తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: విలీనం నుంచి విభజన వరకు, కీలక ఘట్టాలు..

హైదరాబాద్ రాజ్యంలోకి యుద్ధ ట్యాంకులతో ప్రవేశించిన భారతీయ సైన్యం

ఫొటో సోర్స్, TULIKA BOOKS

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ రాజ్యంలోకి యుద్ధ ట్యాంకులతో ప్రవేశించిన భారతీయ సైన్యం

జూన్ 2... తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం 2014లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. పదేళ్లు పూర్తయ్యాయి.

ఈ నేపథ్యంలో భారత్‌లో హైదరాబాద్ ప్రాంతం విలీనం అయినప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన సుదీర్ఘ పోరాటాల్లో కొన్ని ముఖ్య ఘట్టాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.

1948: నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం (ప్రస్తుత తెలంగాణ) పోలీస్ చర్య‌తో భారత్‌లో విలీనం అయింది. అప్పటి నుంచి 8 ఏళ్ల పాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మ్యాప్

ఫొటో సోర్స్, TELUGU AKADEMI BOOKS

ఫొటో క్యాప్షన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మ్యాప్

1956: ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరిపింది. పెద్దమనుషుల ఒప్పందం (జెంటిల్ మెన్ అగ్రిమెంట్)తో హైదరాబాద్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.

తెలంగాణ ఉద్యమం

ఫొటో సోర్స్, ETELANGANA.ORG

1969: పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. పోలీసుల కాల్పుల్లో 300 మంది చనిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, DR.MARRICHENNAREDDY/FACEBOOK

1973: ఇరు ప్రాంతాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు నాటి ప్రధాన మంత్రి ఇంధిరా గాంధీ ఆరు సూత్రాల పథకాన్ని (సిక్స్ పాయింట్ ఫార్ములా) ప్రతిపాదించారు. దీనికి ఆంధ్రా, తెలంగాణ నేతలు అంగీకరించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలు ఆగిపోయాయి.

కేసీఆర్

ఫొటో సోర్స్, KCR/FACEBOOK

ఫొటో క్యాప్షన్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని పెట్టారు

2001: తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆ పార్టీ శాసన సభ్యుడు కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు.

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు.

కేసీఆర్ నిరాహార దీక్ష చేశారు

ఫొటో సోర్స్, KCR FANS/FACEBOOK

ఫొటో క్యాప్షన్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేశారు

2009: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన దీక్షకు తెలంగాణ వాదులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.

తెలంగాణలో ఉద్యమం ఊపందుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శ్రీకాంత చారి ఆత్మబలిదానం చేసుకున్నారు.

కేసీఆర్ దీక్షతో తెలంగాణలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9 న కేంద్రం ప్రకటించింది.

జస్టిస్ శ్రీకృష్ణ

ఫొటో సోర్స్, BELLUR N.SRIKRISHNA/FACEBOOK

ఫొటో క్యాప్షన్, తెలంగాణ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.

2010: తెలంగాణ ఏర్పాటుపై ఆంధ్ర ప్రాంతం నుంచి వ్యతిరేకత రావడంతో తెలంగాణ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ రెండు ప్రాంతాలను సందర్శించి తన నివేదికలో ఆరు రకాల ప్రతిపాదనలు చేసింది.

హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్‌పై తెలంగాణ మిలియన్ మార్చ్

ఫొటో సోర్స్, ETELANGANA.ORG

2011, 2012 : శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఇరుప్రాంతాలను సంతృప్తి పరచలేకపోయింది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పడింది. వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు కలసి మిలియన్ మార్చ్, సాగర హారం, చలో అసెంబ్లీ, సకల జనుల సమ్మె తదితర రూపాల్లో నిరసనలు తెలుపుతూ ఉద్యమాలు చేశారు.

తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఫొటో సోర్స్, WWW.INC.IN

ఫొటో క్యాప్షన్, సీడబ్ల్యూసీ నిర్ణయానికనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

2013: హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

సీడబ్ల్యూసీ నిర్ణయానికనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

కేసీఆర్

ఫొటో సోర్స్, I AND PR TELANGANA

2014: అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగింది. బిల్లును వ్యతిరేకిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది.

కానీ, వివిధ పార్టీల మద్దతుతో రాజ్యసభ, లోక్‌సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.

జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)