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నామని ఆలయ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు.
కేరళలోని ప్రఖ్యాత శబరిమల 14న, అనంత పద్మనాభస్వామి ఆలయం 9న, గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం 15న తెరచుకోనున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సినిమా థియేటర్లు ఇప్పుడే కాదు
మరోవైపు కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఇతర ప్రదేశాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరచుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిల్ ఇచ్చేందుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. షాపింగ్ మాల్స్ లో ఉన్న సినిమా థియేటర్లను తెరవకూడదు.
షాపింగ్ మాల్స్ లో ఏసీ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలి. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు తమ కెపాసిటీలో 50 శాతం మందిని మాత్రమే లోపలకు అనుమతించాలి.
హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లు మారిన ప్రతిసారీ.. టేబుళ్లు, కుర్చీలను శానిటైజ్ చేయాలి. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉమ్మకూడదు.
తెలంగాణలోనూ ఇదే విధంగా ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్ తెరచుకుంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర, నిత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ జోన్ల లోపలికి కానీ, బయటకు కానీ వ్యక్తుల సంచారం లేకుండా ఖచ్చితమైన నియంత్రణ ఉంటుంది.
స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు, శిక్షణా సంస్థలు, కోచింగ్ సంస్థలు మొదలైనవాటిని రెండో దశలో తెరుస్తారు. మూడో దశలో అంతర్జాతీయ విమాన సేవలు, మెట్రో రైలు సేవలు, సినిమా హాళ్లు ఇతర ప్రాంతాలను తెరుస్తారు. ఈ రెండు దశలు ఎప్పుడు మొదలవుతాయో స్పష్టమైన సమాచారం లేదు.
మరోవైపు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ మంతటా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి:
- భారత్లో కేసులు పెరుగుతున్నా లాక్డౌన్ను ఎందుకు సడలిస్తున్నారు
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఉత్తర ప్రదేశ్లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- భారత్-నేపాల్ సంబంధాలు: 1990ల్లో 13 నెలలపాటు నేపాల్ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








