Rahul Gandhi - Poonam Kaur : పాదయాత్రలో రాహుల్ చేయి పట్టుకుని నడిచిన తెలుగు హీరోయిన్.. బీజేపీ నేతల విమర్శలకు ఇచ్చిన జవాబు ఏమిటి

ఫొటో సోర్స్, @INCTELANGANA
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న 'భారత్ జోడో యాత్ర'లో భాగంగా శనివారం తెలంగాణలో సాగిన యాత్రలో సినీ నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు.
ఈ యాత్రలో రాహుల్ గాంధీ, పూనమ్ కౌర్ చేయిపట్టుకుని నడుస్తున్న ఫొటోపై చర్చ జరుగుతోంది.
ఈ ఫొటోపై బీజేపీ నేత ఒకరు సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 'భారత్ జోడో' పేరుతో యాత్ర చేస్తున్నారు. శనివారం భద్రాచలం గిరిజనులతో కలిసి కొమ్ము నృత్యం చేశారు.
ఈ యాత్రలో సినీ నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ యాత్ర ఫొటోలు సోషల్ మీడియా వేదికల్లో షేర్ అవుతున్నాయి.

ఫొటో సోర్స్, @VTankha
ఆ క్రమంలో రాహుల్ గాంధీ, పూనమ్ కౌర్ చేయి పట్టుకుని నడుస్తున్న ఫొటో ఒకటి శనివారం సోషల్ మీడియాలో కనిపించింది.
బీజేపీ మద్దతుదారు, కార్యకర్త అయిన ప్రీతి గాంధీ ట్విటర్లో ఈ ఫొటోను షేర్ చేస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
'ఆయన తాత అడుగుజాడల్లో నడుస్తున్నారు' అంటూ రాహుల్ గాంధీని, ఫొటోలో ఉన్న పూనమ్ కౌర్ను, రాహుల్ గాంధీ తాత అయిన జవహర్లాల్ నెహ్రూను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు..
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భారత తొలి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ మీద సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో భాగంగా నెహ్రూ మహిళలతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు.
ఎడ్వినా మౌంట్బాటన్తో నెహ్రూ సంబంధం గురించి కూడా అభ్యంతరకరమైన సందేశాలను సోషల్ మీడియాలోను, వాట్సాప్లోను షేర్ చేస్తున్నారు.
నెహ్రూను గురించి ఈ ప్రచారంలో రాహుల్ గాంధీని కూడా కలపటానికి ప్రీతి గాంధీ తన ట్వీట్ ద్వారా ప్రయత్నించారు.
ఇలా చేయటాన్ని సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు సహా పలువురు ప్రముఖులు తప్పుపట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ప్రీతి గాంధీ చేసిన ఈ ట్వీట్ వేలాదిగా రీట్వీట్లు, షేర్లు అయింది. చాలా మంది ఆమె వ్యాఖ్యను ఖండిస్తూ పోస్టులు పెట్టారు.
అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలతో కలిసివున్న ఫొటోలను కాంగ్రెస్ మద్దతుదారులు, సాధారణ ప్రజలు షేర్ చేస్తూ ప్రీతి గాంధీ ట్వీట్కు రిప్లై ఇస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''ఈ దాడి రాహుల్ గాంధీ మీద కాదు. ఆ మహిళ వ్యక్తిత్వం మీద. ఈ దాడి బీజేపీ చేస్తోందని అంటున్నారు. సిగ్గుచేటు ప్రీతి గాంధీ'' అని కాంగ్రెస్కు చెందిన రియా ట్వీట్ చేశారు.
శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేస్తూ.. ''పురుషులతో భుజం భుజం కలిపి, చేయి చేయి కలిపి మహిళలు నడవటం దేశాన్ని బలోపేతం చేస్తుందని, ముందుకు నడిపిస్తుందనేది మీ ఉద్దేశమైతే.. పండిట్ నెహ్రూ ఒక్కరి ఆకాంక్ష మాత్రమే కాదు, బాబాసాహెబ్ అంబేడ్కర్, ఇతర స్వాతంత్ర్య సమరయోధుల కలలు కూడా నెరవేరుతాయి'' అని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
''నెహ్రూ అడుగుజాడల్లో రాహుల్ నడుస్తున్నారన్న ప్రీతి గాంధీ వ్యాఖ్యతో కాంగ్రెస్ వాళ్లు అదుపుతప్పిపోతున్నారు. వాళ్ల దృష్టిలో నెహ్రూ అంత దారుణంగా ఉన్నారు. ఆయన ఏం చేశారని వాళ్లు అనుకుంటున్నారు?'' అని సంక్రాత్ సాను ప్రశ్నించారు.
''మహిళల విషయంలో బీజేపీ ఆలోచన ఎందుకు మారటం లేదో నాకు అర్థం కావటం లేదు'' అని కాంగ్రెస్ నేత ఆకాష్ శర్మ ట్వీట్ చేశారు.
