#LIVE: ఇస్రో వందో ప్రయోగం విజయవంతం

ఫొటో సోర్స్, AFP
స్వదేశీ ఉపగ్రహాల ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సెంచరీ కొట్టింది. 31 ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ సీ40 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
9.59AM: దేశానికి ఇస్రో ఇచ్చిన న్యూ ఇయర్ గిఫ్ట్ ఇది - ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్
9.58AM: కక్ష్యలోకి చేరిన 31 ఉపగ్రహాలు
9.58AM: పీఎస్ఎల్వీ సీ40 ప్రయోగం విజయవంతం
కార్టోశాట్లో ఎన్నో ప్రత్యేకతలు!
కార్టోశాట్ భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. కానీ భూమిపై దేనినైనా అత్యంత స్పష్టంగా నాణ్యమైన ఫొటోలు తీస్తుంది.
సుమారు అర మీటర్ విస్తీర్ణంలో ఉన్న వస్తువులను కూడా ఇది క్లియర్గా ఫోటోలు తీస్తుంది.
ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో అవసరమైన టార్గెట్ను మాత్రమే ఫొటోలు తీసే సదుపాయం కూడా ఇందులో ఉంది.
9.52am కక్ష్యలోకి చేరిన నానో, మైక్రో ఉపగ్రహాలు
- మైక్రో శాటిలైట్ను ఇస్రో తయారు చేసింది.
- ఇది సుమారు వంద కిలోల బరువు ఉంటుంది.
- ఐఎంఎస్-1 ఉపగ్రహాన్ని పోలి ఉంటుంది.
నానో శాటిలైట్-1సీ విశేషాలు
ఇస్రో ప్రయోగించిన 31 ఉపగ్రహాల్లో ఇదొకటి.
- భారత్కు చెందిన నానో శాటిలైట్ సిరీస్-ఐఎన్ఎస్లో ఇది మూడోది.
- 11కిలోల బరువు ఉంటుంది. దీని కాల పరిమితి ఆరు నెలలు.
- మినియేచర్ మల్టీ స్పెక్ట్రల్ టెక్నాలజీ డెమానుట్రేషన్-ఎంఎంఎక్స్-టీడీ సాంకేతికతను ఉపయోగిస్తుంది.
- ఐఎన్ఎస్-1సీ తీసిన ఫొటోల ఆధారంగా స్థలాకృతికి సంబంధించిన మ్యాప్లు తయారు చేస్తారు.
9.47am రాకెట్ నుంచి విడిపోతున్న మిగతా ఉపగ్రహాలు
9.46am కక్ష్యలోకి చేరిన కార్టోశాట్
కార్టోశాట్-2ఈఆర్ బరువు 710 కేజీలు. దీని కాలపరిమితి ఐదేళ్లు.
కార్టోశాట్-2ఈఆర్ పంపించే ఫొటోల ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంత భూముల లెక్కలను పక్కాగా గుర్తించొచ్చు.
కార్టోశాట్-2ఈఆర్ పంపించే ఫొటోల ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంత భూముల లెక్కలను పక్కాగా గుర్తించొచ్చు.
తీరప్రాంత భూములను గుర్తించడంతో పాటు వాటి వినియోగాన్ని లెక్క కట్టొచ్చు.
నీటి పంపిణీ వ్యవస్థ, రోడ్ నెట్వర్క్ పరిశీలన, నావిగేషన్ అప్లికేషన్లకు కూడా కార్టోశాట్ పంపించే ఫొటోలు ఎంతో ఉపయోగపడతాయి.
భూ వాతావరణంలో మార్పులను గుర్తించడానికి ఇది సహాయం చేస్తుంది.
9.43am సవ్యంగా సాగుతున్న రాకెట్ ప్రయోగం నాలుగో దశ
ఈ ప్రయోగంతో మూడు దేశీయ, 28 విదేశీ ఉపగ్రహాలు నింగిలోకి
9.38am సవ్యంగా సాగుతున్న నాలుగవ దశ
9.36am నాలుగో దశ ప్రారంభం
9.35am రాకెట్ ప్రయోగంలో మూడో దశ విజయవంతం
9.34am మరికొద్ది నిమిషాల్లో కక్షలోకి ఉపగ్రహాలు
9.33am కొనసాగుతున్న ఉపగ్రహ ప్రయోగం
9.32am రెండోదశ విజయవంతం
పీఎస్ఎల్వీ నుంచి విడిపోయిన హీట్ షీట్
9.30am మొదది దశ విజయవంతం
9.28am నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 40 రాకెట్

ఫొటో సోర్స్, Facebook/Isro
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి వందో శాటిలైట్ను ప్రయోగించింది.
పీఎస్ఎల్వీ సీ-40 రాకెట్ ద్వారా స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్-2ఈఆర్తో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి రోదసిలోకి పంపించారు.
కార్టోశాట్తో పాటు మరో 30 ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెడతారు.
ఇందులో మైక్రోశాటిలైట్, నానోశాటిలైట్ భారత్కు చెందినవి కాగా.. మిగిలిన 28 ఇతర దేశాలకు సంబంధించినవి.
ఒక్క ప్రయోగం.. 31 ఉపగ్రహాలు!
పీఎస్ఎల్వీ సీ-40 రాకెట్ మొత్తం 31 ఉపగ్రహాలను మోసుకెళ్తోంది. ఇందులో భారత్కు చెందిన కార్టోశాట్-2ఈఆర్ ప్రధానమైంది.
గతంలో ప్రయోగించిన 6 కార్టోశాట్ ఉపగ్రహాల మాదిరిగానే కార్టోశాట్-2ఈఆర్ కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్.
భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులో భూకేంద్ర కక్షలో ఈ శాటిలైట్ను ప్రవేశపెడతారు. వెంటనే ఇది తన పని ప్రారంభిస్తుంది.
ఇవికూడా చదవండి:
- ‘పాకిస్తాన్ ఆందోళన’కు కారణమైన ఇస్రో 100వ స్వదేశీ శాటిలైట్ విశేషాలివే
- శ్రీహరి కోటలో ‘రాకెట్’ రహస్యం.. ఆరు ఛార్టుల్లో
- ఇక పైవాడు జూమ్ చేసి చూస్తాడు!
- దేశ చరిత్రలో తొలిసారి సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ప్రెస్ మీట్
- #LIVE: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రెస్మీట్లో ఏం చెప్పారంటే..
- సైన్స్లో చరిత్ర సృష్టించిన ఏడుగురు మహిళా శాస్త్రవేత్తలు
- ‘రామసేతు’పై మళ్లీ వివాదం!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









