కరోనావైరస్: ఆయన మరణించారు.. బంధువుల్లో 19 మందికి సోకింది.. ఇంకా 40 వేల మందికి సోకిందేమోనన్న టెన్షన్

పంజాబ్‌

ఫొటో సోర్స్, Getty Images

పంజాబ్‌లోని 20 గ్రామాలకు చెందిన మొత్తం జనాభా 40 వేల మందిని అక్కడి ప్రభుత్వం క్వారంటీన్‌‌లో పెట్టింది.

బల్‌దేవ్ సింగ్ అనే 70 ఏళ్ల వ్యక్తి కరోనావైరస్ సోకి మరణించినట్లు తెలియడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఆ వ్యక్తి మరణించిన తర్వాతే ఆయనకు కరోనావైరస్ సోకిన సంగతి తెలిసింది.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

ఇటలీ నుంచి జర్మనీ మీదుగా..

మత బోధకుడైన బల్‌దేవ్ సింగ్ ఇటలీ, జర్మనీల్లో పర్యటించి పంజాబ్‌కు తిరిగివచ్చారని.. స్వీయ నిర్బంధంలో ఉండాలన్న ప్రభుత్వ సూచనను పక్కనపెట్టి బయట తిరిగారని అధికారులు బీబీసీతో చెప్పారు.

ఇప్పటివరకూ దేశంలో వెయ్యికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, అందులో 38 కేసులు పంజాబ్‌లో నమోదయ్యాయి.

మిగతా దేశాలతో పోలిస్తే, భారత్‌లో రోజూ చాలా తక్కువ స్థాయిలో రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. అందుకే దేశంలో బయటపడని కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరీక్షల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

బల్‌దేవ్ సింగ్ మరణించడానికి కొంత సమయం ముందే హోలా మహల్లా అనే సిక్కుల ఉత్సవంలో పాల్గొన్నారు.

ఆరు రోజులపాటు సాగే ఈ ఉత్సవానికి రోజూ పది వేల మంది దాకా హాజరవుతుంటారు.

బల్‌దేవ్ సింగ్ మరణించిన వారం రోజుల తర్వాత ఆయన బంధువుల్లో 19 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

''ఇప్పటివరకూ ఆయనను నేరుగా కలిసిన 550 మందిని మేం గుర్తించాం. ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఆయన ఉన్న ప్రాంతం చుట్టూ ఉన్న 15 గ్రామాలను పూర్తిగా మూసివేశాం'' అని ఓ సీనియర్ అధికారి బీబీసీతో చెప్పారు.

పక్క జిల్లాలో ఉండే మరో ఐదు గ్రామాలనూ అధికారులు మూసేశారు.

దేశంలో ఇంత భారీ స్థాయిలో జనాలకు క్వారంటీన్ విధించడం ఇదే తొలిసారి కాదు.

రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో ఓ రోగి ద్వారా వైద్యుల బృందానికి కరోనావైరస్ సోకింది. వారి ద్వారా వందల మందికి అది వ్యాపించి ఉండొచ్చన్న అనుమానంతో బిల్వారా చుట్టుపక్కల గ్రామాల్లోని ఏడు వేల మందిని గృహ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)