కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచం... లాక్డౌన్ ఎత్తేసిన హుబే, త్వరలోనే వుహాన్లో కూడా సడలింపు

ఫొటో సోర్స్, Getty Images
విశ్వ మహమ్మారి కరోనావైరస్ పుట్టిన చైనాలోని వుహాన్ నగరంలో లాక్డౌన్ను ఏప్రిల్ 8 నుంచి పాక్షికంగా సడలించనున్నారు.
వుహాన్ మినహా మిగతా హుబే ప్రాంతమంతటా ఆరోగ్యంగా ఉన్నవారికి మంగళవారం అర్థరాత్రి నుంచి ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసింది.
దాదాపు వారం రోజుల నుంచీ కొత్త కరోనా కేసులేవీ బయటపడని వుహాన్లో మంగళవారం ఒక కొత్త కేసు నమోదైంది.
ప్రపంచవ్యాప్తంగా దేశాలు లాక్డౌన్ విధిస్తున్నాయి. లేదంటే తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారతదేశ వ్యాప్తంగా మంగళవారం అర్థరాత్రి నుంచి 21 రోజులు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
బ్రిటన్ సైతం కొత్త చర్యలు చేపట్టింది. వీటిలో ఇద్దరికి మించి బయట గుమిగూడడంపై నిషేధం, ప్రాధాన్యం లేని సరుకులు అమ్మే దుకాణాల మూసివేత లాంటివి ఉన్నాయి.
అమెరికన్లు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా, ఇతరులను కలవకుండా పరిమితులు విధించుకోవాలని లేదంటే దేశంలోని ఆరోగ్య సదుపాయాలను మించిపోయేలా కరోనా కేసులు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్పెయిన్లోని వృద్ధాశ్రమాలలో ఉన్నవారు కొందరు బెడ్ మీదే చనిపోయి కనిపించారని, కొందరు వాటి నుంచి వెళ్లిపోయారని తమ సైన్యం చెప్పినట్లు ఆ దేశ రక్షణ శాఖ చెప్పింది. మాడ్రిడ్లో ఉన్న ఒక ఐస్ రింక్ను కోవిడ్-19 మృతులకు తాత్కాలిక మార్చురీగా ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుతానికి ప్రపంవ్యాప్తంగా 3 లక్షల కేసులకు పైగా నమోదవడంతో ఈ మహమ్మారి మరింత వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ వ్యూహాలను దేశాలు మరింత తీవ్రం చేయాలని కోరింది.
Sorry, your browser cannot display this map

జనవరి నుంచి వుహాన్ మిగతా ప్రపంచానికి దూరంగా ఉంది. కానీ, ఇప్పుడు చైనాలో విస్తృతంగా ఉపయోగిస్తున్న ఒక స్మార్ట్ ఫోన్ హెల్త్ యాప్లో ఎవరికైనా ‘గ్రీన్ కోడ్’ ఉంటే, వారు ఏప్రిల్ 8 నుంచి నగరం వదిలి వెళ్లడానికి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.
వుహాన్లో ఒక కొత్త కరోనావైరస్ కేసు నమోదైందని కూడా అధికారులు చెప్పారు. అంతకు ముందు ఐదు రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
పాజిటివ్ కేసులు, ఆస్పత్రిలో అడ్మిట్ అయినవారు, వ్యాధి లక్షణాలు ఉన్న కొత్త కేసులేవీ నమోదు కాలేదని ఆరోగ్య అధికారులు ధ్రువీకరించిన తర్వాత ఈ కొత్త కేసు బయటపడింది.
ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం చైనా మెయిన్లాండ్లో గత 24 గంటల్లో 78 కొత్త కేసులు నమోదయ్యాయి. వారిలో నలుగురికి విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా కరోనా సోకింది.
‘సెకండ్ వేవ్’(రెండో ఉద్ధృతి)గా చెబుతున్న ఈ దిగుమతి కేసులు, గత కొన్నివారాలుగా వైరస్ను విజయవంతంగా నియంత్రించిన దక్షిణ కొరియా, సింగపూర్ లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
దక్షిణ కొరియాలో రోజూ నమోదయ్యే కొత్త కేసులు తగ్గిపోవడం కనిపిస్తోంది. ఫిబ్రవరి 29 తర్వాత మంగళవారం ఇక్కడ అతి తక్కువ కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, epa
కరోనా అమెరికా వదిలిన ఆయుధమా? - అనుమాన బీజాలు నాటుతున్న చైనా
బీబీసీ ప్రతినిధి రాబిన్ బ్రాంట్ విశ్లేషణ
చైనా తనను కరోనా నుంచి దాదాపు బయటపడిన దేశంగా భావిస్తోంది.
