Delhi Bomb blast: తొమ్మిదేళ్ల కిందట ఇజ్రాయెల్ దౌత్యాధికారులపై దాడి.. ఇప్పుడు రాయబార కార్యాలయం వద్ద పేలుడు

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలో చోటుచేసుకున్న పేలుడు కలకలం రేపింది.
ఈ పేలుడు వల్ల ఎవరికీ గాయాలేమీ కాలేదని, పేలుడు తీవ్రత తక్కువేనని దిల్లీ పోలీసులు వెల్లడించారు.
పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రాయబార కార్యాలయానికి 150 మీటర్ల దూరంలోనే..
ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి 150 మీటర్ల దూరంలోనే ఈ పేలుడు జరిగింది.
పేలుడు కారణంగా అక్కడున్న కొన్ని కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
తమ ఎంబసీకి ఎలాంటి నష్టం జరగలేదని ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రి ప్రకటించారని ఏఎఫ్పీ వార్తా ఏజెన్సీ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మరోవైపు దీన్ని ఇజ్రాయెల్ ఉగ్రవాద దాడిగా భావిస్తోందని ఆ దేశ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలకు 29 ఏళ్లు పూర్తయిన రోజు..
ఇజ్రాయెల్, భారత్ మధ్య దౌత్య సంబంధాలకు 29 ఏళ్లు పూర్తయిన రోజునే ఈ పేలుడు జరిగింది. మరోవైపు శుక్రవారం దిల్లీలో గణతంత్ర వేడుకల ముగింపు కార్యక్రమంగా బీటింగ్ రీట్రీట్ కూడా నిర్వహించారు.
బీటింగ్ రీట్రీట్ జరిగిన విజయ్ చౌక్ కూడా పేలుడు జరిగిన ప్రాంతానికి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

తొమ్మిదేళ్ల కిందట ఇజ్రాయెల్ దౌత్యాధికారులపై దాడి..
ఇజ్రాయెల్ దౌత్యాధికారులను లక్ష్యంగా చేసుకుని 2012 ఫిబ్రవరిలో దిల్లీలో బాంబు దాడి జరిగింది.
ఇజ్రాయెల్ దౌత్యాధికారులు ప్రయాణిస్తున్న కారుపై అప్పట్లో దాడి జరిగింది.
ఇరాన్ ఈ దాడికి కారణమని ఇజ్రాయెల్ అప్పట్లో ఆరోపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
దిల్లీ పోలీసులతో మాట్లాడిన అమిత్ షా
తాజా పేలుడు నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీనియర్ దిల్లీ పోలీసు అధికారులతో మాట్లాడినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
పరిస్థితులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
రాయబార కార్యాలయాలకు గట్టి భద్రత: జయశంకర్
ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రి గాబీ అష్కెనాజీతో తాజా పరిణామాలపై మాట్లాడానని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తెలిపారు.
ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి, ఆ దేశ దౌత్యాధికారులకు పూర్తి భద్రత కొనసాగుతుందని మంత్రి చెప్పారు.
పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామని.. దోషులెవరైనా ఉపేక్షించేది లేదని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కూడా భారత విదేశీవ్యవహారాల మంత్రితో మాట్లాడినట్లు ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- 'కరోనావైరస్ తొలి వ్యాక్సీన్ మేం తయారు చేశాం... నా బిడ్డకు కూడా టీకా ఇచ్చాం' - రష్యా అధ్యక్షుడు పుతిన్
- ‘‘దేశ ప్రజలకు ప్రత్యక్ష నగదు సహాయం చేయాలి’’: మన్మోహన్ మూడు సలహాలు
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- శ్రీరాముడిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అసోం ప్రొఫెసర్పై కేసు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- ’గాంధీ కళ్లద్దాల విలువ చెప్పినప్పుడు.. వాటి యజమానికి గుండె ఆగినంత పనైంది’
- కమలం: డ్రాగన్ ఫ్రూట్ గురించి మీకు ఎంత తెలుసు? భారతదేశంలో ఇది ఎక్కడెక్కడ పండుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








