చైనా యాప్లు: అలీబాబా యాప్లు సహా మరో 43 యాప్లపై భారత ప్రభుత్వం వేటు- Newsreel

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో తాజాగా 43 యాప్లు బ్లాక్ చేస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. వీటిని ఐటీ యాక్ట్ 69A కింద బ్లాక్ చేస్తున్నామని తెలిపింది.
భారత దేశ సమగ్రత, సౌర్వభౌమాధికారానికి, భారత రక్షణకు విరుద్ధంగా ఈ యాప్స్ కార్యకాలాపాలు నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారాన్ని బట్టి తాము ఈ చర్యలు తీసుకున్నామని ఐటీ శాఖ ఆదేశాలలో చెప్పింది.
భారత సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్, భారత హోంశాఖ నుంచి అందిన సమగ్ర నివేదికల ఆధారంగా భారత యూజర్లకు ఈ యాప్స్ యాక్సెస్ బ్లాక్ చేయాలని ఐటీ శాఖ భావించంది.
భారత ప్రభుత్వం ఇంతకు ముందు ఇదే చట్టం కింద 2020 జూన్ 29న 59 మొబైల్ యాప్స్, సెప్టంబర్ 2న మరో 118 యాప్స్ యాక్సెస్ బ్లాక్ చేసింది.
ప్రజల ప్రయోజనాలు, దేశ సౌర్వభౌమాధికారం, సమగ్రతను కాపాడ్డానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానికోసం అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని ప్రభుత్వం చెప్పింది.
దేశంలో తాజాగా బ్లాక్ చేసిన యాప్స్ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో ఎక్కువగా డేటింగ్ యాప్లు ఉన్నాయి. వాటితోపాటూ చైనాకు ఈ-కామర్స్ సంస్థ అలీబాబాకు చెందిన యాప్లను కూడా ప్రభుత్వం బ్లాక్ చేసింది.

తేజస్ ఎక్స్ప్రెస్: దేశంలో తొలి ప్రైవేట్ రైళ్లు నిరవధికంగా రద్దు

ఫొటో సోర్స్, POONAM KAUSHAL/BBC
భారత్లో తొలి కార్పొరేట్ రైలు సేవలుగా మొదలైన తేజస్ ఎక్స్ప్రెస్లకు బ్రేకులు పడ్డాయి.
దిల్లీ-లఖ్నవూ, ముంబయి-అహ్మదాబాద్ల మధ్య నడుస్తున్న ఈ రైళ్లను నిరవధికంగా రద్దు చేస్తున్నట్లు వీటిని నిర్వహిస్తున్న ఐఆర్సీటీసీ సంస్థ ప్రకటించింది. ఈ రైలు సేవలను తిరిగి ఎప్పుడు మొదలుపెట్టేది మళ్లీ ప్రకటిస్తామని పేర్కొంది.
కరోనా సంక్షోభం కారణంగా ప్రయాణికులు పెద్దగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఆర్సీటీసీ అధికార ప్రతినిధి సిద్ధార్థ్ సింగ్ చెప్పారు.
రైళ్ల ఆక్యుపెన్సీ దిల్లీ-లఖ్నవూ మార్గంలో 25 శాతం, ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో 35 శాతం మించడం లేదని ఆయన బీబీసీకి తెలిపారు.
2019 అక్టోబర్లో దిల్లీ-లఖ్నవూ మధ్య తొలి తేజస్ రైలు మొదలైంది. రెండో రైలును ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు.

ఫొటో సోర్స్, POONAM KAUSHAL/BBC
అయితే, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లోకి రాకముందే, మార్చి 19న ఈ రైళ్ల సేవలు రద్దయ్యాయి. దీపావళి పండుగ నేపథ్యంలో అక్టోబర్ 17నే ఇవి మళ్లీ మొదలయ్యాయి.
తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఐఆర్సీటీసీ చేసిన ఒక ప్రయోగం.
భారతీయ రైల్వేస్ నుంచి వీటిని ఐఆర్సీటీసీ లీజుకు తీసుకుని నడుపుతోంది. ఐఆర్సీటీసీ అధికారులు వీటిని ప్రైవేటుకు బదులు కార్పొరేట్ రైళ్లు అంటారు. విమానాల్లో లాగానే ఈ రైళ్లలో కూడా హోస్టెస్లను నియమించారు.
ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలో మరో 50 ప్రధాన మార్గాల్లో ఇలాంటి రైళ్లను తీసుకురావాలని ప్రణాళికలు వేశారు.
ఇవి కూడా చదవండి:
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్ఫ్లిక్స్పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- చాందసవాద ఇస్లాంను మార్చేందుకు ఫ్రాన్స్ ఏం చేస్తోంది?
- గంగా నదిలోకి ఘరియల్ మొసళ్లను వదులుతున్నారు.. ఎందుకంటే...
- "నేనొక అబ్బాయిని... పదహారేళ్ల వయసులో నాకు రుతుస్రావం మొదలయింది"
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- వై.ఎస్.జగన్కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








