Manmohan Singh: అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని -Newsreel

మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కోవిడ్ బారిన పడి కోలుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఆయన నిన్నటి నుంచి జ్వరంతో బాధపడుతున్నారని, బలహీనంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని ఎయిమ్స్ అధికారులు తెలిపినట్లు ఏఎన్ఐ వెల్లడించింది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ ఏడాది ఏప్రిల్‌లో మన్మోహన్ కోవిడ్ బారినపడ్డారు. తర్వాత ఆయన కోలుకున్నారు.

మన్మోహన్ సింగ్ సాధారణ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఏఐసీసీ సెక్రటరీ ప్రణవ్ ఝా తెలిపారు. వదంతులను నమ్మవద్దని కోరారు.

కాగా మన్మోహన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారన్న వార్త వచ్చిన కొద్దిసేపటికే పార్టీలకు అతీతంగా అనేక మంది నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్‌లు చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మాజీ ప్రధాని త్వరగా కోలుకోవాలని దేశమంతా కోరుకుంటోందని, ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తోందని కాంగ్రెస్ పార్టీ ట్విటర్ వేదికగా పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

వంట నూనెలు

ఫొటో సోర్స్, Getty Images

తగ్గనున్న వంట నూనెల ధరలు

వంట నూనెల ధరలు దిగి వచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ముడి పామాయిల్, సోయా బీన్, సన్ ఫ్లవర్ ఆయిల్‌లపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించింది.

దీంతో పాటు వీటిపై అగ్రి సెస్ కూడా తగ్గించింది. ఈ మార్పులతో వంట నూనెల ధరలు కొంత తగ్గనున్నాయి.

ముడి పామాయిల్‌పై అగ్రిసెస్ 7.5 శాతానికి, ముడి సోయా బీన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్‌లపై 5.5 శాతానికి తగ్గించారు.

రిఫైన్డ్ ఆయిల్‌లపై బేసిక్ కస్టమ్స్ సుంకం 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గించారు.

రేపటి నుంచి(అక్టోబర్ 14 నుంచి) ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఇది అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)