క్రికెట్ వరల్డ్ కప్ 2019: ఇండియాతో మ్యాచ్కు ముందు పాక్ పరిహాసం... భారత పైలట్ మీద వ్యంగ్యంగా టీవీ యాడ్

ఫొటో సోర్స్, PAKISTAN INFORMATION MINISTRY (ISPR)
భారత్ - పాకిస్తాన్ల మధ్య 'ఉద్రిక్తతలు' మళ్లీ తీవ్రమవుతున్నాయి. కాకపోతే, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్కు సంబంధించి.
రెండు దేశాల జట్లు వచ్చే ఆదివారం నాడు అంటే జూన్ 16వ తేదీన క్రికెట్ మైదానంలో తలపడుతున్నాయి. ఈ ప్రపంచ కప్లో క్రికెట్ అభిమానులు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇదే అనటంలో సందేహం లేదు.
అయితే పాకిస్తాన్ ఒక అడ్వర్టైజ్మెంట్తో ఉద్రిక్తతను మరింతగా పెంచింది. గత ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్పపుడు పాకిస్తాన్ నిర్బంధించిన భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్ మీద వ్యంగ్యంగా రూపొందించిన అడ్వర్టైజ్మెంట్ ఇది.
భారత్ ఆధీనంలో ఉన్న కశ్మీర్లో 40 మంది భారత పారమిలటరీ సిబ్బంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు అమాంతం పెరిగిపోయాయి. రెండు దేశాల మధ్య ఇక యుద్ధం మొదలవుతుందా అన్నంతగా పరిస్థితులు వేడెక్కాయి.

ఫొటో సోర్స్, PAKISTAN INFORMATION MINISTRY (ISPR)
ఆ పరిణామాల్లో పాక్ తాను నిర్బంధించిన భారత వాయుసేన పైలట్ను 'శాంతి సూచిక'గా భారత్కు అప్పగించటం.. ఆ సంఘటన తర్వాత అభినందన్ భారత్లో నేషనల్ హీరోగా ప్రజా మన్ననలు అందుకోవటం తెలిసిందే.
అభినందన్ను నిర్బంధించినపుడు పాకిస్తాన్ అధికారుల ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు చిత్రీకరించి వెంటనే వీడియో విడుదల చేయటమూ తెలిసిందే.
ఆ వాస్తవ వీడియోలో.. పాకిస్తాన్ అధికారులు తన స్క్వాడ్రన్, తన మిషన్ గురించి అడిగిన ప్రశ్నలకు.. ''క్షమించండి.. ఆ విషయాలు నేను చెప్పకూడదు'' అని అభినందన్ బదులివ్వటం వినిపిస్తుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆ వీడియోను అనుకరిస్తూ పాకిస్తాన్ టెలివిజన్ రూపొందించిన అడ్వర్టైజ్మెంట్లోని నటుడు.. అభినందన్ తరహాలో గుబురు మీసాలతో, భారత క్రికెట్ జెర్సీ ధరించి కనిపిస్తాడు.
ఈ వీడియోలో తనను అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వటానికి ఆయన నిరాకరిస్తాడు. కానీ ఈ వీడియోలో.. రాబోయే భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ గురించి ప్రశ్నలు అడుగుతారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
'భారత జట్టులో ఎవరెవరు ఉంటారు?' వంటి ప్రశ్నలు అడుగుతారు. ఒక టీ కప్పుతో టీ తాగుతున్న నటుడు అభినందన్ తరహాలో 'క్షమించండి.. ఆ వివరాలు నేను చెప్పకూడదు' అని బదులిస్తాడు.
అనంతరం అతడిని విచారణ నుంచి వెళ్లిపోవచ్చని చెప్తారు. అతడు వెళ్లిపోతుంటే మళ్లీ ఆపి చేతిలో ఉన్ కప్ను ఇచ్చి వెళ్లాలని నిర్దేశిస్తారు. క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
భారత్ - పాకిస్తాన్ల మధ్య ఇటీవల జరిగిన తీవ్ర ఉద్రిక్త సంఘటనను వ్యంగ్యంగా మలచి క్రికెట్కు అన్వయించిన అడ్వర్టైజ్¿మెంట్ ఇది. ఈ యాడ్ భారత్లో చాలా మందికి ఆగ్రహం తెప్పించింది.
ఈ రకంగా యాడ్ తయారుచేసి ప్రసారం చేయటం ''సిగ్గుచేటు'' అని, ''మూర్ఖత్వం'' అని సోషల్ మీడియాలో చాలా మంది మండిపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఈ అడ్వర్టైజ్మెంట్ గేలి చేసినట్లుగా ఉందని చాలా మంది ఖండిస్తే.. కొంతమంది హాస్యభరితంగా ఉందంటూ నవ్వేశారు.
పాకిస్తాన్ మీద గెలవటం ద్వారా భారత జట్టు ఈ అడ్వర్టైజ్మెంట్కు గట్టిగా బదులివ్వాలని కొందరు యూజర్లు పిలుపునిచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్ స్టేడియంలో జరగబోయే భారత్ - పాక్ మ్యాచ్కు ఇరు దేశాల అభిమానులూ పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇరు దేశాల ప్రజల్లో ఉద్వేగ్నిత పెరుగుతోందన్నది స్పష్టం.
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ఈ తరహా అడ్వర్టైజ్ మెంట్లను గర్హిస్తూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
అయితే.. బ్రిటన్లో వర్షాల కారణంగా ఈ వరల్డ్ కప్ పోటీల్లో ఇప్పటికే పలు మ్యాచ్లు రద్దయ్యాయి. అదే తరహాలో భారత్ - పాక్ మ్యాచ్ కూడా రద్దయితే..?
ఇవి కూడా చదవండి:
- ఫోర్బ్స్ టాప్ 100 మంది ధనిక క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
- శృంగారం సాంకేతికాభివృద్ధికి ఎలా దోహదపడింది
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- అమెరికా - ఇరాన్ ఘర్షణ: హోర్ముజ్ జలసంధిలో సంక్షోభం మీ మీద, ప్రపంచం మీద చూపే ప్రభావం ఏమిటి?
- ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నియామకం ఎందుకంత వైరల్ అయింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








