దిల్లీ అల్లర్ల కేసు: సీతారాం ఏచూరి పేరు అనుబంధ చార్జిషీట్లో చేర్చిన పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు తాజాగా సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, ఆర్థికవేత్త జయతి ఘోష్, దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్, డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాత రాహుల్ రాయ్లపై అభియోగాలు నమోదు చేశారని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తాజాగా నమోదు చేసిన అనుబంధ చార్జిషీట్లో వారు ఈ మేరకు వీరందరినీ దిల్లీ అల్లర్లలో సహ కుట్రదారులుగా పేర్కొన్నారని పీటీఐ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పీటీఐ మొదట చేసిన ట్వీట్లో స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్ పేరు కూడా ఉందని చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అయితే, తన పేరు సహ కుట్రదారుగా దిల్లీ పోలీసులు పేర్కొనలేదని యోగేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు.
అనుబంధ చార్జిషీట్లో ఒక చోట తన పేరు ఉంది కానీ సహ కుట్రదారుగా లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
‘‘దిల్లీ పోలీసులు.. బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్నారు. వీరి అక్రమ పనులన్నీ.. బీజేపీ అధినాయకత్వ చరిత్రకు అద్దంపడుతున్నాయి. విపక్షాలు సంధించే ప్రశ్నలు, శాంతి ప్రదర్శనలకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మమ్మల్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు’’ అంటూ సీతారాం ఏచూరి దీనిపై స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
అనుబంధ చార్జిషీట్లో తన పేరు పెట్టిన తరువాత సీతారాం ఏచూరి వరుస ట్వీట్లతో మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
విపక్షాలను లక్ష్యంగా చేసుకోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్య వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని ఆయన ఆరోపించారు.
పాలక బీజేపీ చట్టవిరుద్ధంగా చేస్తున్న బెదిరింపులు పౌరసత్వ సవరణ చట్టం వంటి వివక్షాపూరిత చట్టాలను వ్యతిరేకించకుండా ప్రజలను ఏమాత్రం ఆపలేవని ఆయన అన్నారు.
''దిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Pti
బీజేపీ అగ్రనాయకత్వం చేసే రాజకీయాల ప్రత్యక్ష ఫలితమే దిల్లీ పోలీసుల చట్టవిరుద్ధ, అక్రమ చర్యలు అని ఆయన ఆరోపించారు.
వారు ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు చేపట్టే శాంతియుత నిరసనలకు వారు భయపడుతున్నారు. ప్రతిపక్షాలను లక్ష్యం చేసుకోవడానికి రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
అయితే, అనుబంధ చార్జిషీట్లో తన పేరు లేదని.. పీటీఐ చేసిన ట్వీట్ తప్పు అని యోగేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు.
తన పేరు, సీతారాం ఏచూరి పేరు ఒక చోట ప్రస్తావించారే కానీ తనను సహ కుట్రదారుగా పేర్కొనలేదని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter/apoorvanand
ఇప్పటికైనా అసలైన కుట్రదారులను పట్టుకుంటే మంచిది: అపూర్వానంద్
దిల్లీ అల్లర్ల కేసులో అనుబంధ చార్జిషీట్లో తన పేరు చేర్చడంపై దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ 'బీబీసీ'తో మాట్లాడారు.
‘‘దిల్లీ పోలీసులను సైద్ధాంతిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం చాలా ఆందోళనకర పరిణామం. ఫిబ్రవరిలో జరిగిన ఘర్షణల వెనుక నిజాన్ని దిల్లీ పోలీసులు బయటకు తెస్తారని అందరూ భావించారు. కానీ అలాంటిదేమీ చేయకుండా.. సీఏఏకు వ్యతిరేకంగా గళమెత్తిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొనేందుకు తమ అధికారాలను ఉపయోగించారు. ప్రభుత్వం చర్యలేవైనా వ్యతిరేకించే హక్కు పౌరులకు ఉంటుంది. అది చట్టమైనా కావొచ్చు లేదా ఇంకేదైనా కావొచ్చు. దాన్ని వ్యతిరేకించనంత మాత్రాన దేశ వ్యతిరేకులుగా ముద్ర వేయకూడదు.దిల్లీ ఘర్షణల వెనుకున్న అసలైన కుట్రదారులను దిల్లీ పోలీసులు పట్టుకుంటారని ఇప్పటికీ ఆశిస్తున్నాం. మృతులకు, క్షతగాత్రులకు, మొత్తం దిల్లీకి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం’’
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
‘నిందితుల వాంగ్మూలంలో చెప్పిన పేర్లు అవి’
''సీఏఏ వ్యతిరేక నిరసనలు, ఆ సందర్భంగా చేసిన ఉపన్యాసాలతో సంబంధముందని ఆరోపణలున్న ఒకరి వాంగ్మూలంలో ప్రస్తావనకు వచ్చిన పేర్లవి. వాంగ్మూలాల ఆధారంగా ఎవరినీ నిందితులుగా పేర్కొని అరెస్ట్ చేయం'' అని దిల్లీ పోలీసులు చెప్పారంటూ పీటీఐ వార్తాసంస్థ చెప్పింది.
ఇవి కూడాచదవండి:
- అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?
- వంట నూనెల్లో ఏది ఆరోగ్యానికి మంచిది.. ఆలివ్ నూనె గుండెకు మేలు చేస్తుందా
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








