కరోనా లాక్‌డౌన్: కరోనాపై పోరులో మనకున్న ఏకైక ఆయుధాన్ని వాడుదాం - కేసీఆర్

జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం అమెరికా 1,22,666 కరోనావైరస్ కేసులతో చైనాను దాటేసింది. భారత్‌లో ఇప్పటి వరకు 25 మరణాలు నమోదు అయ్యాయి.

లైవ్ కవరేజీ

  1. బ్రిటన్‌లో 20 వేలు దాటిన మరణాలు

    బ్రిటన్‌లో కోవిడ్-19 మృతుల సంఖ్య 20 వేలు దాటిందని హోం సెక్రటరీ ప్రీతి పటేల్ తెలిపారు.

    ఈ సంక్షోభ సమయంలో నేరగాళ్లు విజృంభిస్తున్నారని.. మాస్కుల రవాణా ముసుగులో తరలిస్తున్న 10 లక్షల పౌండ్ల విలువైన కొకైన్‌ను బోర్డర్ ఫోర్స్ స్వాధీనం చేసుకుందని చెప్పారు.

    ఫిషింగ్ స్కామ్స్ జరుగుతున్నాయని.. కొన్ని వెబ్‌సైట్లు బోగస్ పీపీఈలు విక్రయిస్తున్నాయని తెలిపారు.

    చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి 1300 ఫిర్యాదలు వచ్చాయన్నారు.

  2. మహారాష్ట్రలో ఒక్క రోజే 811 కొత్త కేసులు.. 22 మంది మృతి

    మహారాష్ట్రలో శనివారం కొత్తగా 811 పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి. 22 మంది మరణించారు.

    దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,628కి చేరింది. మృతుల సంఖ్య 323కి పెరిగింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. భారత్‌లో 14,378 కేసులు.. 480 మరణాలు

    దేశంలో గత 24 గంటల్లో 991 కరోనా పాజిటివ్ కేసులు, 43 మరణాలు నమోదయ్యాయి.

    దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,378కి మృతుల సంఖ్య 480కి పెరిగింది.

    దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1992 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. మొత్తం కేసుల్లో కోలుకున్నవారి శాతం 13.85.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. 50 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్

    దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సుమారు 50 మంది కోవిడ్-19 బారినపడ్డారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. దిల్లీ కరోనా పాజటివ్ కేసుల్లో సగం మంది నిజాముద్దీన్ మర్కత్‌కు చెందినవారే: కేజ్రీవాల్

    దిల్లీలో ఇంతవరకు మొత్తం 219 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 108 మంది నిజాముద్దీన్ మర్కత్‌కు చెందినవారేనని.. దిల్లీలో చనిపోయిన నలుగురిలో ఇద్దరు కూడా నిజాముద్దీన్ మర్కత్‌కు చెందినవారేనని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. స్పెయిన్‌లో 10 వేలు దాటిన మృతుల సంఖ్య

    స్పెయిన్‌లో కరోనావైరస్ మృతుల సంఖ్య 10,000 దాటిపోయింది. ఒక్కరోజులో 950 మంది మరణించడంతో మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. హోమ్ క్వారెంటైన్‌లో ఉన్న 25 వేల మందిని ట్రాక్ చేస్తామన్న మంత్రి ఈటల, కోవిడ్-19 మానిటరింగ్ సిస్టమ్ సహాయంతో పర్యవేేక్షణ

    హోమ్ క్వారెంటైన్‌లో ఉన్న 25 వేలకు పైగా కరోనా అనుమానితుల్ని వారి జియో లొకేషన్ ద్వారా రియల్ టైమ్‌లో ఆరోగ్య శాఖ ట్రాక్ చేస్తుందని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ట్వీట్ చేశారు. దిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ కార్యక్రమానికి హాజరై వచ్చిన వారి ప్రభావం విస్తృత స్థాయిలో ఉంటుందనే ఆందోళనల నేపథ్యంలో పర్యవేక్షణ చర్యలు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. తమిళనాడులో 'తబ్లీగీ జమాత్' కరోనా కేసులు

    నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్‌కు వెళ్లి వచ్చిన తమిళనాడు వాసులకు కూడా కరోనా ఉన్నట్టు తేలింది.

    ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి 1500 మంది హాజరయ్యారు. వీరిలో 50 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏఎన్ఐ ధ్రువీకరించింది.

    తాజాగా 50 కేసులతో తమిళనాడులోని మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 124కు చేరిందని తమిళనాడు హెల్త్ సెక్రటరీ చెప్పారని తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. కోవిడ్-19 నివారణ చర్యలు, విశాఖ సెంట్రల్ జైలు ఖైదీల తాత్కాలిక విడుదల

    కోవిడ్ 19 వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ సెంట్రల్ జైల్లో 7 ఏళ్ల శిక్ష అనుభవించిన ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేసింది.

