బిహార్: గంగా నదిలో పడవ ప్రమాదం.. ఒకరి మృతి, అనేక మంది గల్లంతు.. ప్రమాద సమయంలో పడవలో 50 మంది - BBC Newsreel

మునిగిపోయినవారి కోసం గాలిస్తున్న సహాయ బృందాలు

ఫొటో సోర్స్, Ani

ఫొటో క్యాప్షన్, మునిగిపోయినవారి కోసం గాలిస్తున్న సహాయ బృందాలు

బిహార్‌లోని భగల్‌పూర్‌లోని నవ్‌గఛియా ప్రాంతంలో గంగా నదిలో పడవ మునిగిపోవడంతో ఒకరు మరణించారు.

అయితే, గురువారం ఉదయం ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మంది ఉన్నట్లు భగల్‌పూర్ కలెక్టర్ బీబీసీ ప్రతినిధి నీరజ్ ప్రియదర్శికి తెలిపారు.

ఇప్పటివరకు 30 మందిని రక్షించినట్లు ఆయన చెప్పారు. ఒక మృతదేహం లభించింది.

మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అగ్ని ప్రమాదం

ఫొటో సోర్స్, Kalpit Bhachech

వస్త్ర పరిశ్రమలో భారీ పేలుడు.. 12 మంది మృతి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వస్త్ర పరిశ్రమలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. మరో తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

పిరాలా-పీప్లాజ్ రోడ్డుకు అనుకుని ఉన్న పరిశ్రమలో బుధవారం ఉదయం ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

''ఒక బాయిలర్‌లో విస్ఫోటం సంభవించడంతో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీకి చెందిన మూడు షెడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి''అని అడిషనల్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాజీవ్ భట్.. బీబీసీ గుజరాతీకి తెలిపారు.

ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. బాయిలర్‌లో ఒత్తిడి పెరగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు.

ఘటనపై కేంద్ర హోం మంత్రి విచారం వ్యక్తంచేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ నాలుగు లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించారు.

బాయిలర్ల పేలుడుకు కారణాలపై విశ్రాంత డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ పీసీ పర్మార్ బీబీసీతో మాట్లాడారు.

అగ్ని ప్రమాదం

''గుజరాత్‌లోని వస్త్ర పరిశ్రమలు ప్రస్తుతం ఎలాంటి నిబంధనలూ అనుసరించడం లేదు. బాయిలర్స్ ఉండే పరిశ్రమలు ఆరు నెలలకు ఒకసారి లైసెన్సులను పునరుద్ధరించుకోవాలి. కానీ ఎవరూ అలా చేయడం లేదు. వాడేకొద్దీ బాయిలర్‌లో లోహం దెబ్బతింటుంది. పెరిగే ఒత్తిడికి అది తట్టుకోలేదు. చాలా మంది బాయిలర్లలో విస్ఫోటం చెందే అవకాశమున్న పదార్థాలు ఉపయోగిస్తున్నారు. దీంతో విస్ఫోటాలు జరిగి పేద కార్మికులు బలవుతున్నారు''అని పర్మార్ వ్యాఖ్యానించారు.

''ఇది చాలా తీవ్రమైన అంశం. మేం విచారణ చేపడుతున్నాం. బాయిలర్‌లో ఉపయోగించిన రసాయనాలు నిషేధ రసాయనాల జాబితాలో ఉన్నాయేమో పరిశీలిస్తున్నాం. ఫ్యాక్టరీ ఓనర్‌పై ఇప్పటికే కేసు నమోదుచేశాం. బాయిలర్లు నడపడానికి అనుమతులు ఉన్నాయో లేదో కూడా విచారణ చేపడుతున్నాం''అని ఏసీపీ మిలాప్ పటేల్ బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)