75వ స్వాతంత్ర్య దినోత్సవం: 'పార్లమెంటు ప్రమాణాలు పడిపోతున్నాయి' - సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ

ఫొటో సోర్స్, Getty Images
చట్టాలను రూపొందించడంలో పార్లమెంటు ప్రమాణాలు కొంతకాలంగా పడిపోతూ వస్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తంచేశారు. చట్టసభల్లో చర్చలు జరిగే విధానంపైనా ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
సుప్రీం కోర్టు ఆవరణలో ఆదివారం 75వ స్వాతంత్ర్య దినోత్సవ నిర్వహణ సమయంలో రమణ మాట్లాడారు.
‘‘చట్టాల్లో చాలా అసందిగ్ధత, అస్పష్టత కనిపిస్తున్నాయి. వీటి వల్ల కోర్టులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.’’
‘‘నేటి పరిస్థితులను చూస్తుంటే బాధనిపిస్తోంది. చట్టాల్లో చాలా అసందిగ్ధత ఉంటోంది. అసలు ఈ చట్టాలను ఎందుకు రూపొందిస్తున్నారో అర్థంకావడం లేదు. ఇలాంటి చట్టాల వల్ల కోర్టులకు వచ్చే కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.’’

‘‘స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదులు క్రియాశీల పాత్ర పోషించారు. స్వతంత్ర భారతదేశానికి తొలి నాయకులు కూడా లాయర్లే’’అని రమణ అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ లాంటి స్వాతంత్ర్య ఉద్యమకారులు న్యాయవాదులేనని ఆయన గుర్తుచేశారు.
‘‘వారు తమ జీవితాలను దేశం కోసం త్యాగం చేశారు. కుటుంబాలు, ఆస్తులను వదిలి స్వాతంత్ర్యం కోసం పోరాడారు.’’
‘‘అప్పట్లో పార్లమెంటులో చర్చలు ఫలప్రదంగా సాగేవి. చట్టాలపై సుదీర్ఘ చర్చలు జరిపేవారు. కానీ, ఇప్పుడు పార్లమెంటులో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. చర్చల ప్రమాణాలు పడిపోయాయి. కొత్త చట్టాల లక్ష్యాలు, ఉద్దేశాలను కోర్టులు అర్థం చేసుకోలేకపోతున్నాయి’’అని రమణ అన్నారు.
రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య హక్కులను ప్రజలకు అందేలా చూడటంలో గత కొన్నేళ్లుగా సుప్రీం కోర్టు కీలక పాత్ర పోషిస్తోందని రమణ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: రాజధాని కాబుల్ను చుట్టుముట్టిన తాలిబాన్లు
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)








