తొలిసారి విమానం ఎక్కాడు.. ఇంజిన్లోకి లక్కీ కాయిన్లు విసిరాడు.. రూ. 12.33 లక్షలు జరిమానా విధించిన కోర్టు

ఫొటో సోర్స్, Getty Images
తొలిసారి విమానమెక్కిన ఓ చైనా ప్రయాణికుడు చేసిన పని ఆయన్ను భారీ జరిమానా చెల్లించేలా చేసింది.
జీవితంలో మొదటిసారి విమానమెక్కేందుకు వెళ్లిన ఆయన తన ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుకుంటూ 'అదృష్ట నాణేల'(గుడ్లక్ కాయిన్స్)ను విమానం ఇంజిన్లోకి విసిరారు. 2019 ప్రారంభంలో జరిగిన ఈ ఘటనపై విచారణ అనంతరం ఇటీవల ఆయనకు 17,200 డాలర్ల (సుమారు రూ.12.33 లక్షలు) జరిమానా విధించారు.
2019 ఫిబ్రవరిలో తూర్పు చైనాలోని తియాంజుషాన్ విమానాశ్రయంలో లూ చావో అనే 28 ఏళ్ల వ్యక్తి 'లక్కీ ఎయిర్' ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఎక్కేందుకు వెళ్లారు.
అక్కడ ఆయన తన అదృష్ణ నాణేలను విమానం ఇంజిన్ వైపు విసిరారు. ఇంజిన్ సమీపంలో 'ఒక యువాన్' నాణేలు రెండు కనిపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
వెంటనే భద్రతా తనిఖీలు చేశారు.. విమానం రద్దయింది. అందులోని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
లూ చావోను పోలీసులు 10 రోజుల పాటు అదుపులోకి తీసుకుని విచారించారు. జులైలో దీనిపై కోర్టులో విచారణ జరగ్గా లూ చావో తానే నాణేలు విసిరినట్లు అంగీకరించారు.
చావో చేసిన పనివల్ల తమకు 17,600 డాలర్ల నష్టం కలిగిందని లక్కీ ఎయిర్ సంస్థ కోర్టుకు తెలిపింది.
ప్రయాణికులు నాణేలు విసరకూడదని విమానయాన సంస్థ ముందే చెప్పి ఉండాల్సిందని చావో కోర్టులో వాదించారు.
మొత్తానికి ఇద్దరి వాదనలు విన్న కోర్టు చావోకు 17,200 డాలర్ల జరిమానా విధించింది.
ఇదే తొలిసారి కాదు..
చైనాలో విమాన ప్రయాణికులు ఇలా నాణేలు విసరడం ఇదే తొలిసారి కాదు. వివిధ విశ్వాసాలు పాటించే కొందరు ప్రయాణికులు విమానాల ఇంజిన్లపైకి నాణేలు విసిరి పట్టుబడిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి.
ఇటీవల కాలంలో ఇలాంటివి మరింతగా పెరిగాయి.
2017లో ఓ వయోధిక ప్రయాణికుడు ఇలాగే నాణెం విసరడంతో విమాన ప్రయాణం ఆలస్యమైంది.
ఇవికూడా చదవండి:
- ఆసియాలో విమానయానాన్ని ఎవరు శాసిస్తున్నారు?
- హైపర్సోనిక్ ప్యాసింజర్ విమానాన్ని తయారు చేస్తున్న చైనా. ఎందుకు?
- గాలి నుంచి విమాన ఇంధనం తయారీ
- చరిత్ర: యుద్ధ విమానం అనుకుని సాధారణ పౌరులు ప్రయాణిస్తున్న విమానం కూల్చేసిన అమెరికా
- మనీ లాండరింగ్పై పుస్తకం రాసిన ప్రొఫెసర్ అదే కేసులో అరెస్టు
- అమ్మాయిల రక్షణకు పులిపై వచ్చిన 'సూపర్ హీరోయిన్'
- ఐఐటీ మద్రాస్: "ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో మా క్యాంపస్ కంపు కొడుతోంది"
- 144 సెక్షన్ను ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయా?
- ఈ వీడియో చూసేలోపు ఈ విమాన ప్రయాణం పూర్తవుతుంది
- సింగపూర్ టూ అమెరికా... 19 గంటల నాన్స్టాప్ జర్నీ
- మేడ మీదే విమానం తయారీ
- ఏడు దశాబ్దాల కిందట సముద్రంలో అణుబాంబు పేలుడు.. ఇంకా మానని గాయం
- గుజరాత్ పంట పొలాలపై పాకిస్తాన్ మిడతల ‘సర్జికల్ స్ట్రైక్’... 8 వేల హెక్టార్లలో పంట నష్టం
- మ్యాచ్ ఫిక్సింగ్పై వ్యవహారంపై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్.. ‘అవన్నీ బయటపెట్టడం సరికాదు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








