చైనాలో వరదలు: 25 మంది మృతి, లక్ష మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ఫొటో సోర్స్, Getty Images
మధ్య చైనాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో భారీ వరదలు సంభవించాయి. దీంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. రైల్వే స్టేషన్లు, రహదారులు నీట మునిగాయి.
ప్రజలు నీళ్లలో నడుస్తూ వరదల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి పోతున్నట్లు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోలలో కనిపిస్తోందని రాయిటర్స్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Reuters
రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి హెనన్ ప్రావిన్సులోని లక్ష మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వర్షానికి జెంగ్జౌ నగరంలో వచ్చిన వరదల వల్ల ఇప్పటి వరకూ 25 మంది చనిపోయినట్లు రాయిటర్స్ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ వరదల ప్రభావం 12 ప్రధాన నగరాలపై పడింది. రహదారులను మూసేశారు. విమాన సర్వీసులూ రద్దయ్యాయి.
9.4 కోట్ల జనాభా ఉన్న హెనన్ ప్రావిన్సులో ప్రభుత్వం అత్యంత ప్రమాదకర వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది.

ఫొటో సోర్స్, Reuters
వరదలకు చాలా రకాల కారణాలు ఉన్నాయి. కానీ, భూమి వేడెక్కడం లాంటి వాతావరణ మార్పుల వల్ల కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ.
నీట మునిగిన రోడ్లు, వేగంగా ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోతున్న కార్లు, చెత్తకి సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో కనిపించాయి.
హెనన్ ప్రావిన్సులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఓ డ్యామ్ కుప్పకూలుతుందనే భయాందోళనలూ నెలకొన్నాయి.
ల్యూయాంగ్ నగరంలోని డ్యామ్ దాదాపు 20 మీటర్ల మేర దెబ్బతినింది. ఈ ప్రాంతంలో సైన్యాన్ని మోహరించారు. ఆ డ్యామ్ ఎప్పుడైనా కూలిపోవచ్చని ఆర్మీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
జెంగ్జౌ నగరంలోని సబ్ వే రైలు బోగీలో చిక్కుకున్న ప్రయాణికుల భుజాల వరకూ నీరు ప్రవహిస్తున్నట్లు ఓ వీడియోలో కనిపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ వీడియోని బీబీసీ ధ్రువీకరించడం లేదు. రైల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది తాళ్ల సాయంతో రక్షిస్తున్నారు. నీటి నుంచి తమని తాము రక్షించుకునేందుకు కొందరు సీట్లపై నిలుచున్నారు.
ఎంతమంది ఇంకా రైల్లోనే చిక్కుకుని ఉన్నారన్న విషయం తెలియాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకూ వందల మందిని రక్షించినట్లు రిపోర్టులు వస్తున్నాయి.
వరద నీటిలో చిక్కుకున్న జియోపీ అనే వ్యక్తి సోషల్ మీడియా యాప్ వీబియోలో సాయం కోసం అభ్యర్థించాడు.
'రైలు బోగీలో నీరు నా ఛాతీ వరకూ చేరింది. నేను ఇక మాట్లాడలేను' అన్నాడు. జియోపీని రక్షించామని కొద్దిసేపటి తర్వాత ఫైర్ డిపార్టుమెంటు తెలిపింది.
'నా జీవితాంతం జెంగ్జౌలోనే గడిపాను. ఈరోజు కురుస్తున్నంత భారీ వర్షాన్ని ఎప్పుడూ చూడలేదు' అని 56 ఏళ్ల వాంగ్ గిరాంగ్ అనే రెస్టారెంట్ మేనేజర్ అసోసియేటెడ్ ప్రెస్తో చెప్పారు.
గత మూడు రోజులుగా జెంగ్జౌలో కురిసిన వర్షం, ఆ ప్రాంతంలో కురిసే సంవత్సర వర్షపాతానికి సమానం. వచ్చే 24 గంటల్లోనూ భారీ వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- గోల్డ్ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- తెలంగాణ: కరోనా లాక్డౌన్లో పెరిగిన బాల్య వివాహాలు
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








