#IAF: కార్గిల్కు ముందు... ఆ తరువాత కశ్మీర్లో భారత్-పాక్ల దాడుల చరిత్ర

ఫొటో సోర్స్, Reuters
''బాలాకోట్ సమీపంలోని జైషే మొహమ్మద్ స్థావరంపై మంగళవారం తెల్లవారుజామున వైమానిక దాడులు జరిపాం'' అని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్ గోఖలే మంగళవారం దిల్లీలో మీడియా సమావేశంలో ప్రకటించారు.
భారత దాడులపై స్పందించే హక్కు తమకుందని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాలశాఖ చెప్పింది.
తమ దాడుల్లో జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్ బావ మౌలానా యూసుఫ్ అజర్ (అలియాస్ ఉస్తాద్ ఘోరీ) ఆధ్వర్యంలోని అతిపెద్ద శిక్షణ శిబిరాన్ని ధ్వంసం చేశామని, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని గోఖలే తెలిపారు. మృతుల్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేవారు, సీనియర్ కమాండర్లు, జిహాదీలు ఉన్నారని చెప్పారు.
పర్వతాల మీద ఉన్న ఈ శిబిరంపై సాధారణ పౌరుల ప్రాణాలకు హాని లేకుండా వైమానిక దాడులు జరిపామని గోఖలే తెలిపారు. ఇది సైనిక చర్య కాదని, ఉగ్రవాద నిరోధక దాడి అని చెప్పారు.
ఈ బాలాకోట్ పాకిస్థాన్లోని ఖైబర్-పఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఉందని విశ్వసనీయమైన అధికార వర్గాలు బీబీసీకి తెలిపాయి. దీనిపై అధికారికంగా పూర్తి సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ విషయంలో ఎప్పుడేం జరిగింది?
అయితే, భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. స్వాతంత్య్రం వచ్చిన రెండు నెలల నుంచే ఇరుదేశాల మధ్య కశ్మీర్ విషయంలో ఎడతెగని వివాదం నడుస్తోంది.
అక్టోబర్ 1947: భారత్, పాకిస్తాన్లు విడిపోయిన రెండు నెలల్లోనే ఈ రెండు దేశాల మధ్య కశ్మీర్ కోసం మొదటి యుద్ధం జరిగింది.
ఆగస్టు 1965: కశ్మీర్పై మరోసారి ఈ రెండుదేశాలూ యుద్ధానికి దిగాయి.
డిసెంబరు 1971: తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఇస్లామాబాద్ పరిపాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజల పోరాటానికి మద్దతునిచ్చి, స్వతంత్ర దేశంగా ఏర్పడేందుకు భారత్ సహకరించింది. పాకిస్తాన్ భూభాగంలో భారత వాయుసేన వైమానిక దాడులు నిర్వహించింది. బంగ్లాదేశ్ ఏర్పాటుతో ఈ యుద్ధం ముగిసింది.
1989: కశ్మీర్ లోయలో భారత పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరు మొదలైంది.
ఫిబ్రవరి 1999: భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాకిస్తాన్తో శాంతి ఒప్పందం చేసుకునేందుకు లాహార్కు బస్సుయాత్ర చేసి, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో సమావేశయ్యారు.
మే 1999: కార్గిల్ పర్వతప్రాంతంలో భారత సైనిక శిబిరాలను పాకిస్తాన్ సైనికులు, మిలిటెంట్లు ఆక్రమించారు. దీంతో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా భారత్ వైమానిక, భూతల దాడులకు దిగి, ఆక్రమణలను తిప్పికొట్టింది.
మే 2001: భారత ప్రధాని వాజ్పేయి, పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆగ్రాలో సమావేశమైనా ఎలాంటి ఒప్పందం జరగకుండానే ఆ సమావేశం ముగిసింది.
అక్టోబర్ 2001: శ్రీనగర్లోని కశ్మీర్ అసెంబ్లీపై జరిగిన దాడిలో 38మంది చనిపోయారు.
డిసెంబరు 13, 2001: భారత పార్లమెంటుపై జరిగిన దాడిలో 14మంది చనిపోయారు.
ఫిబ్రవరి 2007: పాకిస్తాన్, భారత్ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ప్రెస్ రైలుపై జరిగిన బాంబు దాడిలో 68 మంది మరణించారు.
జనవరి 26, 2008: ముంబయి రైల్వే స్టేషన్, హోటల్, ఓ యూదు సాంస్కృతిక కేంద్రంపై 60 గంటలపాటు జరిగిన మిలిటెంట్ దాడిలో 166 మంది చనిపోయారు. ఈ దాడికి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తాయిబానే కారణమని భారత్ ఆరోపించింది.
జనవరి 2016: పఠాన్కోట్లోని భారత వాయుసేన శిబిరంపై జరిగిన దాడిలో ఏడుగురు సైనికులు మరణించగా ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు.
సెప్టెంబర్ 18, 2016: కశ్మీర్లోని ఉరీ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడిలో 19 మంది సైనికులు మరణించారు.
సెప్టెంబర్ 30, 2016: పాక్ పాలిత కశ్మీర్లోని మిలిటెంట్ శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించినట్లు భారత్ ప్రకటించింది. అయితే దీన్ని ఇస్లామాబాద్ తోసిపుచ్చింది.
ఫిబ్రవరి 14, 2019: కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన మిలిటెంట్ ఆత్మాహుతిదాడిలో 40కి పైగా జవాన్లు మరణించారు. ఈ దాడి తమ పనేనని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ సంస్థ ప్రకటించింది.
ఫిబ్రవరి 26, 2019: పాకిస్తాన్లోని కశ్మీరీ మిలిటెంట్ శిబిరాలపై వైమానిక దాడులు చేసినట్లు, శిబిరాలను ధ్వంసం చేసినట్లు భారత్ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి.
- #Balakot: ‘‘అతిపెద్ద జైషే శిబిరాన్ని ధ్వంసం చేశాం’’ - భారత విదేశాంగశాఖ కార్యదర్శి
- #Balakot: ‘చెంప దెబ్బ కొడితే, మేం మరో చెంప చూపించే రోజులు పోయాయి’
- భారత్ దాడులకు బదులిచ్చే హక్కు మాకు ఉంది: పాకిస్తాన్
- భారత వైమానిక దాడులపై పాకిస్తాన్లో ప్రత్యక్ష సాక్షి ఏం చెబుతున్నారంటే.. BBC Exclusive
- భారత్ మిరాజ్ యుద్ధ విమానాలనే ఎందుకు ఉపయోగించింది... బాలాకోట్ ఎక్కడుంది...
- కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