మాస్కులు, తగిన రక్షణ దుస్తులు వేసుకోకుండానే రోగులకు చికిత్స చేసిన తమ వైద్యుల్లా తప్పిదాలు చేయవద్దని, మహమ్మారితో పోరాడుతున్న ఆరోగ్య సిబ్బంది రక్షణ కోసం మరిన్ని చర్యలు చేపట్టాలని వుహాన్ వైద్యులు గత వారం బ్రిటన్, ఇతర దేశాలను హెచ్చరించడం మనం విన్నాం.
ఇటలీలో కరోనావైరస్ మృతుల సంఖ్య చైనాను కూడా దాటిపోయిందని మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి.
అదే సమయంలో, విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ద్వారా దిగుమతి అవుతున్న కేసుల వల్ల ‘సెకండ్ వేవ్’ ముప్పు ఉంటుందనే భయాందోళనలు పెరుగుతున్నాయి. తప్పో, ఒప్పో... చైనాలా కఠిన చర్యలు అమలు చేయని కొన్ని దేశాలు ఈ ముప్పును తీవ్రంగా పరిగణించడం లేదనే వాదనలకు ఇది ఆజ్యం పోస్తోంది. (బీజింగ్లో నమోదైన దాదాపు అన్ని కేసులూ స్వదేశానికి తిరిగివచ్చిన చైనీయులవే.)
మరోవైపు, కొందరు సీనియర్ నేతలు, కొందరు హై-ప్రొఫైల్ దౌత్య వేత్తలు “బహుశా అమెరికా దీన్ని ఆయుధంలా మార్చి చైనాకు పంపించి ఉండవచ్చని, లేదా చైనా కంటే ముందే ఇటలీలో కోవిడ్-19 కేసులు ఉండవచ్చనే సిద్ధాంతాలను అంతర్జాతీయ మీడియాలో వ్యాపించేలా చేస్తున్నారు.
చైనా అనుమాన బీజాలు నాటుతోంది. ప్రతిష్టను సరిదిద్దుకోవాలని చూస్తున్నట్లున్న ఆ దేశం తను వాస్తవాలు అనుకుంటున్న వాటిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఫొటో సోర్స్, getty images
ఆసియాలో తాజా పరిస్థితి
- భారత్ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది.
- పాకిస్తాన్లో నమోదవుతున్న కేసులు రెట్టింపు అయ్యాయి. సోమవారం సాయంత్రానికి పాజిటివ్ కేసుల సంఖ్య 878కు చేరింది. కఠిన ఆంక్షలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించలేదు. అయితే, కొన్ని ప్రావిన్సులు స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలు చేస్తున్నామని ప్రకటించాయి. దేశంలో ఆంక్షలు అమలయ్యేలా ఆర్మీని రంగంలోకి దించారు.
- బంగ్లాదేశ్లో 33 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతిచెందారు. ఇక్కడ కూడా సోషల్ డిస్టన్సింగ్ అమలయ్యేలా, కోవిడ్-19 నివారణ పద్ధతులు పాటించేలా ఆర్మీని మోహరించారు. స్వదేశానికి వచ్చి క్వారంటైన్లో ఉన్న వేల మంది సైన్యం నిఘాలో ఉన్నారు.
- వివిధ దేశాల్లో నమోదైనట్లు చెబుతున్న కేసుల కంటే అసలు కేసులు ఇంకా ఎక్కువే ఉండవచ్చని దక్షిణాసియా అంతటా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
- ఇండోనేసియాలో కోవిడ్-19తో 49 మంది మృతిచెందారని ధ్రువీకరించారు. ఇది ఆగ్నేయాసియాలోనే అత్యధికం. ఇక్కడ 2018లో నిర్మించిన అథ్లెట్స్ విలేజ్ను కరోనా రోగుల కోసం తాత్కాలిక ఆస్పత్రిగా మార్చేశారు. సోమవారం జకార్తాలో అత్యవసర స్థితి ప్రకటించారు.