    విశాఖ నగర పరిధిలో 71 మంది , విజయనగరం, శ్రీకాకుళం నగర పరిధిలో ఒక్కొక్కరు మొత్తం 73 మందిని విడుదల చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు విశాఖ సెంట్రల్ జైల్ నుండి విడుదలయ్యారు.

    జైలు నుంచి విడుదలైన అందరినీ ఒక నెల రోజులు పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉంటారు. నెల రోజుల తర్వాత వీరందరూ తిరిగి విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్తారు.

    "చట్ట పరమైన షరతుల ప్రకారం 73 మంది ఖైదీలు విడుదల చేశాం, వీరి కదలికలపై నిఘా ఉంచుతాం" అని విశాఖ జిల్లా జైల్ అధికారులు చెప్పారు.

  10. ఇబ్బందుల్లో ఉన్నవారి ఇంటి అద్దె దిల్లీ ప్రభుత్వమే చెల్లిస్తుంది: సీఎం కేజ్రీవాల్

    దిల్లీలో పేదలెవరైనా ఇంటి అద్దెలు చెల్లించలేకపోతే వారికి బదులు తన ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

    ఇంటి యజమానులు రెండు మూడు నెలల పాటు అద్దెల కోసం ఒత్తిడి చేయొద్దని సూచించారు. ఎ

    వరైనా చెల్లించలేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పిన ఆయన ఎవరైనా అద్దెల కోసం ఒత్తిడి చేసినా, ఖాళీ చేయమన్నా అలాంటి ఇంటి యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. భారత్‌లో 1024 పాజిటివ్ కేసులు.. 27 మరణాలు

    భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం రాత్రి 7.30 సరికి 1024కి పెరిగింది. వారిలో 96 మంది వ్యాధి నయం కాగా 27 మంది మరణించారు.

    అత్యధికంగా మహారాష్ట్రలో ఆరుగురు, గుజరాత్‌లో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.

    కర్ణాటకలో ముగ్గురు, దిల్లీ, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇద్దరేసి కరోనావైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయారు.

    బిహార్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కో మరణం నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వెల్లడించింది.

  12. ఆంధ్రప్రదేశ్‌లో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు

    ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    మార్చి 17న బర్మింగ్‌హామ్ నుంచి వచ్చిన రోగి(పేషెంట్ నంబర్ 7)తో మార్చి 21న ప్రత్యక్షంగా మెలగడంతో ఈ ఇద్దరికి వైరస్ సోకినట్లు గుర్తించారు.

    ఆదివారం 102 శాంపిళ్లు పరీక్షించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్ వెల్లడించింది.

    విశాఖ జిల్లాలో 6, గుంటూరులో 4, కృష్ణా జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 3, చిత్తూరు 1, తూర్పుగోదావరి 1, కర్నూలు 1, నెల్లూరు జిల్లాలో 1 కేసు నమోదైనట్లు వెల్లడించింది.

  13. కొత్త కేసులు నమోదు కాకుంటే ఏప్రిల్ 7 తరువాత తెలంగాణలో కరోనా ఉండదు: కేసీఆర్

    తెలంగాణలో ఇప్పటివరకు కరోనాపాజిటివ్ కేసులు 70 నమోదయ్యాయని.. వారిలో 11 మందికి ఇప్పుడు నయమైందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. తాజాగా వారికి చేసిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో ఆ 11 మందిని సోమవారం డిశ్చార్జి చేస్తారన్నారు. మిగతావారికీ నయమైతే, కొత్తగా కేసులు నమోదు కాకుంటే ఏప్రిల్ 7 నాటికి ఇప్పుడున్నవారంతా డిశ్చార్జ్ అవుతారని.. అప్పుడు తెలంగాణలో కరోనా కేసులు ఉండవని కేసీఆర్ అన్నారు.

  14. వరి, మొక్క జొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: కేసీఆర్

    తెలంగాణలో ఈ వ్యవసాయ సీజన్‌లో రైతులు ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ప్రధానంగా 40 లక్షల ఎకరాల్లో 1.05 కోట్ల టన్నుల వరి చేతికందనుందని.. 14.5 లక్షల టన్నుల మొక్కజొన్న చేతికందనుందని చెప్పారు. ఈ పంటనంతటినీ కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనాలని నిర్ణయించిందని కేసీఆర్ చెప్పారు. గ్రామాలకే వచ్చి నియంత్రిత కొనుగోలు కేంద్రాలలో కొంటామన్నారు. రైతులకు నిర్దేశిత తేదీలు కేటాయించి, కూపన్లు ఇచ్చి ఆ ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎవరూ కొనుగోలు కేంద్రాలకు రావొద్దని.. అక్కడ ఎవరూ ఉండరని.. అలా కొనుగోలు కేంద్రాలకు వస్తే అనవసరంగా కరోనావ్యాప్తి జరుగుతుందని, ప్రశాంతంగా ఉన్న తెలంగాణ పల్లెల్లో విజృంభించే ప్రమాదం ఉంటుందని.. దాన్ని నివారించేందుకే గ్రామాలకు వెళ్లి అధికారులు కొనుగోలు చేస్తారని చెప్పారు. రైతులంతా ఈ నిబంధనను పాటించాలని సూచించారు.

