కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?

ఈ రోజు నుంచి కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో ప్రత్యేక రైళ్లు పరుగులుతీయబోతున్నాయి. ప్రయాణికుల మధ్య కరోనావైరస్ వ్యాప్తించకుండా రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
తొలి రోజు 1.45 లక్షల మంది ఈ రైళ్లలో ప్రయాణించబోతున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. జూన్ 30 వరకు మొత్తంగా 25,82,671 మంది టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వలస కూలీల కోసం మే 12 నుంచీ 30 ప్రత్యేక శ్రామిక్ రైళ్లను రైల్వే నడిపిస్తోంది. వాటికి అదనంగా ఈ 200 రైళ్లు పరుగులు తీస్తాయి.
ప్రత్యేక రైళ్లలో ఏసీతోపాటు నాన్-ఏసీ కోచ్లు ఉంటాయి. జనరల్ బోగీల్లోనూ కూర్చుని ప్రయాణించేందుకు రిజర్వేషన్ చేయించుకోవాలి. అన్రిజర్వుడ్ బోగీలంటూ ఏమీ ఉండవు.
మే 22 నుంచీ ఈ రైల్ టికెట్ల బుకింగ్ మొదలైంది. అడ్వాన్స్ రిజర్వేషన్ సమయాన్ని 30 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు.
ప్రయాణికుల తొలిచార్ట్ను నాలుగు గంటల ముందే సిద్ధంచేస్తారు. రెండో చార్ట్ను రెండు గంటల ముందు సిద్ధంచేస్తారు. ఇదివరకు 30 నిమిషాల ముందే సిద్ధంచేసేవారు.
కరోనావైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రత్యేక రైలు సేవలపై ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. దీనికి సంబంధించి రాష్ట్రాలతో రైల్వే ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నట్లు రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రయాణ సమయంలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- ప్రత్యేక రైలు మొదలయ్యే సమయానికి కనీసం 90 నిమిషాల ముందే ప్రయాణికులు రైల్వే స్టేషన్కు చేరుకోవాలి.
- కొంచెం తక్కువ లగేజీని వెంట తెచ్చుకోవాలని ప్రయాణికులకు రైల్వే సూచించింది. రైల్వే కూలీలు చాలా తక్కువ మంది మాత్రమే అందుబాటులో ఉంటారని, పైగా లగేజీ తక్కువుంటే ప్రయాణం సులభంగా సాగుతుందని తెలిపింది.
- టికెట్ బుక్చేసుకున్నవారు మినహా మరెవరూ ప్రయాణించకుండా చూసేందుకు ప్రత్యేక తనిఖీ కేంద్రాలుంటాయి. అందరూ తప్పనిసరిగా టికెట్ వెంట తెచ్చుకోవాలి. టికెట్ లేకపోతే స్టేషన్ లోపలకు అనుమతించరు.
- వీలైనంతవరకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసేందుకు లోపలకు వచ్చే, బయటకు వెళ్లే మార్గాలను విడివిడిగా ఏర్పాటుచేశారు. మార్గాలను తేలిగ్గా గుర్తుపట్టేందుకు ప్రత్యేక గుర్తులు ఏర్పాటుచేశారు.
- ప్రయాణికులందరూ తప్పనిసరిగా శరీర ఉష్ణోగ్రతను కొలిచే థెర్మల్ స్క్రీనింగ్ కేంద్రాల్లో తనిఖీలు చేయించుకోవాలి. కరోనావైరస్ లక్షణాలు లేనట్లు తేలితేనే లోపలకు పంపిస్తారు.
- స్క్రీనింగ్లో కరోనావైరస్ లక్షణాలు కనిపిస్తే.. ప్రయాణానికి అనుమతించరు. అంతేకాదు వారి టికెట్ డబ్బులను తిరిగి ఇచ్చేస్తారు.
- బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్, రోగ నిరోధక శక్తి సమస్యలుండేవారు, గర్భిణులు, పదేళ్ల కంటే తక్కువ వయసుండేవారు, 65ఏళ్లకు పైబడినవారు... తప్పనిసరి అయితేనే ప్రయాణానికి రావాలి.
- స్టేషన్లోకి వచ్చేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి. అందరూ ప్రయాణం మొత్తం ఫేస్మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి.
- ప్రత్యేక రైళ్లలో టికెట్లను తనిఖీలు చేసేవారితోపాటు ఇతర సిబ్బంది కూడా ఉంటారు. ఏదైనా అవసరమైనా, అత్యవసర సమయాల్లో వారిని సంప్రదించాలి.
- మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్స్ సహా ప్రయాణికులు ఉపయోగించే అన్ని ప్రాంతాలనూ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తారు. ప్రయాణికులు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని రైల్వే అభ్యర్థిస్తోంది.
- ప్రయాణికులకు ఎలాంటి లినెన్ లేదా దుప్పట్లు ఇవ్వరు. ఎవరివి వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది.
- రైల్వేలో కేటరింగ్, ఆహార విక్రయ కేంద్రాలు తెరచే ఉంటాయి. ఫుడ్ప్లాజాల్లో ఆహారాన్ని పార్సిల్ తీసుకొని వెళ్లడానికి మాత్రమే అనుమతిస్తారు. అక్కడ తినే సదుపాయం ఉండదు. అయితే ఎవరి భోజనం వారే తెచ్చుకుంటే మంచిదని రైల్వే సూచిస్తోంది.
- అందరూ ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- ప్రత్యేక రైళ్లకు సంబంధించి ఎలాంటి అన్రిజర్వుడ్ టికెట్లు విక్రయించరు.
- కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సూచించిన నిబంధనలను ప్రయాణికులు అనుసరించాల్సి ఉంటుంది.





- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- పాకిస్తాన్: 'పది అడుగుల ఎత్తు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాను...' - కరాచీ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ జుబైర్
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్టాక్ చూపించింది’
- అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? చైనా డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?
- సంక్షేమానికి, వివాదాలకూ రారాజు జగన్
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నరేంద్ర మోదీ వారసుడు అమిత్ షాయేనా?
- స్వాల్బార్డ్కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