- థాయ్లాండ్లో నెలపాటు కొనసాగుతున్న అత్యవసర స్థితిలో భాగంగా మంగళవారం నుంచి కర్ఫ్యూ అమలు చేయబోతున్నారు. ఇప్పటివరకూ ఎలాంటి కఠిన చర్యలు చేపట్టలేదని ప్రభుత్వం విమర్శలు ఎదుర్కుంటోంది. ఇక్కడ వైరస్తో నలుగురు చనిపోగా, దాదాపు 900 మందికి పాజిటివ్ వచ్చింది
- జపాన్ ప్రధాని, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి మధ్య ఈ సాయంత్రం చర్చలు జరగనున్నాయి.
- ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా బయటపడని మయన్మార్లో రెండు కేసులు నమోదైనట్లు ప్రకటించారు.

ఫొటో సోర్స్, afp
వైరస్తో పోరాటం తీవ్రతరం చేసిన యూరప్
బ్రిటన్లో ప్రజలను కొన్ని పరిమిత పనులకు మాత్రమే ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి అనుమతిస్తామని, ఇది తక్షణం అమల్లోకి వస్తుందని సోమవారం ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. వీటిలో నిత్యావసరాల కొనుగోళ్లు, రోజుకు ఒకసారి వ్యాయామం, వైద్య అవసరాలు, వర్క్ ఫ్రం హోం కుదరని వారు విధులకు వెళ్లడం లాంటివి ఉన్నాయి. బ్రిటన్లో కరోనా మృతుల సంఖ్య సోమవారం 335కు చేరింది.
ప్రపంచంలో కరోనావైరస్ వల్ల తీవ్రంగా నష్టపోయిన ఇటలీలో గత 24 గంటల్లో 602 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. దీంతో, ఇక్కడ మొత్తం మరణాల సంఖ్య 6077కు చేరింది.
కానీ, ఇటలీలో గురువారం తర్వాత రోజవారీ నమోదయ్యే కేసుల్లో ఇది అతి తక్కువ. దీంతో, ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలు ప్రభావం చూపిస్తున్నాయని దేశ ప్రజల్లో ఆశ మొదలైంది.
స్పెయిన్లో మంగళవారం 514 మంది మృతిచెందారని, దేశంలో మొత్తం మృతుల సంఖ్య 2696కు చేరిందని అధికారులు చెప్పారు. ఇక్కడ దాదాపు 40 వేల కేసులు నమోదయ్యాయి. వీరిలో 5400 మంది ఆరోగ్య సిబ్బంది కూడా ఉన్నారు.

- కరోనావైరస్ లైవ్ పేజీ: అంతర్జాతీయ, జాతీయ, స్థానిక సమాచారం
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: స్పెయిన్లో దిక్కు లేకుండా మృతి చెందిన వృద్దులు.. సైన్యాన్ని రంగంలోకి దించిన ప్రభుత్వం
- కరోనావైరస్: క్లోరోక్విన్తో కోవిడ్-19 నయమైపోతుందా? ఈ మలేరియా మందు మీద డోనల్డ్ ట్రంప్ ఎందుకు దృష్టి పెట్టారు?
- 'షూట్ ఎట్ సైట్' ఆర్డర్ ఇచ్చే పరిస్థితి తీసుకురావద్దు, అవసరమైతే ఆర్మీని దింపుతాం' - తెలంగాణ సీఎం కేసీఆర్
- కరోనావైరస్ రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్ల కష్టాలేమిటో తెలుసా? వారి మనసులోని మాటేమిటి?
- సీఏఏ నిరసనలు: షాహీన్ బాగ్ ధర్నా ప్రదేశాన్ని ఖాళీ చేయించిన పోలీసులు... నిరసన స్ఫూర్తి కొనసాగుతుందన్న మహిళలు
- ఇంట్లోనే ఉంటున్నప్పుడు.. గొడవలు, ఘర్షణలు లేకుండా కుటుంబ సభ్యులతో గడపడం ఎలా?
- తిరుమలలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం.. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటున్న అధికారులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









