కోవిడ్తో యూరప్లో మరో 7 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ -Newsreel

ఫొటో సోర్స్, Reuters
కరోనా వల్ల యూరప్లో వచ్చే మార్చి నాటికి మరో 7 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
యూరప్లోని 53 దేశాల్లో కోవిడ్ మరణాల సంఖ్య ఇప్పటికే 15 లక్షలు దాటింది.
2022 మార్చి నాటికి 49 దేశాల్లోని ఆస్పత్రుల్లో ఐసీయూ యూనిట్లపై తీవ్ర ఒత్తిడి పడవచ్చని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది.
యూరప్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆస్ట్రియా మళ్లీ లాక్డౌన్ అమలు చేసింది. మరికొన్ని దేశాలు కూడా కరోనా కట్టడి చర్యలకు సిద్ధమవుతున్నాయి.
ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్ సహా కొన్ని దేశాలు తమ పౌరులకు పూర్తి వ్యాక్సినేషన్ అయినట్లు పరిగణించడానికి బూస్టర్ డోస్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేసే ఆలోచనలో ఉన్నాయి.
కానీ, చాలా దేశాల్లో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం అవుతున్నాయి. నెదర్లాండ్స్లో పాక్షిక లాక్డౌన్కు వ్యతిరేకంగా జనం ఆందోళనలు చేస్తున్నారు.
యూరప్ ప్రాంతంలో ఎక్కువ మరణాలకు కోవిడ్ కారణం అని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది.
ప్రస్తుతం నమోదవుతున్న కేసులను బట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం కరోనా మరణాల సంఖ్య 22 లక్షలు దాటవచ్చని డబ్ల్యుహెచ్ఓ మంగళవారం చెప్పింది.
కోవిడ్ వల్ల రోజువారీ సంభవించే మరణాల సంఖ్య ఇటీవల దాదాపు రెట్టింపు అయినట్లు ధ్రువీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక్క రష్యాలోనే రోజువారీ మరణాల సంఖ్య ఇటీవల 1200 దాటిందని తెలిపింది.
టీకా వేసుకోని వారు ఇంకా అధిక సంఖ్యలో ఉండడం, కొన్ని దేశాల్లో డెల్టా వేరియంట్ వ్యాపిస్తుడడమే యూరప్లో అత్యధిక సంక్రమణ రేటుకు ప్రధాన కారణం అని డబ్ల్యుహెచ్ఓ చెప్పింది.
ఇంకా టీకా వేసుకోని వారు త్వరగా కరోనా వ్యాక్సీన్ వేసుకోవాలని డబ్ల్యుహెచ్ఓ యూరప్ డైరెక్టర్ డాక్టర్ హాన్స్ క్లూగే కోరారు.
"అనవసర విషాదం, ప్రాణనష్టాన్ని నివారించడానికి సాయం చేసే అవకాశం, ఆ బాధ్యత మనందరి మీదా ఉంది. ఈ శీతాకాలంలో సమాజానికి, వ్యాపారాలకు మరింత నష్టం జరగకుండా దానిని పరిమితం చేద్దాం" అని ఆయన పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
- ఒత్తిడి తట్టుకోవడానికి గంజాయిని ఆశ్రయిస్తున్న అమ్మలు, ఇది ఆరోగ్యానికి ప్రమాదం కాదా
- ఘాతక్ డ్రోన్ : పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే ముప్పును ఇది తప్పిస్తుందా
- ‘‘మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు ఓ పెద్ద ఎత్తుగడ.. ఇదీ తెరవెనుక కథ’’
- చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
- సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
- ‘ఆన్లైన్ చదువులకు లక్షల్లో ఫీజులు కట్టాం... ఏమీ అర్థం కాలేదని చెబితే ఏమంటారో’
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్స్టర్' ఎలా అయ్యాడు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












