ట్రంప్, కిమ్ భేటీ: చర్చలు విఫలం.. అర్ధంతరంగా ముగిసిన సమావేశం

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్న మధ్య భేటీ ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది.
వియత్నాంలోని హనోయ్లో గురువారం వీరిద్దరి మధ్య జరిగిన సమావేశం ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అర్ధంతరంగా ముగిసింది.
ఇద్దరు నేతలూ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనకుండానే భేటీ జరిగిన హోటల్ నుంచి వెళ్లిపోయారు.
అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఆంక్షలన్నీ ఎత్తివేయాలని ఉత్తరకొరియా కోరిందని.. తాము అలా చేయలేమని, అందుకే ఎలాంటి ఒప్పందం లేకుండానే ఈ చర్చలు ముగిశాయని వెల్లడించారు.

ఉత్తర కొరియాలోని యాంగ్బియాన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేయటానికి కిమ్ సంసిద్ధంగా ఉన్నారని.. దానికి బదులుగా తమ దేశంపై ఆంక్షలన్నిటినీ పూర్తిగా ఎత్తివేయాలని ఆయన కోరారని ట్రంప్ తెలిపారు.
కానీ.. ఉత్తర కొరియాలో రెండో యురేనియం శుద్ధి కర్మాగారం గురించి తాము ప్రస్తావించామని, అమెరికాకు తెలిసిన సమాచారం విని ఉత్తర కొరియా ఆశ్చర్యానికి లోనైందని ఆయన వివరించారు.
అయితే.. అణ్వాయుధాలు, క్షిపణులను పరీక్షించబోమన్న హామీకి కిమ్ కట్టుబడి ఉంటారని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.
కిమ్తో మూడోసారి భేటీకి సంబంధించి ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. కిమ్తో తన సత్సంబంధాలు కొనసాగుతాయని, త్వరలోనే ఆయనతో ఫోన్లో మాట్లాడతానని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
ఇద్దరు నేతల మధ్య హనోయ్లో నిర్మాణాత్మక సమావేశాలు జరిగాయని.. కానీ, కీలక అంశమైన అణు నిరాయుధీకరణపై ఎలాంటి ఒప్పందం జరగలేదని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
భారత్, పాక్ ఘర్షణకు ముగింపు రానుంది: ట్రంప్
భారత్, పాకిస్తాన్ల మధ్య ఘర్షణ ముగియాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హనోయ్లో ట్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ల నుంచి ''కాస్త మంచి వార్త నాకు వచ్చింది'' అన్నారు. అంతకుమించి ఆయనింకేమీ చెప్పలేదు.
ఇవి కూడా చదవండి:
- BREAKING NEWS: కశ్మీర్లో కూలిన భారత యుద్ధవిమానం: ఇద్దరు పైలట్లు మృతి... రెండు భారత విమానాలను కూల్చేశామంటున్న పాకిస్తాన్
- ‘భారత గగనతలంలోకి పాక్ విమానాలు.. వెనక్కి తరిమిన ఇండియన్ ఎయిర్ఫోర్స్’
- కార్గిల్కు ముందు... ఆ తరువాత కశ్మీర్లో భారత్-పాక్ల దాడుల చరిత్ర
- బెజవాడ గోపాల్రెడ్డి.. నుంచి కేసీఆర్ దాకా బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమత్రులు వీరే
- కశ్మీర్ దాడి: పుల్వామా మారణహోమం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- అధ్యక్షుడు ట్రంప్పై కోర్టుకెక్కిన 16 అమెరికా రాష్ట్రాలు
- క్రిస్ గేల్: ప్రపంచకప్ తరువాత రిటైర్మెంట్
- కశ్మీర్: సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి భద్రతా వైఫల్యాలే కారణమా?
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









