సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్ కంప్యూటర్లే కాకుండా మరికొందరి కంప్యూటర్లూ హ్యాక్ అయ్యాయా?

ఫొటో సోర్స్, Arsenal report
భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారన్న ఆరోపణలతో అరెస్టయిన యాక్టివిస్ట్లు సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్ల కంప్యూటర్లను కొందరు హ్యాక్ చేసి వాటిలో తప్పుడు ఆధారాలు చొప్పించినట్లు అమెరికా ఫోరెన్సిక్ ఏజెన్సీ ఒకటి వెల్లడించిందని ఇటీవల 'వాషింగ్టన్ పోస్ట్' కథనం రాసింది.
గాడ్లింగ్ అరెస్ట్ కావడానికి రెండేళ్ల ముందే ఆయన కంప్యూటర్ను ఈమెయిళ్ల ద్వారా హ్యాక్ చేశారని.. ఆ మెయిల్స్ స్టాన్ స్వామి, ఇతర యాక్టివిస్టులకు కూడా కాపీ చేసి ఉన్నాయని, వారి కంప్యూటర్లూ హ్యాక్ అయి ఉండొచ్చని ఆ నివేదిక అనుమానించింది.
సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్ల న్యాయవాదుల వినతి మేరకు వారిద్దరి కంప్యూటర్లలోని ఎలక్ట్రానిక్ కాపీలు, వారి ఈమెయిల్ అకౌంట్లను మషాచూసెట్స్ కేంద్రంగా పనిచేసే డిజిటల్ ఫోరెన్సిక్ ఫర్మ్ 'ఆర్సెనల్ కన్సల్టింగ్' పరిశీలించింది.

ఫొటో సోర్స్, Getty Images
గుర్తు తెలియని హ్యాకర్ హానికరమైన సాఫ్ట్వేర్ ఉపయోగించి గాడ్లింగ్, విల్సన్ల కంప్యూటర్లలో చొరబడి హిడెన్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి అందులో డజన్ల కొద్దీ డాక్యుమెంట్లను సేవ్ చేసినట్లు ఆర్సెనల్ కన్సల్టింగ్ తెలిపింది.
ఆ తరువాత దర్యాప్తు సంస్థలు ఆ డాక్యుమెంట్లనే ఆధారంగా చేసుకుని ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు మావోయిస్టు పార్టీతో కలిసి కుట్ర పన్నారంటూ వారిని అరెస్ట్ చేశాయి.
గాడ్లింగ్, విల్సన్లవే కాకుండా ఇతరుల కంప్యూటర్లపైనా కూడా ఇదే హ్యాకర్ సైబర్ దాడి చేసి ఉండొచ్చని ఆర్సెనల్ తన నివేదికలో చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కాగా ఆర్సెనల్ కన్సల్టెన్సీ రీసెర్చర్ జువాన్ ఆండ్రెస్ గెరెరోను ఉటంకిస్తూ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సేవల సంస్థ 'సెంటినల్ వన్' ఓ ట్వీట్ చేసింది.
ఆర్సెనల్ పరిశీలించిన రెండు కంప్యూటర్లే కాకుండా మరెన్నో అలా హ్యాక్ అయి ఉండొచ్చని సెంటినల్ వన్ తన ట్వీట్లో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- తంత్ర యోగా పేరుతో అత్యాచారాలు, శివానంద సెంటర్ గుట్టు బయటపెట్టిన బీబీసీ
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