  15. కరోనాపై పోరులో మనకున్న ఏకైక ఆయుధాన్ని వాడుదాం: కేసీఆర్

    క్వారంటీన్‌లో ఉన్నవారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.. వారిలో ఎవరికైనా రోగ లక్షణాలు తీవ్రంగా ఉంటే వారిని ఆసుపత్రులకు రిఫర్ చేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.. ఇకపై కొత్తగా కేసులు నమోదు కాకుంటే కొద్ది రోజుల్లో ప్రస్తుత బాధితులందరూ కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అవుతారని చెప్పారు. విమనాశ్రయాలు, రైల్వేలు అన్నీ మూసివేయడం వల్ల కొత్తగా ఎవరూ బయట నుంచి వచ్చే అవకాశం లేదు కాబట్టి కొత్త కేసులు రావనే ఆశిస్తున్నామన్నారు. భారత్‌లో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌పై అంతర్జాతీయ మెడికల్ జర్నళ్లలోనూ వ్యాసాలు వచ్చాయని, 130 కోట్ల మంది ఉన్న దేశంలో సమస్య ముదరకుండా తెలివైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. కరోనాపై పోరులో మనకున్న ఏకైక ఆయుధమైన స్వీయ నియంత్రణను పాటించి లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు.

    కేసీఆర్

    ఫొటో సోర్స్, facebook/telanganacmo

  16. ప్రైవేట్ ఆరోగ్య వ్యవస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి: మానవ హక్కుల వేదిక

    కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులను, నర్సింగ్ హోంలను స్వాధీనం చేసుకోవాలని మానవ హక్కుల వేదిక(హెచ్‌ఆర్‌ఎఫ్) డిమాండ్ చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలను వాటిలో ఉన్న అన్ని వైద్య సదుపాయాలు, మానవ వనరులు సహా స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నిర్వహణ చేపట్టి ఈ విపత్తును ఎదుర్కోవాలని కోరింది. ఈ విషయంలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌ను జాతీయం చేసిన స్పెయిన్‌ను భారత ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది. కరోనావైరస్ మహమ్మారి మానవాళిని గడగడలాడిస్తున్న తరుణంలో గూడులేని నిరుపేదలు, వలస కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని.. 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు ప్రభుత్వం వీరి గురించి ఏమాత్రం ఆలోచించలేదని హెచ్‌ఆర్‌ఎఫ్ ఆరోపించింది. జైళ్లలో ఈ అంటువ్యాధి వ్యాపించకుండా అండర్ ట్రయల్ ఖైదీలు, కొన్ని రకాల శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలను అత్యవసర పెరోల్, ఫర్లోపై విడుదల చేసే విషయంలో తెలుగు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్-19 నేపథ్యంలో జైళ్లలో ఖైదీల సంఖ్య తగ్గించడానికి అండర్ ట్రయల్ ఖైదీలు, ఏడేళ్ల లోపు శిక్షలు అనుభవిస్తున్నవారిని పెరోల్, బెయిలుపై విడుదల చేసే విషయంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేసిన విషయాన్ని మానవ హక్కుల వేదిక గుర్తుచేసింది.

    వలస కార్మికులు

    ఫొటో సోర్స్, Getty Images

  17. తెలంగాణలో కరోనావైరస్ నుంచి కోలుకున్న 11 మంది

    తెలంగాణలో 11 మంది కరోనావైరస్ బాధితులు కోలుకున్నారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గతంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధరణయిన వీరిని ఇప్పుడు నెగటివ్ అని టెస్టుల్లో తేలిందని తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ.. పూర్తి సహకారం అందిస్తామన్న కాంగ్రెస్ ఎంపీ

    కరోనావైరస్‌పై భారత్ చేస్తున్న యుద్ధంలో ప్రభుత్వానికి అండగా ఉంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. లాక్‌డౌన్ వల్ల రోజుకూలీలపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. తన లేఖలో రాహుల్ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. ఏపీలో పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

    ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తీరు, దాని నివారణ కోసం అందుబాటులో ఉన్న వైద్య విధానాలు త‌దిత‌ర అంశాల‌పై తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల‌యంలో మంత్రులు, చీఫ్ సెక్ర‌ట‌రీ, ఆరోగ్య‌శాఖాధికారుల‌తో ముఖ్యమంత్రి స‌మీక్ష‌ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం దుకాణాలు తెరవడం వంటివాటికి పాటిస్తున్న సమయాలను కుదించాలని నిర్ణయించారు. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాలకోసం అనుమతిస్తారు.. మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటవరకూ అనుమతి ఉంటుంది. నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే జైలుకే.. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ప్రదర్శించాలని సూచించారు. అందులోనే ఫిర్యాదు చేయాల్సిన కాల్‌ సెంటర్‌ నంబర్‌ కూడా ఉంటుందని చెప్పారు.

    ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

    ఫొటో సోర్స్, facebook/YS Jagan Mohan Reddy