''ఎంత మూర్ఖపు ట్వీట్ ఇది. మా కుటుంబం కొన్ని తరాలుగా కాంగ్రెస్కు మద్దతివ్వలేదు. ఓటు వేయలేదు. వేయదు కూడా. కానీ కాంగ్రెస్ కూడా మోదీ గురించి ఇలాంటి మూర్ఖపు ట్వీట్లు చేసింది. దానిని సామాన్య ప్రజలు ఈసడించారు. బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్నవారు ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు?'' అని అషు వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
జర్నలిస్ట్ రోహిణి సింగ్ ట్వీట్ చేస్తూ.. ''రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి చేయటం వేరే విషయం. కానీ మీ రాజకీయ ఆలోచనల వల్ల మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యలు చేయటం.. మహిళలు ప్రజా జీవితంలోకి రాకుండా బెదిరింపులా పని చేస్తుంది. ఈ దాడి రాహుల్ గాంధీ మీద మాత్రమే కాదు.. ఆ ఫొటోలో ఉన్న మహిళ మీద కూడా దాడే'' అని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ ట్వీట్ చేస్తూ.. ''అవును, రాహుల్ గాంధీ తన ముత్తాత అడుగుజాడల్లో నడుస్తూ దేశాన్ని ఏకం చేస్తున్నారు. ఇదికాక, మీ చిన్నప్పటి వేదనలు బాగా లోతుగా ఉన్నాయి. మీ చెడు ఆలోచనలను చూపుతున్నాయి. ప్రీతి మీకు చికిత్స అవసరం'' అని ఎద్దేవా చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
''మోదీ మద్దతుదారుగా మీకు రాహుల్ గాంధీ అంటే పడకపోవచ్చు. కానీ ఒక మహిళ అయి ఉండీ ఒక మహిళ గురించి ఇలా ఆలోచించటం? రాహుల్తో ఈ యువతి ఫొటోలో మీరు అంత చెడ్డ విషయం ఏం చూశారు? మీ అన్నతమ్ముళ్లు, అక్కచెల్లెళ్లు కూడా నెహ్రూ తన చెల్లెలు, మేనకోడలిలో ఉన్న ఫొటోలను అసభ్యకర వ్యాఖ్యలతో వైరల్ చేస్తారు'' అని జర్నలిస్ట్ అజిత్ అంజుమ్ ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీ తెలంగాణలో నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొన్న సినీ నటి, సామాజిక కార్యకర్త పూనమ్కౌర్ కూడా ప్రీతి గాంధీ వ్యాఖ్యపై స్పందించారు.
''ఇది చాలా అవమానకరం. ప్రధానమంత్రి 'నారీశక్తి' గురించి మాట్లాడటం మీకు గుర్తుందా? నేను జారి పడబోయినపుడు రాహుల్ గారు నా చేయి పట్టుకున్నారు'' అని ఆమె ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
దానికి ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ ఫొటోను ట్వీట్ చేస్తూ.. ''ఇలాంటి యాత్రలో ఎవరైనా వచ్చి పాలుపంచుకోవచ్చు. ప్రజల సమస్యలను వినటం, బలమైన, మెరుగైన భారతదేశాన్ని నిర్మించటం, సంభాషణను కొనసాగించటం మా లక్ష్యం'' అని పేర్కొంది.
ఆ ఫొటో ట్వీట్ను పూనమ్ కౌర్ షేర్ చేస్తూ.. ''మహిళల పట్ల రాహుల్ గాంధీ ఆదరణ, గౌరవం, వైఖరి నా గుండెను తాకింది. చేనేత కార్మికుల సమస్యల గురించి విన్నందుకు రాహుల్ జీకి చేనేత కార్మికులతో పాటు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా'' అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
పూనమ్ కౌర్ కొంతకాలంగా చేనేత, చేతివృత్తులపై సోషల్ మీడియాలో రాయటంతో పాటు ఫొటోలు షేర్ చేస్తున్నారు.
హైదరాబాద్లో పుట్టి పెరిగిన పూనమ్ దిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకున్నారు. ఆమె 2006 నుంచి తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర మొదలుపెట్టారు. అక్కడి నుంచి జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ వరకూ 3,570 కిలోమీటర్ల దూరం ఆయన పాదయాత్ర చేస్తున్నారు.
మొత్తం 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా సాగే ఈ యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
- జగన్పై దాడి కేసు విచారణ ఏమైంది.. ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది
- సమంత: ‘నేను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా’
- ముస్లింలు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో కరెన్సీ నోట్ల మీద వినాయకుని బొమ్మ ఎందుకు ఉంది?
- సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
- ట్రాన్స్ జెండర్ పాత్రలను కూడా మామూలు నటులతోనే చేయించాలా ? ఈ అభ్యంతరాలు ఎందుకు వినిపిస్తున్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)















